AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

త్వరలోనే జాతీయ పసుపు బోర్డు ప్రారంభోత్సవం.. అమిత్‌ షాను ఆహ్వానించిన ఎంపీ ధర్మపురి అర్వింద్..

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా జూన్ నెలాఖరున తెలంగాణకు రానున్నారు. నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవం.. పసుపు బోర్డు లోగోను ఆవిష్కరించనున్నారు.. ఈ మేరకు నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్, పసుపు బోర్డు చైర్‌పర్సన్‌ పల్లె గంగిరెడ్డి ఢిల్లీలో అమిత్‌ షాను కలిసి ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానించారు.

త్వరలోనే జాతీయ పసుపు బోర్డు ప్రారంభోత్సవం.. అమిత్‌ షాను ఆహ్వానించిన ఎంపీ ధర్మపురి అర్వింద్..
Arvind Dharmapuri meets Amit Shah
Gopikrishna Meka
| Edited By: |

Updated on: Jun 10, 2025 | 9:54 AM

Share

నిజామాబాద్​ జిల్లా కేంద్రంలో జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయాన్ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రారంభించనున్నట్లు ఎంపీ ధర్మపురి అర్వింద్​తెలిపారు. సోమవారం జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డితో కలిసి ఢిల్లీలో హోం మంత్రి అమిత్ షాను కలిశారు. కార్యాలయ ప్రారంభోత్సవ అధికారిక ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్​మాట్లాడుతూ.. పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభోత్సవంతో పాటు బోర్డు అధికారిక లోగోను కూడా అమిత్ షా ఆవిష్కరిస్తారని వెల్లడించారు.

పసుపు బోర్డు ఏర్పాటుపై ప్రధాని మోదీ ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారన్నారు. ఈ కార్యక్రమం జూన్ చివరి వారంలో ఉంటుందని స్పష్టం చేశారు. కచ్చితైన తేదీని త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించారు. రాష్ట్ర సర్కార్ సైతం ఈ విషయంలో తనవంతు పాత్రను పోషిస్తోంది. నిజామాబాద్​లోని రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని జాతీయ పసుపు బోర్డుకు కేటాయిస్తూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది.

దేశంలో పసుపు పండించే సమాజానికి సాధికారత, ఆవిష్కరణ, ప్రపంచ మార్కెట్‌ ప్రాప్యత, కొత్త శకానికి ప్రతీకగా ఈ లోగో ఉండనుందని ఎంపీ అర్వింద్ తెలిపారు. ఈ బోర్డు ప్రధానంగా పసుపు సాగుదారులకు ఒక మలుపుగా నిలువనుందని అర్వింద్ తెలిపారు. అలాగే సహకార సంఘాల స్ఫూర్తిని, రెతుల నేతృత్వంలోని అభివృద్ధిని మరింత బలోపేతం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
రెండు కళ్లు చాలవు.. ఈ అందమైన పూలను మీరెక్కడైనా చూశారా?
రెండు కళ్లు చాలవు.. ఈ అందమైన పూలను మీరెక్కడైనా చూశారా?
కొబ్బరి నీళ్లను ఫ్రిజ్‌లో పెడుతున్నారా?ఎక్స్‌పైర్ అవుతాయని తెలుసా
కొబ్బరి నీళ్లను ఫ్రిజ్‌లో పెడుతున్నారా?ఎక్స్‌పైర్ అవుతాయని తెలుసా
కోహ్లీ కంటే తోపుగాడు.. 19 ఏళ్లకే ప్రపంచ రికార్డ్.. కట్‌చేస్తే..
కోహ్లీ కంటే తోపుగాడు.. 19 ఏళ్లకే ప్రపంచ రికార్డ్.. కట్‌చేస్తే..
చీకటి పడ్డాక ఇల్లు శుభ్రం చేయకూడదంటారు ఎందుకు? అసలు కారణం ఇదే
చీకటి పడ్డాక ఇల్లు శుభ్రం చేయకూడదంటారు ఎందుకు? అసలు కారణం ఇదే
ఉద్యోగులకు శుభవార్త అందించిన తెలంగాణ ప్రభుత్వం
ఉద్యోగులకు శుభవార్త అందించిన తెలంగాణ ప్రభుత్వం
తులం బంగారం అమ్మితే షాపు యజమానికి ఎంత లాభమంటే..?
తులం బంగారం అమ్మితే షాపు యజమానికి ఎంత లాభమంటే..?
తెలంగాణలో పెట్రోల్, డీజిల్ సరఫరాపనై కీలక అప్‌డేట్
తెలంగాణలో పెట్రోల్, డీజిల్ సరఫరాపనై కీలక అప్‌డేట్
Buggottsavam: గోవిందరాజస్వామి బుగ్గోత్సవం వెనుక దాగిన రహస్యం ఏంటో
Buggottsavam: గోవిందరాజస్వామి బుగ్గోత్సవం వెనుక దాగిన రహస్యం ఏంటో
ఈ టాలీవుడ్ యాంకరమ్మకు హైదరాబాద్‌లో 20 కోట్ల లగ్జరీ విల్లా ఉందా?
ఈ టాలీవుడ్ యాంకరమ్మకు హైదరాబాద్‌లో 20 కోట్ల లగ్జరీ విల్లా ఉందా?
ఎంత మారిపోయింది భయ్యా.. అప్పుడు కుర్రాళ్ల ఆరాధ్య దేవత..
ఎంత మారిపోయింది భయ్యా.. అప్పుడు కుర్రాళ్ల ఆరాధ్య దేవత..