Telangana: తెలంగాణలో పర్యటించనున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. సంగారెడ్డిలో కీలక సమావేశం..

|

Mar 25, 2023 | 6:25 AM

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నెలాఖరులో తెలంగాణలో పర్యటించనున్నారు. ఈనెల‌ 31న సంగారెడ్డిలో పార్టీకి చెందిన తెలంగాణ ముఖ్యనేతలతో కీలక సమావేశం నిర్వహిస్తారు.

Telangana: తెలంగాణలో పర్యటించనున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. సంగారెడ్డిలో కీలక సమావేశం..
bjp national president jp nadda
Follow us on

BJP National President JP Nadda: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నెలాఖరులో తెలంగాణలో పర్యటించనున్నారు. ఈనెల‌ 31న సంగారెడ్డిలో పార్టీకి చెందిన తెలంగాణ ముఖ్యనేతలతో కీలక సమావేశం నిర్వహిస్తారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెలంగాణ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. ఎన్నికలకు సంబంధించి ఆయన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయబోతున్నట్లు తెలుస్తోంది.

కాగా, తెలంగాణలో ప్రస్తుతం రాజకీయాలు వేడెక్కాయి. బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. రెండు పార్టీల మధ్య ఎన్నడూ లేనంతగా మారాయి పరిస్థితులు. ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ ఎదుర్కొంటుండటంతో తెలంగాణలో రెండు పార్టీల మధ్య మాటల తూటాలు పతాకస్థాయికి చేరుకున్నాయి.

దీనికి తోడు టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో బీజేపీ దూకుడుగా వ్యవహరిస్తూ బీఆర్ఎస్‌ను ఇరుకునపెడుతోంది. ఈ తరుణంలో నడ్డా పర్యటనపై తెలంగాణలో రాజకీయంగా ఆసక్తి నెలకొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..