రేపు తెలంగాణలో పర్యటించనున్న జేపీ నడ్డా.. ఎందుకంటే

తెలంగాణలో అధికారంలోకి రావడం కోసం బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధానీ మోదీ, అమిత్ షా లాంటి వారు రాష్ట్రానికి వచ్చి సభల్లో పాల్గొనడం, ప్రసంగాలు చేయడమే ఇందుకు నిదర్శనం.

రేపు తెలంగాణలో పర్యటించనున్న జేపీ నడ్డా.. ఎందుకంటే
JP Nadda
Follow us

|

Updated on: Mar 30, 2023 | 6:40 PM

తెలంగాణలో అధికారంలోకి రావడం కోసం బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధానీ మోదీ, అమిత్ షా లాంటి వారు రాష్ట్రానికి వచ్చి సభల్లో పాల్గొనడం, ప్రసంగాలు చేయడమే ఇందుకు నిదర్శనం. అయితే ఇప్పుడు తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణలో పర్యటించనున్నారు. రేపు మధ్యాహ్నం శంషాబాద్ విమానాశ్రయంలో దిగి నేరుగా సంగారెడ్డికి రానున్నారు.

తెలంగాణలో 5 పార్టీ కార్యాలయాలను నడ్డా ప్రారంభించనున్నారు. అలాగే ఏపీలో కూడా రెండు కార్యాలయాలను ప్రారంభించనున్నారు. అయితే మొదటగా సంగారెడ్డికి చేరుకుని అక్కడ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత మిగతా ఆరు జిల్లాల కార్యాలయాలను వర్చువల్ గా ప్రారంభించనున్నారు. అనంతరం కార్యకర్తల్ని ఉద్దేశించి కూడా ప్రసంగించనున్నారు. మరోవైపు నడ్డా పర్యాటన కోసం బీజేపీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.. 

ఇవి కూడా చదవండి