AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mosquitoes: దోమలతో బాధపడుతున్నారా? ఈ దుంప రసంతో వాటిని ఎక్కడికక్కడ చంపేయవచ్చు!

దోమలను చంపేయడానికి కొత్త పద్ధతిని కనిపెట్టామని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. మలేరియా కరక దోమలను చంపడం కోసం కొత్త విధానాన్ని పరిశీలించిన శాస్త్రవేత్తలు అది విజయవంతం అయిందని చెబుతున్నారు.

Mosquitoes: దోమలతో బాధపడుతున్నారా? ఈ దుంప రసంతో వాటిని ఎక్కడికక్కడ చంపేయవచ్చు!
Malria Mosquito
KVD Varma
|

Updated on: Oct 17, 2021 | 11:55 AM

Share

Mosquitoes: దోమలను చంపేయడానికి కొత్త పద్ధతిని కనిపెట్టామని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. మలేరియా కరక దోమలను చంపడం కోసం కొత్త విధానాన్ని పరిశీలించిన శాస్త్రవేత్తలు అది విజయవంతం అయిందని చెబుతున్నారు. ఏ ప్రయోగాలు చేసింది స్వీడిష్ శాస్త్రవేత్తలు. దోమలకు విషపూరిత దుంప రసం ఇస్తారు. ఇది మనవ రక్తంలా ఉంటుంది. దీంతో అది తాగిన దోమలు కొద్ది సమయంలోనే చచ్చిపోతాయి. ఈ ప్రయోగాన్ని స్వీడిష్ కంపెనీ మాలిక్యులర్ అట్రాక్షన్ చేసింది. ప్రస్తుతం దోమలను నియంత్రించడం కష్టమవుతోందని, అయితే కొత్త ప్రయోగంతో మలేరియా వ్యాప్తి చెందే దోమల సంఖ్యను తగ్గించడం సులభమవుతుందని కంపెనీ చెబుతోంది.

దోమలు ఎలా చనిపోయాయి, ఎన్ని రకాల దోమలపై ఈ ప్రయోగం ప్రభావవంతంగా ఉంటుంది అదేవిధంగా ప్రపంచంలో మలేరియా పరిస్థితి ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోండి …

మలేరియాతో బాధపడుతున్న రోగుల రక్తంలో HMBPP అణువు కనుగొన్నారు. ఈ అణువు ఒక రకమైన వాసనను ఇస్తుంది. దీని కారణంగా దోమలు ఆకర్షితం అవుతాయి. దీంతో మనిషిని చేరిన దోమ మానవ రక్తాన్ని ఎక్కువగా తాగుతాయి. దోమలను ఓడించడానికి శాస్త్రవేత్తలు ఈ లక్షణాన్ని ఉపయోగించారు. దీని కోసం, మొక్క నుండి సేకరించిన HMBPP అణువు, ప్రత్యేక విషాన్ని దుంప రసంలో కలిపారు. ఈ మిశ్రమాన్ని తయారు చేసిన తర్వాత, దోమలు దాని వైపు ఆకర్షితం అయ్యాయి. ఈ ద్రవాన్ని ఎక్కువగా తాగాయి. కొంతసేపటి తర్వాత అది తాగిన దోమలన్నీ చనిపోయాయి. ఇతర జాతుల కీటకాలను ఆకర్షించదు HMBPP అణువు ప్రత్యేక లక్షణం ఏమిటంటే ఇది ఇతర కీటకాలను ఆకర్షించదు. అందువల్ల దోమలను తొలగించడానికి దీనిని ఉపయోగించవచ్చు. ఇతర హానికరమైన పురుగుమందులతో పోలిస్తే, దోమలను చంపడానికి ఈ మిశ్రమం చాలా తక్కువ మొత్తంలో అవసరం. జికా, వెస్ట్ నైలు వైరస్, డెంగ్యూ, ఎల్లో ఫీవర్ వంటి వ్యాధులకు ఈ మిశ్రమం పనిచేయదు.

మలేరియాను ఆపడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మలేరియాను నివారించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రపంచంలోని మొట్టమొదటి మలేరియా వ్యాక్సిన్‌ను అక్టోబర్ 7 న ప్రవేశపెట్టింది. దీనిని ఫార్మా కంపెనీ గ్లాక్సోస్మిత్‌క్లైన్ తయారు చేసింది. ఈ టీకా ముఖ్యంగా మలేరియా కేసులు ఎక్కువగా ఉన్న ఆఫ్రికా ప్రాంతాల ప్రజలకు వర్తిస్తుంది.

WHO ప్రకారం, మలేరియాకు కారణం ప్లాస్మోడియం ఫాల్సిపారమ్ అనే పరాన్నజీవి. అది దోమలకు సోకుతుంది. వ్యాధి సోకిన అనాఫిలిస్ దోమ ఒక మనిషిని కుట్టినపుడు , ఈ పరాన్నజీవి మానవుడికి చేరుతుంది మరియు అతను మలేరియాతో పోరాడతాడు. మలేరియా సాధారణ లక్షణాలు జ్వరం, తలనొప్పి, వణుకు, కండరాల నొప్పి, వికారం.

ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం మలేరియా 4 లక్షల మరణాలకు కారణమవుతుంది. వరల్డ్ మలేరియా రిపోర్ట్ 2020 ప్రకారం, 90 శాతం మలేరియా మరణాలు ఆఫ్రికాలో సంభవించాయి, 2,65,000 మందికి పైగా పిల్లలు ఉన్నారు. 2000 లో 7,36,000 మలేరియా కేసులు నమోదయ్యాయి, ఇది 2018 నాటికి 4,11,000 కి తగ్గింది. 2019 లో, 4,09,000 మలేరియా కేసులు నమోదయ్యాయి.

Also Read: Festival Special Trains: తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. నేడు, రేపు ప్రత్యేక రైళ్లు.. వివరాలివే..

Energy Crisis: రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ప్రపంచవ్యాప్తంగా అతి పెద్ద ఎనర్జీ సంక్షోభం.. కారణాలు తెలుసుకోండి!