కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్.. సీరీస్ కైవసం
టీమిండియా సారథి.. విరాట్ కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడటంతో.. భారత్ మూడు వన్డేల సీరీస్ను కైవసం చేసుకుంది. వెస్టీండీస్తో జరిగిన మూడు వన్డేల సీరీస్లో తొలి మ్యాచ్ వర్షంతో రద్దవ్వగా.. రెండో మ్యాచ్ భారత్ నెగ్గింది. ఇక చివరి మ్యాచ్కు ప్రారంభంలోనే వరుణుడు ఆటంకం కలిగించడంతో.. మ్యాచ్ను 35 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్..35 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. ఓపెనర్లు క్రిస్ గేల్ 41 బంతుల్లో 72 పరుగులు […]
టీమిండియా సారథి.. విరాట్ కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడటంతో.. భారత్ మూడు వన్డేల సీరీస్ను కైవసం చేసుకుంది. వెస్టీండీస్తో జరిగిన మూడు వన్డేల సీరీస్లో తొలి మ్యాచ్ వర్షంతో రద్దవ్వగా.. రెండో మ్యాచ్ భారత్ నెగ్గింది. ఇక చివరి మ్యాచ్కు ప్రారంభంలోనే వరుణుడు ఆటంకం కలిగించడంతో.. మ్యాచ్ను 35 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్..35 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. ఓపెనర్లు క్రిస్ గేల్ 41 బంతుల్లో 72 పరుగులు చేయగా.. లూయిస్ 29 బంతుల్లో 43 పరుగులతో మెరుపు ఆరంభాన్నిచ్చారు. దీంతో 35 ఓవర్లలో భారీ స్కోర్ నమోదు చేసింది. భారత బౌలర్లలో ఖలీల్ మూడు, షమి రెండు వికెట్లు పడగొట్టారు. అయితే డక్వర్త్ లూయిస్ ప్రకారం భారత్ లక్ష్యాన్ని 35 ఓవర్లలో 255 పరుగులుగా నిర్దేశించారు.
దీంతో 255 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు రంగంలోకి దిగిన భారత్.. ఆరంభంలోనే రోహిత్ వికెట్ కోల్పోయి కష్టాల్లో పడింది. అనంతరం సారథి విరాట్ కోహ్లీ 99 బంతుల్లో 114 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఇక యువ బ్యాట్స్మెన్ శ్రేయస్ అయ్యర్ కూడా మరోసారి రెచ్చపోయాడు. 41 బంతుల్లో 65 పరుగులు చేశాడు. 32.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి కోహ్లీసేన లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో వెస్టిండీస్తో జరిగిన ఆఖరి వన్డేలో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను భారత్ 2-0తో కైవసం చేసుకుంది. మొదటి వన్డే వర్షం కారణంగా రద్దైంది.