AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఓరుగల్లు రౌడీషీటర్లకు పోలీసుల వెరైటీ పనిష్మెంట్.. మండుటెండలో ఏం చేశారో వీడియో చూడండి..

ఓరుగల్లు పోలీసులు ఆకు రౌడిలా తోకలు కత్తిరిస్తున్నారు. కేవలం లాఠీకి పని చెప్పడం కాకుండా.. రౌడీషీటర్ల మైండ్‌సెట్‌ను మార్చేలా సరికొత్త కౌన్సిలింగ్ పద్ధతులను మొదలుపెట్టారు. అరాచకాలతో రెచ్చిపోతే అడ్రస్ లేకుండా చేస్తామని వార్నింగ్ ఇవ్వడమే కాదు.. మండుటెండలో రౌడీషీటర్ల చేత కవాతు నిర్వహించి పోలీస్ మార్క్ చూపించారు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Telangana: ఓరుగల్లు రౌడీషీటర్లకు పోలీసుల వెరైటీ పనిష్మెంట్.. మండుటెండలో ఏం చేశారో వీడియో చూడండి..
Warangal Rowdy Sheeters Parade
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: May 18, 2026 | 7:52 PM

Share

శాంతిభద్రతల పరిరక్షణలో వరంగల్ పోలీసులు రూటు మార్చారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న రౌడీషీటర్లపై ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు ప్రదర్శించిన ఖాకి మార్క్ ట్రీట్‌మెంట్ ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. రౌడీయిజం చేస్తే పోలీస్ మార్క్ ఎలా ఉంటుందో మండుటెండలో చమటలు పట్టించి మరీ చూపించారు. కమిషనరేట్ పరిధిలో మొత్తం 764 మంది రౌడీ షీటర్లు ఉన్నట్లు గుర్తించారు. వీరిలో ఈస్ట్ జోన్ పరిధిలో 275, వెస్ట్ జోన్ పరిధిలో 158, సెంట్రల్ జోన్ పరిధిలో 331 మంది రౌడీ షీటర్లు ఉన్నట్లు తెలిపారు.

ఏ కేటగిరీకి ఎలాంటి ట్రీట్‌మెంట్..?

రౌడీషీటర్ల ప్రవర్తనను బట్టి పోలీసులు వారిని మూడు విభాగాలుగా విభజించారు. ఎవరెవరిపై ఎలా నిఘా ఉంచాలో ఒక పక్కా ప్లాన్ సిద్ధం చేశారు:

యాక్టివ్: నిరంతరం నేరాల్లో పాల్గొంటూ, సివిల్ వివాదాల్లో తలదూరుస్తూ ప్రజలను భయపెట్టే వారు. వీరిపై 24 గంటల నిఘా ఉంటుంది.

ఇనాక్టివ్: ఒకప్పుడు నేరాలు చేసినా, ఇప్పుడు మారిన వారు. వీరు ప్రశాంతంగా జీవనోపాధి పొందుతుంటే, వారి రౌడీషీట్ తొలగించేందుకు పోలీసులు సానుకూలంగా ఉన్నారు.

న్యూట్రల్: అదను చూసి నేరాలు చేస్తూ, బయటకు మాత్రం మంచివారిలా కనిపించే వారు. వీరి కదలికలను పోలీసులు నిశితంగా గమనిస్తున్నారు.

మండుటెండలో మాస్ పనిష్మెంట్

ఈ మధ్య కాలంలో మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో కొన్ని హింసాత్మక ఘటనలు జరిగాయి. అమాయక ప్రజలపై ప్రతాపం చూపడం, యువతను రౌడీయిజం వైపు ప్రేరేపించడం వంటి ఫిర్యాదులు పెరగడంతో పోలీసులు చిర్రెత్తుకొచ్చారు. దీంతో రౌడీషీటర్లందరినీ స్టేషన్‌కు పిలిపించి, మిట్ట మధ్యాహ్నం 12 గంటల సమయంలో మండుటెండలో రోడ్డుపై కవాతు చేయించారు. మిల్స్ కాలనీ స్టేషన్ నుండి తహశీల్దార్ కార్యాలయం వరకు వీరందరినీ నడిపించి, ప్రజల ముందు వారి అసలు రూపం బయటపెట్టారు.

తహశీల్దార్ ముందు బైండోవర్..

తహశీల్దార్ కార్యాలయానికి తరలించిన రౌడీషీటర్లందరినీ మెజిస్ట్రేట్ ముందు బైండోవర్ చేశారు. అంటే భవిష్యత్తులో వీరు ఎలాంటి నేరంలో పాలుపంచుకున్నా భారీ జరిమానా లేదా నేరుగా జైలు శిక్ష తప్పదు. అంతేకాకుండా ప్రవర్తన మారని పక్షంలో జిల్లా బహిష్కరణ లేదా పీడీ యాక్ట్ నమోదు చేస్తామని పోలీసులు కరాఖండిగా చెప్పారు. ముఖ్యంగా కొత్తగా రౌడీయిజం వైపు ఆకర్షితులవుతున్న యువతకు పోలీసులు గట్టి హెచ్చరిక జారీ చేశారు. రౌడీల వెనుక తిరిగి జీవితాలను నాశనం చేసుకోవద్దని, రౌడీషీట్ ఒకసారి ఓపెన్ అయితే ప్రభుత్వ ఉద్యోగాలు రావని, పాస్‌పోర్ట్ వంటి సౌకర్యాలు రద్దవుతాయని అవగాహన కల్పించారు.

వీడియో చూడండి..

Follow Us