AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Antarctica: అంటార్కిటికా చేరుకున్న మొదటి వ్యక్తి ఎవరో తెలుసా? సరిగ్గా 110 ఏళ్ల క్రితం ఈ విజయం సాధించారు!

భూమి దక్షిణ ధృవంలో ఏముంటుంది? ఎలా ఉంటుంది? ఇది చాలా రోజులు శాస్త్రవేత్తలను వేధించిన ప్రశ్నలు. ఇలా ఉండొచ్చు.. అలా కావచ్చు అనే అనేక రకాల వాదనలు.

Antarctica: అంటార్కిటికా చేరుకున్న మొదటి వ్యక్తి ఎవరో తెలుసా? సరిగ్గా 110 ఏళ్ల క్రితం ఈ విజయం సాధించారు!
Antarcitca
KVD Varma
|

Updated on: Dec 14, 2021 | 3:52 PM

Share

Antarctica: భూమి దక్షిణ ధృవంలో ఏముంటుంది? ఎలా ఉంటుంది? ఇది చాలా రోజులు శాస్త్రవేత్తలను వేధించిన ప్రశ్నలు. ఇలా ఉండొచ్చు.. అలా కావచ్చు అనే అనేక రకాల వాదనలు. అయితే, నిజంగా ఎలా ఉంటుందో చూపించిన వ్యక్తీ నార్వేకు చెందిన రోల్డ్ అమాండ్సన్. ఈయన 1911 సంవత్సరంలో ఇదేరోజు అంటే డిసెంబర్ 14 తేదీన దక్షిణ ద్రువంపై కాలుమోపారు. అక్కడ నార్వేజియన్ జెండాను ఎగురవేశారు. రోల్డ్ అమాండ్సన్ తో పాటు అతని బృందం 14 మంది ఆరోజున దక్షిణ ద్రవం అంటార్కిటికాను చేరుకున్నారు. అన్నట్టు ఈ విజయయాత్రలో అమాండ్సన్ బృందంలో 52 కుక్కలు కూడా పాల్గొన్నాయి. అయితే, చివరకు అంటార్కిటికా చేరింది మాత్రం 16 కుక్కలు మాత్రమే. మిగిలిన కుక్కలు ఆ బృందంలో సభ్యులకు భోజనంగా మారిపోయాయి.

అమాండ్సన్ బృందం 19 అక్టోబర్ 1911న అంటార్కిటికాకు బయలుదేరి దాదాపు రెండు నెలలు ప్రయాణించిన తర్వాత అక్కడికి చేరుకుంది. అమాండ్సన్ తర్వాత, 1 నవంబర్ 1911న, నార్వే నుండి రాబర్ట్ స్కాట్ బృందం కూడా దక్షిణ ధృవం వైపు వెళ్ళింది. అయితే, అతని బృందం 17 జనవరి 1912న ఇక్కడికి చేరుకున్నప్పుడు.. అమాండ్సన్ అప్పటికే ఇక్కడికి చేరుకున్నాడని వారు తెలుసుకున్నారు. దక్షిణ ధృవం నుండి తిరిగి వస్తుండగా స్కాట్ మరణించాడు.

తరువాత చాలా సార్లు అమాండ్సన్ అంటార్కిటికా వెళ్లారు. ఈ క్రమంలో 18 జూన్ 1928న, ఉత్తర ధ్రువం నుండి తిరిగి వస్తున్న ఒక విమానం తప్పిపోయింది. ఇందులో 55 ఏళ్ల రోల్డ్ అమాండ్సన్ కూడా ఉన్నారు. ఇప్పటి వరకు ఆ విమానం జాడ దొరకలేదు. అదే విమాన ప్రమాదంలో అమాండ్సన్ మరణించినట్లు భావిస్తున్నారు. 2003లో, అమాండ్సన్, అతనితో పాటు విమానంలో ఉన్న వ్యక్తుల మృతదేహాలను కనుగొనే ప్రయత్నం జరిగింది, కానీ ఈ ప్రయత్నం విఫలమైంది.

మొత్తమ్మీద తొలిసారిగా అంటార్కిటికా చేరుకున్న ఇద్దరు వ్యక్తులూ అదే యాత్రలో ప్రాణాలు కోల్పోయారు. వీరు చూపించిన మార్గం తరువాత శాస్త్రవేత్తలకు అంటార్కిటికా చేరుకోవడానికి.. అక్కడ పరిశోధనలు నిర్వహించడానికి స్ఫూర్తినిచ్చింది.

డిసెంబరు 14 తేదీన చోటు చేసుకున్న ఇతర ముఖ్యమైన జాతీయ.. అంతర్జాతీయ ఈవెంట్‌లు ఇవే..

2008: అర్జెంటీనాతో అండర్-21 హాకీ టెస్ట్ సిరీస్‌లో భారత్ చివరి మ్యాచ్‌ను 4-4తో డ్రా చేసుకుంది.

2007: ఉత్తర మరియు దక్షిణ కొరియాల మధ్య 50 సంవత్సరాల తర్వాత రైలు సేవలు పునఃప్రారంభించబడ్డాయి.

2007: ముసాయిదా బాలి ఒప్పందం నుండి వివాదాస్పద నిబంధనలు తొలగించబడ్డాయి.

2003: మెక్సికోలోని మెరిడాలో 73 దేశాలు మొదటి అవినీతి నిరోధక ఒప్పందంపై సంతకం చేశాయి.

2003: తిక్రిత్‌లో ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్‌ను US సంకీర్ణ దళాలు అరెస్టు చేశాయి.

2002: అంధుల ప్రపంచకప్‌లో పాకిస్థాన్ దక్షిణాఫ్రికాను ఓడించింది.

2000: జార్జ్ వాకర్ బుష్ యునైటెడ్ స్టేట్స్ 43వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

1998: 23వ కైరో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అయేషా ధార్కర్‌కు తమిళ చిత్రం ‘టెర్రరిస్ట్’లో ఉత్తమ పాత్రకు ఉత్తమ జ్యూరీ అవార్డు.

1997: గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించేందుకు ప్రపంచంలోని అన్ని దేశాలు అంగీకరించాయి.

1995: బోస్నియా, సెర్బియా మరియు క్రొయేషియా నాయకులు ప్యారిస్‌లో డేటన్ ఒప్పందంపై సంతకం చేశారు, మూడున్నర సంవత్సరాల బాల్కన్ యుద్ధానికి ముగింపు పలికారు.

1983: జనరల్ హుస్సేన్ మొహమ్మద్ ఎర్షాద్ తనను తాను బంగ్లాదేశ్ అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు.

1982: బ్రిటిష్ కాలనీ జిబ్రాల్టర్ మరియు స్పెయిన్ మధ్య ఉన్న భారీ గ్రీన్ గేట్ 13 సంవత్సరాల తర్వాత తిరిగి తెరవబడింది.

1946: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ భారత రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

1924: ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రాజ్ కపూర్ జననం

1922: యునైటెడ్ కింగ్‌డమ్‌లో సాధారణ ఎన్నికలు.

1921: బనారస్ హిందూ విశ్వవిద్యాలయం ద్వారా అన్నీ బెసెంట్‌కి డాక్టర్ ఆఫ్ లెటర్స్ బిరుదు లభించింది.

Follow Us