Olympic Medal: క్రీడాకారులు ఒలింపిక్ పతకాన్ని ఎందుకు కొరుకుతారు.. అసలు కారణం ఏంటో తెలుసా?
Why Players Bite Olympic Medal: క్రీడల మహాకుంభం అంటే ఒలింపిక్స్ 2024 ప్రారంభానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి . ఈసారి ఒలింపిక్స్ను పారిస్లో నిర్వహిస్తున్నారు. ఈ అతిపెద్ద క్రీడల ఈవెంట్లో 10 వేల మందికి పైగా క్రీడాకారులు పతకాలు సాధించడం కనిపిస్తుంది. ప్రతి క్రీడాకారుడికి ఒకే ఒక కల ఉంటుంది. అది తన దేశం కోసం పతకం సాధించడం. ఒలింపిక్ పతకాలు గెలిచిన తర్వాత ఆటగాళ్లు చాలా ఉద్వేగానికి లోనవడం చూసే ఉంటారు. పతకం గెలిచిన తర్వాత దాన్ని పళ్లతో కొరుకుతూ కనిపిస్తుంటారు.
![Olympic Medal: క్రీడాకారులు ఒలింపిక్ పతకాన్ని ఎందుకు కొరుకుతారు.. అసలు కారణం ఏంటో తెలుసా?](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/players-bite-olympic-medal.jpg?w=1280)
Why Players Bite Olympic Medal: క్రీడల మహాకుంభం అంటే ఒలింపిక్స్ 2024 ప్రారంభానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి . ఈసారి ఒలింపిక్స్ను పారిస్లో నిర్వహిస్తున్నారు. ఈ అతిపెద్ద క్రీడల ఈవెంట్లో 10 వేల మందికి పైగా క్రీడాకారులు పతకాలు సాధించడం కనిపిస్తుంది. ప్రతి క్రీడాకారుడికి ఒకే ఒక కల ఉంటుంది. అది తన దేశం కోసం పతకం సాధించడం. ఒలింపిక్ పతకాలు గెలిచిన తర్వాత ఆటగాళ్లు చాలా ఉద్వేగానికి లోనవడం చూసే ఉంటారు. పతకం గెలిచిన తర్వాత దాన్ని పళ్లతో కొరుకుతూ కనిపిస్తుంటారు. ఒలింపిక్ అథ్లెట్లు ఇలా ఎందుకు చేస్తారు? ఈ ప్రశ్నలు మీ మనసులో కూడా తలెత్తితే, ఈ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం..
ఆటగాళ్ళు ఇలా ఎందుకు చేస్తారు?
ఒలింపిక్ పతకాన్ని గెలిచిన తర్వాత ఇలా చేయాలనే నియమం లేదు. వాస్తవానికి, ఆటగాళ్లను ఫొటోగ్రాఫర్లు మెడల్ను పంటితో కొరకమని అడుగుతుంటారు. నివేదికల ప్రకారం, ఈ పద్ధతి చాలా కాలంగా కొనసాగుతోంది. ఒలింపిక్ పతకాలు సాధించిన క్రీడాకారులు ఫొటోగ్రాఫర్ కోరిక మేరకు మాత్రమే ఇటువంటి పోజులు ఇవ్వడం కనిపిస్తుంది. ఒలింపిక్ విజేత ఆటగాడి ఫొటోను ప్రజలు చాలా ఇష్టపడుతుంటారు. అయితే, ఇది ఎప్పుడు ప్రారంభమైంది అనే దానిపై ఖచ్చితమైన సమాచారం లేదు.
స్వచ్ఛత కోసం తనిఖీ చేస్తారా?
పూర్వ కాలంలో బంగారు నాణేలు వాడేవారు. ఆ సమయంలో వ్యాపారులు బంగారు నాణేలను వాటి స్వచ్ఛతను తనిఖీ చేసేవారు. బంగారం మెత్తటి లోహం కాబట్టి, దానిపై దంతాల గుర్తులు కనిపిస్తాయి. కాబట్టి ఒలింపిక్ అథ్లెట్లు తమ పతకం స్వచ్ఛతను తనిఖీ చేయడానికి బంగారు పతకాలను ఇలా చేసేవారని అంటుంటారు.
వాస్తవానికి, 1912 నుంచి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ స్వచ్ఛమైన బంగారు పతకాలను అందించడం నిలిపివేసింది. అయితే, ఇలా చేయడానికి కారణం దాని స్వచ్ఛతను తనిఖీ చేయడం కాదు. వాస్తవానికి, ఒలింపిక్ విజేత పతకాన్ని తుంచివేయడం చాలా చర్చనీయాంశమైంది. అందుకే అలాంటి పోజులు ఇస్తుంటారు. 2010లో ఒలింపిక్స్లో పతకాల్లో ఓ ఆసక్తికరమైన సంఘటన ఒకటి జరిగింది. జర్మన్ లూగర్ డేవిడ్ ముల్లర్ వింటర్ ఒలింపిక్స్లో తన రజత పతకాన్ని గెలవడానికి ఇలాంటి పోజులిచ్చేటప్పుడు అతని దంతాలు విరిగిపోయాయంట.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..