మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చిన హెచ్టీసీ
గత కొంత కాలంగా స్మార్ట్ఫోన్ మార్కెట్కు దూరమైన హెచ్టీసీ,, మళ్లీ మార్కెట్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. అదిరిపోయే ఫీచర్లతో సరికొత్త స్మార్ట్ఫోన్ను భారత మార్కెట్లో విడుదల చేసింది ఆ సంస్థ. హెచ్టీసీ వైల్ట్ఫైర్ ఎక్స్ అన్న కొత్త మోడల్ ఫోన్ను ప్రవేశపెట్టింది. ఇందులో రెండు వేరియంట్లు ఉన్నాయి. 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజీ రకం ధర రూ.9,999 కాగా, 4జీబీ ర్యామ్, 128 జీబీ వేరియంట్ ధర రూ.12,999. అయితే వీటిని ఈ నెల 22 […]
గత కొంత కాలంగా స్మార్ట్ఫోన్ మార్కెట్కు దూరమైన హెచ్టీసీ,, మళ్లీ మార్కెట్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. అదిరిపోయే ఫీచర్లతో సరికొత్త స్మార్ట్ఫోన్ను భారత మార్కెట్లో విడుదల చేసింది ఆ సంస్థ. హెచ్టీసీ వైల్ట్ఫైర్ ఎక్స్ అన్న కొత్త మోడల్ ఫోన్ను ప్రవేశపెట్టింది. ఇందులో రెండు వేరియంట్లు ఉన్నాయి. 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజీ రకం ధర రూ.9,999 కాగా, 4జీబీ ర్యామ్, 128 జీబీ వేరియంట్ ధర రూ.12,999. అయితే వీటిని ఈ నెల 22 నుంచి ఫ్లిప్కార్ట్ ద్వారా కొనుగోలు చేసుకోవచ్చు.
కీ ఫీచర్లు.. డిస్ ప్లే : 6.22 ఇంచులు ప్రాసెసర్ : మెడియా టెక్ హెలియో పీ22 ఫ్రంట్ కెమెరా : 8 మెగా పిక్సల్ రేయర్ కెమెరా : 12 మెగా పిక్సల్ అయితే వెనుకల ఉన్న కెమెరా ట్రిపుల్ కెమెరా. ఇందులో 12,8,5 మెగా పిక్సల్స్తో నిక్షిప్తమై ఉంది. ఇక బ్యాటరీ 3,300 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.