AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Narendra Modi: నేడు పారా ఒలింపిక్స్‌ క్రీడాకారులతో ప్రధాని మోదీ భేటీ.. వీక్షించాలంటూ ట్వీట్..

Tokyo Paralympics 2020: పారా ఒలింపిక్స్‌ - 2020 కోసం భారత్‌ నుంచి 54 మంది అథ్లెట్ల బృందం జపాన్‌ వెళ్లనుంది. ఈ సందర్భంగా వారితో ప్రధానమంత్రి నరేంద్రమోదీ

PM Narendra Modi: నేడు పారా ఒలింపిక్స్‌ క్రీడాకారులతో ప్రధాని మోదీ భేటీ.. వీక్షించాలంటూ ట్వీట్..
Pm Narendra Modi
Shaik Madar Saheb
|

Updated on: Aug 17, 2021 | 8:08 AM

Share

Tokyo Paralympics 2020: పారా ఒలింపిక్స్‌ – 2020 కోసం భారత్‌ నుంచి 54 మంది అథ్లెట్ల బృందం జపాన్‌ వెళ్లనుంది. ఈ సందర్భంగా వారితో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సంభాషించనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీ పారా అథ్లెట్లతో సంభాషించనున్నారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్విట్ చేశారు. పారా అథ్లెట్లతో సంభాషించేందుకు ఎదురు చూస్తున్నానని.. వీరంతా అత్యుత్తమ నైపుణ్యం కలిగిన ఆటగాళ్లంటూ పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించాలని ప్రధాని మోదీ ట్విట్‌లో క్రీడాభిమానులను కోరారు.

టోక్యోలో పారా ఒలింపిక్స్‌ పోటీలు ఈ నెల 24 నుంచి సెప్టెంబర్‌ 5వ తేదీ వరకు జరగనున్నాయి. భారత్‌ నుంచి 54 మంది పారా అథ్లెట్ల బృందం టోక్యోకు వెళ్తుండగా.. ఈ అథ్లెట్లు తొమ్మిది రకాల పోటీల్లో ప్రాతినిథ్యం వహించనున్నారు. మొదటగా.. ఆగస్టు 27న భారత క్రీడాకారులు అర్చరీ ఈవెంట్‌లో పాల్గొననున్నారు. కాగా.. పారా ఒలింపిక్స్‌లో భారత్‌ నుంచి ఇంత పెద్ద మొత్తంలో క్రీడాకారులు పాల్గొంటుండడం ఇదే తొలిసారని క్రీడా మంత్రిత్వశాఖ పేర్కొంది. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని మోదీతోపాటు.. కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ సైతం పాల్గొననున్నారు.

కాగా.. ఇటీవల టోక్యో ఒలింపిక్స్ ముగిసిన విషయం తెలిసిందే. ఈ ఒలింపిక్స్ భారత క్రీడాకారులు మెరుగైన ప్రతిభ కనబర్చారు. ఈ ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రోయర్ నీరజ్‌ చోప్రా బంగారు పతకం గెలవగా.. మీరాబాయి, రవి దహియా రజత పతాకాలు, పీవీ సింధు, లవ్లీనా, బజ్‌రంగ్‌ పునియా కాంస్య పతకాలు సాధించారు. దీంతోపాటు.. పురుషుల హాకీ జట్టు కాంస్య పతకం సాధించింది.

Also Read:

MS Dhoni Fan: ‘తలైవా’ ధోనిని కలిసేందుకు 1400 కిలోమీటర్లు కాలినడకన వెళ్లిన ఫ్యాన్.. ఫైనల్‌గా..?

తుఫాన్ ఇన్నింగ్స్ ఆడిన ధోని శిష్యులు.. ట్రోఫీ గెలవడంతో కీలక పాత్ర.. వారెవరంటే?

IPL 2021: తాలిబన్ల నియంత్రణలో ఆఫ్ఘనిస్తాన్.. రషీద్ ఖాన్, నబీలపై ప్రభావం పడనుందా.. ఐపీఎల్‌లో వీరి భవితవ్యం?

Follow Us
ఆలయాలే టార్గెట్..సింగిల్‌గా ఎంట్రీ ఇచ్చి సర్వం దోచేస్తున్న కేటుగా
ఆలయాలే టార్గెట్..సింగిల్‌గా ఎంట్రీ ఇచ్చి సర్వం దోచేస్తున్న కేటుగా
ఇంటి ముందు డైలీ కళ్లాపి చల్లుతున్నారా..? అయితే జాగ్రత్త..
ఇంటి ముందు డైలీ కళ్లాపి చల్లుతున్నారా..? అయితే జాగ్రత్త..
భోజనం చేసే ముందు దేవుడిని ఎందుకు స్మరించుకోవాలి? ఈ భారతీయ..
భోజనం చేసే ముందు దేవుడిని ఎందుకు స్మరించుకోవాలి? ఈ భారతీయ..
ఆ రూమ్‌లోకి వెళ్తే ప్రాణాలతో తిరిగి రాలేరు.. అస్సలు మిస్ అవ్వకండి
ఆ రూమ్‌లోకి వెళ్తే ప్రాణాలతో తిరిగి రాలేరు.. అస్సలు మిస్ అవ్వకండి
మైథాలజీకి యానిమేషన్.. బాక్సాఫీస్ న్యూ సెన్సేషన్..!
మైథాలజీకి యానిమేషన్.. బాక్సాఫీస్ న్యూ సెన్సేషన్..!
భారత్‌లో మరో రూ.2,800 కోట్లకు పైగా పెట్టుబడి.. ఆస్ట్రేలియా సంస్థ
భారత్‌లో మరో రూ.2,800 కోట్లకు పైగా పెట్టుబడి.. ఆస్ట్రేలియా సంస్థ
రేపే యోగిని ఏకాదశి ఈ 4 తప్పులు చేస్తే వ్రతం భంగమే.. విష్ణుమూర్తి
రేపే యోగిని ఏకాదశి ఈ 4 తప్పులు చేస్తే వ్రతం భంగమే.. విష్ణుమూర్తి
అయ్యో..ఎంత పనాయేరా.. దోస్త్ గానీ వాట్సాప్ స్టేటస్ చూసి దొంగతనం..
అయ్యో..ఎంత పనాయేరా.. దోస్త్ గానీ వాట్సాప్ స్టేటస్ చూసి దొంగతనం..
నాని తెలిసే చేస్తున్నారా.. ఫస్ట్ టైమ్ ఆ కన్ఫ్యూజన్..!
నాని తెలిసే చేస్తున్నారా.. ఫస్ట్ టైమ్ ఆ కన్ఫ్యూజన్..!
ఫౌజీ షూటింగ్‏లో నటుడికి విషపురుగు కాటు పై టీమ్ క్లారిటీ..
ఫౌజీ షూటింగ్‏లో నటుడికి విషపురుగు కాటు పై టీమ్ క్లారిటీ..