AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దాదా చేతిలో… ధోనీ భవితవ్యం…?

భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ క్రికెట్ భవితవ్యం అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ తర్వాత జరిగిన ఏ సిరీస్‌కు, ఏ మ్యాచ్‌కు ధోనీ అందుబాటులో లేడు. మిస్టర్ కూల్‌ను సెలక్టర్లు ఎంపిక చేయకుండా పక్కన పెట్టేశారు అనే చర్చ సాగుతోంది. అయితే, దీనిపై ధోనీ ఎక్కడా స్పందించిన సందర్భాలు లేవు.. ఇక మిస్టర్ కూల్ భవితవ్యం తేల్చడం ఇప్పుడు మాజీ కెప్టెన్, బీసీసీఐకి కాబోయే అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అలియాస్ దాదా […]

దాదా చేతిలో... ధోనీ భవితవ్యం...?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 17, 2019 | 5:49 PM

Share

భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ క్రికెట్ భవితవ్యం అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ తర్వాత జరిగిన ఏ సిరీస్‌కు, ఏ మ్యాచ్‌కు ధోనీ అందుబాటులో లేడు. మిస్టర్ కూల్‌ను సెలక్టర్లు ఎంపిక చేయకుండా పక్కన పెట్టేశారు అనే చర్చ సాగుతోంది. అయితే, దీనిపై ధోనీ ఎక్కడా స్పందించిన సందర్భాలు లేవు.. ఇక మిస్టర్ కూల్ భవితవ్యం తేల్చడం ఇప్పుడు మాజీ కెప్టెన్, బీసీసీఐకి కాబోయే అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అలియాస్ దాదా కోర్టులోకి వెళ్లింది..

బంగ్లాదేశ్‌తో నవంబరు 3 నుంచి మూడు టీ20ల సిరీస్‌లో భారత్ తలపడనుండగా.. ఈ సిరీస్ కోసం ఈనెల 24న జట్టుని భారత సెలక్టర్లు ఎంపిక చేయనున్నారు. అప్పటిలోపు బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ బాధ్యతలు చేపట్టనున్నాడు. దీంతో.. ముంబయిలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో ఈ నెల 24న జరిగే సెలక్టర్ల సమావేశానికి అధ్యక్షుడి హోదాలో హాజరుకానున్న గంగూలీ.. ధోనీ భవితవ్యం గురించి సెలక్టర్లతో చర్చిస్తానని స్పష్టం చేశాడు.ధోనీ గురించి సెలక్టర్ల అభిప్రాయం తీసుకున్న తర్వాత ధోనీతో కూడా మాట్లాడనున్నట్టు గంగూలీ వెల్లడించారు. అయితే, ఈ సమావేశంలో సెలక్టర్లతో పాటు కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా పాల్గొనే అవకాశం ఉంది. ఇక, కొన్ని నిబంధనల్లో మార్పులతో హెడ్‌ కోచ్ రవిశాస్త్రి అందుబాటులో ఉండకపోవచ్చారు దాదా. మొత్తానికి మిస్టర్ కూల్ వ్యవహారం త్వరలోనే ఓ కొలిక్కి రానుంది.