AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: వేములవాడ రాజన్న సన్నిధిలో చిన్నారి కిడ్నాప్.. తల్లికి మద్యం తాగించి దారుణం

కరీంనగర్ పట్టణంలోని శాంతినగర్ కు చెందిన ఓ మహిళ నాలుగు రోజులుగా వేములవాడ రాజన్న ఆలయం మెట్ల వద్ద ఉంటోంది. కుటుంబ కలహాలతో లావణ్యను భర్త వదిలేసి వెళ్లిపోయాడు. ఇద్దరు కుమారులతో కలిసి..

Telangana: వేములవాడ రాజన్న సన్నిధిలో చిన్నారి కిడ్నాప్.. తల్లికి మద్యం తాగించి దారుణం
Vemulawada Temple
Sanjay Kasula
|

Updated on: May 16, 2022 | 1:23 PM

Share

ఉమ్మడి కరీంనగర్(Karimnagar) జిల్లాలోని వేములవాడ రాజన్న ఆలయం వద్ద శిశువు అపహరణకు గురైంది. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. 28 రోజుల పసివాడిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. కరీంనగర్ పట్టణంలోని శాంతినగర్ కు చెందిన ఓ మహిళ నాలుగు రోజులుగా వేములవాడ రాజన్న ఆలయం మెట్ల వద్ద ఉంటోంది. కుటుంబ కలహాలతో లావణ్యను భర్త వదిలేసి వెళ్లిపోయాడు. ఇద్దరు కుమారులతో కలిసి అక్కడే ఒంటరిగా ఉంటోంది. దీనిని గమనించిన దుండగులు..చిన్నారిని అపహరించేందుకు పథకం పన్నారు. ఆదివారం రాత్రి లావణ్యకు మద్యం తాగించి వేకువజామున శిశువును ఎత్తుకుని పరారయ్యారు. తన కుమారుడు కిడ్నాప్ అయ్యాడంటూ బాధితురాలు పోలీసులుకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి కంప్లైంట్ తో పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. దేవస్థానాల్లో ఇటీవల వరసగా జరుగుతున్న చిన్నారుల కిడ్నాప్ కేసులు భయాందోళన కలిగిస్తున్నాయి.

తిరుమల, యాదాద్రిలో ఇలాంటి ఘటనలు నిత్యకృత్యమయ్యాయి. ఇష్ట దైవాన్ని దర్శించుకునేందుకు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి వచ్చిన తమను.. ఇలా చిన్నారులను అపహరించే ముఠాలు భయం పుట్టిస్తున్నాయని పలువులు చెబుతున్నారు. పోలీసులు స్పందించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

తెలంగాణ వార్తల కోసం..

ఇవి కూడా చదవండి: AP: నీళ్లలో ఏవో తేలుకుంటూ వచ్చాయ్ అనుకోకండి.. అసలు విషయం తెలిస్తే కళ్లు తేలేస్తారు..

Telangana: బెట్టింగ్ వేసి ఉద్దరించినవాళ్లు ఎవరూ లేరు.. ఇతనిలా బలైపోయినవాళ్లు తప్ప