AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pro Kabaddi: ఉత్కంఠ పోరులో తెలుగు టైటాన్స్ ఓటమి.. చివర్లో ఏం జరిగిందంటే..

ప్రొ కబడ్డీ లీగ్‌ ఎనిమిదో సీజన్‌లో శనివారం జరిగిన మ్యాచ్‎లో తెలుగు టైటాన్స్‎పై పుణెరి పల్టాన్‌ ఒక్క పాయింట్ తేడాతో విజయం సాధించింది...

Pro Kabaddi: ఉత్కంఠ పోరులో తెలుగు టైటాన్స్ ఓటమి.. చివర్లో ఏం జరిగిందంటే..
Pro Kabaddi
Srinivas Chekkilla
|

Updated on: Dec 26, 2021 | 6:53 AM

Share

ప్రొ కబడ్డీ లీగ్‌ ఎనిమిదో సీజన్‌లో శనివారం జరిగిన మ్యాచ్‎లో తెలుగు టైటాన్స్‎పై పుణెరి పల్టాన్‌ ఒక్క పాయింట్ తేడాతో విజయం సాధించింది. నిర్ణీత సమయంలో తెలుగు టైటాన్స్ 33 పాయింట్లు సాధించగా.. పుణెరి పల్టాన్‌ 34 పాయింట్లు సాధించింది. మాచ్య్ 33-34 పాయింట్లు ఉన్న సందర్భంలో తెలుగు టైటాన్ నుంచి రైడ్‌కు వెళ్లిన రాకేష్‌ బోనస్‌ పాయింట్‌ సాధించాననే నమ్మకంతో తిరిగొచ్చాడు.

కానీ రిఫరీ పాయింట్‌ ఇవ్వలేదు. సమీక్ష కోరినా ఫలితం లేకపోయింది. దీంతో టైటాన్స్‌ 33-34తో చేజేతులారా ఓటమి పాలైంది. సిద్ధార్థ్‌ దేశాయ్‌ (15) పోరాటం వృథా అయింది. పల్టాన్‌ తరపున మోహిత్‌ (9) అస్లామ్‌ (8), అభినేష్‌ (5) రాణించారు. మ్యాచ్‌లో ప్రత్యర్థిని ఆలౌట్‌ చేసిన టైటాన్స్‌ ఓ దశలో 17-13తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత సిద్ధార్థ్‌ సూపర్‌ రైడ్‌తో 20-14తో తొలి అర్ధభాగాన్ని ముగించింది. కానీ రెండో భాగంలో పుంజుకున్న పుణెరి.. టైటాన్స్‌ను వెనక్కినెట్టింది.

మోహిత్‌, అస్లామ్‌ రైడింగ్‌కు తోడు.. డిఫెన్స్‌లో ఆ జట్టు బలంగా కనిపించింది. టైటాన్స్‌ను ఆలౌట్‌ చేసి ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ సిద్ధార్థ్‌ పోరాటం కొనసాగించడంతో మ్యాచ్‌ ఉత్కంఠగా మారినా ఆఖర్లో ఓటమి చవిచూడక తప్పలేదు. అంతకుముందు జరిగిన మ్యాచ్‌లో యూపీ యోధ 36-35తో పట్నా పైరేట్స్‌పై గెలిచింది. యూపీ ఆటగాడు పర్దీప్‌ (12), సుమిత్‌ (6).. పట్నా జట్టులో సచిన్‌ (10), ప్రశాంత్‌ (8), మహమ్మద్‌రెజా (7) ఆకట్టుకున్నారు. మూడో మ్యాచ్‌లో జైపుర్‌ పింక్‌ పాంథర్స్‌ 40-38తో హరియాణా స్టీలర్స్‌పై గెలుపొందింది. జైపుర్‌ జట్టులో అర్జున్‌ (18), దీపక్‌ (10) సత్తాచాటారు. హరియాణా తరపున వికాస్‌ (14), రోహిత్‌ (7) రాణించారు.

Read Also.. IND vs SA: పంత్, సాహా.. తుది జట్టులో చోటు ఎవరికి.. రాహుల్ ద్రవిడ్ ఏం చెప్పాడు..

Follow Us
గోల్డ్‌ చైన్‌లను పసుపు నీటిలో వేసి వెళ్లిపోయాడు.. తర్వాత చూస్తే!
గోల్డ్‌ చైన్‌లను పసుపు నీటిలో వేసి వెళ్లిపోయాడు.. తర్వాత చూస్తే!
2027లో కప్ కొట్టాలంటే 5వ స్థానంలో ఆ పులిని దింపాల్సిందే గంభీర్
2027లో కప్ కొట్టాలంటే 5వ స్థానంలో ఆ పులిని దింపాల్సిందే గంభీర్
పక్కా కొలతల్లో నెల రోజులైనా చెడిపోని సుతిమెత్తని రవ్వ లడ్డు..
పక్కా కొలతల్లో నెల రోజులైనా చెడిపోని సుతిమెత్తని రవ్వ లడ్డు..
ఏపీలో మరో కొత్త పథకం.. త్వరలోనే అమలు.. వీరందరికీ లబ్ది
ఏపీలో మరో కొత్త పథకం.. త్వరలోనే అమలు.. వీరందరికీ లబ్ది
వణికించిన ప్రమాదం.. లిఫ్ట్ జారి పడటంతో మహిళ దుర్మరణం! ఎక్కడంటే..
వణికించిన ప్రమాదం.. లిఫ్ట్ జారి పడటంతో మహిళ దుర్మరణం! ఎక్కడంటే..
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై NHRC సీరియస్
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై NHRC సీరియస్
చదువు మధ్యలో మానేస్తే స్కాలర్‌షిప్ మొత్తం తిరిగి చెల్లించాల్సిందే
చదువు మధ్యలో మానేస్తే స్కాలర్‌షిప్ మొత్తం తిరిగి చెల్లించాల్సిందే
ఎంత ముదురుగా ఉన్న మటన్ అయినా ఇవి వేస్తే దెబ్బకి మెత్తగా..
ఎంత ముదురుగా ఉన్న మటన్ అయినా ఇవి వేస్తే దెబ్బకి మెత్తగా..
ఓపిక ఉన్నవాడిదే లోకం.. తనయులకు తండ్రి నేర్పిన ఓ గొప్ప పాఠం..!
ఓపిక ఉన్నవాడిదే లోకం.. తనయులకు తండ్రి నేర్పిన ఓ గొప్ప పాఠం..!
యూరప్‌లో కొత్త మిత్రుడి కోసం భారత్ వేట.. కారణం ఇదే..!
యూరప్‌లో కొత్త మిత్రుడి కోసం భారత్ వేట.. కారణం ఇదే..!