AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Whatsapp: వాట్సాప్‌ అంతరాయంపై రంగంలోకి భారత ఐటీ శాఖ.. ఏం జరిగిందో నివేదిక ఇవ్వాలంటూ..

వాట్సాప్‌ సేవలకు అంతరాయంపై భారత ప్రభుత్వం స్పందించింది. ఈ విషయమై ఐటీ శాఖ మెటా ఇండియాను నివేదిక కోరింది. వాట్సాప్‌ సేవల అంతరాయం వెనకాల అసలు కారణం ఏంటన్న దానిపై...

Whatsapp: వాట్సాప్‌ అంతరాయంపై రంగంలోకి భారత ఐటీ శాఖ.. ఏం జరిగిందో నివేదిక ఇవ్వాలంటూ..
Whatsapp Meta India
Narender Vaitla
|

Updated on: Oct 25, 2022 | 3:51 PM

Share

ప్రముఖ మెసేజింగ్ యాప్‌ వాట్సాప్‌ సేవలు నిలిచిపోవడంతో ప్రపంచమంతా ఒక్కసారిగా స్థంభించినట్లైంది. కేవలం రెండు గంటలు సేవలకు అంతరాయం ఏర్పడడంతో యూజర్లు పెద్ద ఎత్తున ఆందోళన చెందారు. మెసేస్‌లు, స్టేటస్‌లు అప్‌డేట్‌ కాకపోవడంతో గందరగోళ వాతావరణం నెలకొంది. ఇదిలా ఉంటే గతంలోనూ వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ సేవలకు అంతరాయం ఏర్పడ్డా.. ఇలా ఏకంగా రెండు గంటల సుదీర్ఘ సమయంలో సేవలు నిలిచిపోవడం మాత్రం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అయితే వాట్సాప్‌ మాతృ సంస్థ మెటా ఎట్టకేలకు వాట్సాప్‌ సేవలను తిరిగి పునరుద్ధరించింది.

ఈ నేపథ్యంలోనే వాట్సాప్‌ సేవలకు అంతరాయంపై భారత ప్రభుత్వం స్పందించింది. ఈ విషయమై ఐటీ శాఖ మెటా ఇండియాను నివేదిక కోరింది. వాట్సాప్‌ సేవల అంతరాయం వెనకాల అసలు కారణం ఏంటన్న దానిపై స్పష్టత ఇవ్వాలని కోరింది. భారత్‌లో వాట్సాప్‌కు 48 కోట్ల యూజర్లు ఉన్న విషయం తెలిసిందే. ఇండియాలో రోజుకి 10 వేల కోట్ల మెసేజ్‌లు పంపించుకుంటున్నారు. ఇదిలా ఉంటే వాట్సాప్‌ అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి ఇలా రెండు గంటలపాటు సేవలకు అంతరాయం కలగడంపై మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టతనివ్వలేదు.

దీంతో ఐటీశాఖ మెటా ఇండియాను వివరణ కోరినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే వాట్సాప్‌ సేవలు ఫోన్‌లో పునరుద్ధరించిన తర్వాత కూడా వెబ్‌ వెర్షన్‌లో కాసేపు సేవలకు అంతరాయం ఏర్పడింది. ఈ విషయమై యూజర్లు ట్విట్టర్‌లో పెద్ద ఎత్తున ట్వీట్‌లు చేశారు. అయితే కాసేపటి తర్వాత వాట్సాప్‌ వెబ్‌ వెర్షన్‌ సమస్య కూడా పరిష్కారమైనట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..