AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఎండలకు తెగ తాగేస్తున్నారు.. తెలంగాణలో రికార్డు స్థాయిలో బీర్ల అమ్మకాలు..

లిక్కర్‌తో పోలిస్తే ఈ ఏడాది మార్చి, మేలో బీర్ల అమ్మకాలు అమాంతం పెరిగిపోయినట్లు రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ గణాంకాలు చెబుతున్నాయి.

Telangana: ఎండలకు తెగ తాగేస్తున్నారు.. తెలంగాణలో రికార్డు స్థాయిలో బీర్ల అమ్మకాలు..
Beer
Shaik Madar Saheb
|

Updated on: May 16, 2022 | 8:44 PM

Share

TS Excise Department: తెలంగాణంలో ఎండలు మంట పుట్టిస్తుంటే.. మద్యం ప్రియులు బీర్లు తెగ తాగేస్తున్నారు. ఉక్కపోతలు, వేడిగాలుల నుంచి కూల్‌ కూల్‌ బీరుతో సేద తీరుతున్నారు. గతేడాది మే నెలతో పోల్చితే ఈ వేసవి సీజన్‌లో బీర్ల అమ్మకాలు 90 శాతం ఎక్కువగా నమోదయ్యాయి. బీర్లతో పాటు బ్రాందీ, విస్కీ అమ్మకాలు కూడా పెరిగాయని అబ్కారీ శాఖ తెలిపింది. మార్చి నుంచి ఇప్పటిదాకా 6 వేల 702 కోట్ల రూపాయల బీర్ సేల్స్‌ జరిగాయి. ఈ ఏడాది మే నెలలో మద్యం ప్రియులు 10.64 కోట్ల లీటర్ల బీరును తాగేశారని గణాంకాలు పేర్కొంటున్నాయి. గతంలో కోవిడ్ కారణంగా రెండేళ్లుగా బీర్ సేల్స్‌ పడిపోయాయి. అయితే ఈ సారి మాత్రం అమాంతం పెరిగాయి. బీరు అమ్మకాల్లో రంగారెడ్డి ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. ఆ జిల్లాలో 2.38 కోట్ల లీటర్ల బీరు విక్రయం జరిగింది. 1.15కోట్ల లీటర్ల బీరు విక్రయంతో వరంగల్‌ సెకండ్‌ ప్లేస్‌లో ఉంది.

కరోనా భయాలు తొలగిపోవడం, ఎండలు మండుతుండటంతో మద్యం ప్రియులు చల్లని బీర్లు తాగుతూ రిలీఫ్‌గా ఫీలవుతున్నారు. అయితే, పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు కూడా పెద్ద ఎత్తున జరుగుతుండడంతో.. రాష్ట్రంలో మద్యం అమ్మకాలు భారీగా పెరగాయని పేర్కొంటున్నారు.

మార్చి నుంచి మే 14వ తేదీ వరకు.. మొత్తం 75 రోజుల్లో రూ.6,702 కోట్ల విలువైన 10.64 కోట్ల లీటర్ల బీర్లతో పాటు 6.44 కోట్ల లీటర్ల లిక్కర్‌ విక్రయం జరిగినట్లు అబ్కారీ శాఖ తెలిపింది. లిక్కర్‌తో పోలిస్తే ఈ ఏడాది మార్చి, మేలో బీర్ల అమ్మకాలు అమాంతం పెరిగిపోయినట్లు రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ గణాంకాలు చెబుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..