ట్విట్టర్, వాట్సాప్, టిక్‌టాక్‌లపై దేశంలోనే తొలిసారిగా కేసు నమోదు

ట్విట్టర్, వాట్సాప్, టిక్‌టాక్‌లపై దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. సోషల్ మీడియా గ్రూప్స్‌లో కొందరు సున్నితమైన, మతపరమైన అంశాలను రెచ్చగొడుతూ..

ట్విట్టర్, వాట్సాప్, టిక్‌టాక్‌లపై దేశంలోనే తొలిసారిగా కేసు నమోదు
Follow us

| Edited By:

Updated on: Feb 28, 2020 | 8:27 AM

ట్విట్టర్, వాట్సాప్, టిక్‌టాక్‌లపై దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. సోషల్ మీడియా గ్రూప్స్‌లో కొందరు సున్నితమైన, మతపరమైన అంశాలను రెచ్చగొడుతూ, దేశ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని ఎస్ శ్రీశైలం అనే సీనియర్ జర్నలిస్ట్ నాంపల్లి కోర్టులో ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కోర్టు.. వాటిపై కేసు పెట్టాలంటూ పోలీసులను ఆదేశించింది. కోర్టు ఉత్తర్వుల ప్రకారం హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు.

గతేడాది డిసెంబర్ 12న భారత పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన సీఏఏ చట్టానికి వ్యతిరేకంగా సదరు సోషల్ మీడియా వేదికగా వార్ జరిగింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన శాసనాన్ని ధిక్కరిస్తూ దేశ వ్యతిరేక ప్రచారం చేస్తున్నాయని జర్నలిస్ట్ శ్రీశైలం హైదరాబాద్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. నగర పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. అలాగే కొన్ని వాట్సాప్ గ్రూప్, టిక్‌ టాక్ వీడియోలు, ట్వీట్ల వివరాలను కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వీటిని పరిశీలించిన న్యాయస్థానం సైబర్ క్రైమ్ పోలీసులకు రిఫర్ చేశారు. దీంతో వారు ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్లు 153A, 121 A, 124, 124A, 294, 295 A, 505, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 200, సెక్షన్ 66A కింద కేసులు నమోదు చేశారు.

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?