Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్కు అంతా రెడీ.. ప్రారంభ వేడుక.. ఎన్ని గంటలకో తెలుసా..
Tokyo olympics First-day: టోక్యో ఒలింపిక్స్కు అంతా రెడీ అయ్యింది. శుక్రవారం టోక్యో ఒలింపిక్స్ కలర్ఫుల్గా ప్రారంభమవుతాయి.
టోక్యో ఒలింపిక్స్కు అంతా రెడీ అయ్యింది. శుక్రవారం టోక్యో ఒలింపిక్స్ కలర్ఫుల్గా ప్రారంభమవుతాయి. అయితే కరోనా కారణంగా వేడుకలకు ప్రేక్షకులను అనుమతించడం లేదు. ఈసారి ప్రేక్షకులు లేకుండానే విశ్వ క్రీడలు నిర్వహిస్తున్నారు. ప్రారంభోత్సవానికి భారత్ నుంచి 22 మంది క్రీడాకారులు, ఆరుగురు అధికారులను మాత్రమే అనుమతిస్తున్నారు. ప్రారంభోత్సవాన్ని కేవలం 950 మాత్రమే వీక్షిస్తారు. ప్రపంచదేశాల నుంచి 20 మంది విశిష్ట అతిధులు హాజరవుతారు.
భారత కాలమాన ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు ఒలింపిక్స్ వేడుకలు ప్రారంభమవుతాయి. జపాన్ జక్రవర్తి అకిహితో ఒలింపిక్ వేడుకలను ప్రారంభిస్తారు. అమెరికా ఫస్ట్ లేడీ జిల్ బైడెన్ కూడా ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా హాజరువుతన్నారు. జపాన్ ప్రధాని సుగా ఆమెకు ఘనస్వాగతం పలికారు.
మొదటి రోజు మొదటి ఆట…
టోక్యో ఒలింపిక్స్లో మొదటి రోజు ఆర్చర్స్తో మొదలవుతుంది. భారతీయ ఆర్చర్స్ కోసం మొదటి రోజు- మొదటి ప్రదర్శన అవుతుంది. భారత ఆర్చర్స్ పతకం కోసం తమ అన్వేషణను మొదలు పెడుతారు. ఆర్చరీ ర్యాంకింగ్ రౌండ్లు శుక్రవారం నుండే ప్రారంభమవుతాయి. దీపికా కుమారి, అతను దాస్ వంటి అగ్ర భారతీయ ఆర్చర్లు ఈ పోటీల్లో తమ అదృష్టాన్ని పరిక్షించుకుంటారు. వీరికి పతకాలు ఖాయం అంటున్నారు భారత అభిమానులు.
టోక్యో ఒలింపిక్స్ నిర్వహణలో తెలుగువాళ్లు…
టోక్యో ఒలింపిక్స్ నిర్వహణలో తెలుగువాళ్లు కూడా భాగస్వామ్యులయ్యారు. టోక్యో ఒలింపిక్స్కు వాలంటీర్లుగా పనిచేస్తున్నారు. ఈసారి ఎన్నడు లేని విధంగా భారత్ నుంచి 127 మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు. అధికారులు, కోచ్లు, ఇతర సహాయ సిబ్బందిని కలిపితే వీళ్ల సంఖ్య 228కి చేరుతుంది.
2016లో జరిగిన రియో ఒలింపిక్స్లో కేవలం రెండే మెడల్స్ గెలిచి తీవ్రంగా నిరాశ పరిచిన ఇండియా.. ఈసారి వాటి సంఖ్యను పెంచుకోవాలన్న పట్టుదలతో ఉంది. రియో ఒలింపిక్స్లో ఇండియా తీవ్రంగా నిరాశపరిచింది.
బ్యాడ్మింటన్లో సింధు సిల్వర్ మెడల్, రెజ్లింగ్లో సాక్షి మాలిక్ బ్రాంజ్ మెడల్ గెలిచారు. ఇక ఏ గేమ్లోనూ మెడల్స్ రాలేదు. కానీ ఈసారి మాత్రం చరిత్రను తిరగరాసే అవకాశాలు చాలానే కనిపిస్తున్నాయి.