AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

80 వేల ఏళ్ల క్రితమే భారత్‌లో మానవ సంచారం.. ఆధారాలు ఇవే

80 వేల ఏళ్ల క్రితమే భారత్‌లో మానవ సంచారం జరిగినట్టు ఆధారాలు కనుగొన్నారు పురావస్తు శాఖ శాస్త్రవేత్తలు. ఉత్తర భారతంలో ఉన్న సోన్ నది సమీపంలో ఇటీవల కొందరు..

80 వేల ఏళ్ల క్రితమే భారత్‌లో మానవ సంచారం.. ఆధారాలు ఇవే
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 27, 2020 | 12:58 PM

Share

80 వేల ఏళ్ల క్రితమే భారత్‌లో మానవ సంచారం జరిగినట్టు ఆధారాలు కనుగొన్నారు పురావస్తు శాఖ శాస్త్రవేత్తలు. ఉత్తర భారతంలో ఉన్న సోన్ నది సమీపంలో ఇటీవల కొందరు పురావస్తు శాఖ అధికారులు దాబా అనే ప్రాంతం నుంచి కొన్ని రాతి పనిముట్లను సేకరించారు. వాటిని అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు.. పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా భారత్‌లో మానవుల సంచారం ఎప్పుడు మొదలైందన్నదానిపై క్లారిటీ ఇచ్చారు.

దాదాపు 80 వేల ఏళ్ల క్రితమే ఇండియాలో మానవులు సంచరించినట్లు తమ స్టడీలో తేలిందన్నారు. వస్తువులు లేదా ఆహారపదార్థాలను ముక్కలుగా కోసేందుకు ఆది మానవులు రాళ్లతో తయారైన పనిముట్లను వాడినట్లు నిర్థారించారు. మధ్యరాతి యుగంలో నియాండర్‌తాల్(ఆదిమానవులు) వాడిన పనిముట్ల తరహాలోనే ఇవి కూడా వారు ఓ అభిప్రాయానికి వచ్చారు. అయితే అప్పుడు సంచరించిన మానవులు ఈ జాతి వారు అవునా.. కాదా.. అన్న అంశాన్ని మాత్రం తేల్చలేకపోయారు. మరి వీటిని ఎలా కనుగొన్నారు అని సందేహం వచ్చింది కదా. ‘లుమినిసెన్స్’ అనే టెక్నిక్ ద్వారా ఆ రాతి పనిముట్లను అధ్యయనం చేయడం ద్వారా.. వాటి కాలాన్ని అంచనా వేశారు.

అయితే.. సుమత్రా దీవుల్లోని దాదాపు 75 వేల ఏళ్ల సంవత్సరాల క్రితం పేలిన ‘తోబా అగ్నిపర్వతం’ సంఘటనను కూడా పరిగణనలోకి తీసుకున్నారు పురావస్తు శాఖ శాస్త్రవేత్తలు. ఈ అగ్నిపర్వతం పేలిన ఫలితంగా దట్టమైన రాళ్లు, ధూళితో సమీప ప్రాంతమంతా నిండిపోయింది. ఆ రాళ్లన్నీ భారత ఉపఖండంలో పడ్డాయి. ఈ ప్రకృతి వైపరీత్యం కారణంగా కొంతమంది ఆదిమానవులు చనిపోయి ఉండవచ్చని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆఫ్రికా నుంచి వలస వచ్చిన మానవులకు, సెంట్రల్ ఇండియాకు లింకు ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఏదేమైనా ఆదిమానవుల జాతికి సంబంధించిన సరికొత్త విషయాలు ఇప్పుడు బయట పడటం విశేషం.

ఇది కూడా చదవండి: పండ్ల తోటలను నాశనం చేస్తోన్న కొత్త వైరస్.. ఏపీలో మొదటి కేసు!