AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Neeraj Chopra: చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైన నీరజ్ చోప్రా.. అదేంటంటే?

World Athletics Championship 2023: నీరజ్ ఈ టోర్నీలో మెడల్ గెలిస్తే చరిత్ర సృష్టిస్తాడు. నీరజ్ స్వర్ణం గెలిస్తే, షూటర్ అభినవ్ బింద్రా తర్వాత ప్రపంచ ఛాంపియన్‌షిప్, ఒలింపిక్స్‌లో వ్యక్తిగత స్వర్ణ పతకాన్ని గెలుచుకున్న రెండవ ఆటగాడు అవుతాడు. బింద్రా 2008లో బీజింగ్ ఒలింపిక్స్‌లో బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. అంతకు ముందు 2006 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు.

Neeraj Chopra: చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైన నీరజ్ చోప్రా.. అదేంటంటే?
Olympic Gold Medalist Neeraj Chopra
Venkata Chari
|

Updated on: Aug 19, 2023 | 7:45 AM

Share

భారత సూపర్ స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా తన ఖాతాలో ఒలింపిక్ బంగారు పతకం అందుకున్నాడు. అయితే, అతని ట్రోఫీ లిస్టులో ఓ బంగారు పతకానికి కొరత ఉంది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ ఇంకా బంగారు పతకం సాధించలేదు. చివరిసారి అమెరికాలో జరిగిన ఈ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించాడు. హంగేరిలోని బుడాపెస్ట్‌లో శనివారం నుంచి ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ ప్రారంభం కానుండడంతో అందరి దృష్టి నీరజ్‌పైనే నిలిచింది. ఈసారి కూడా గోల్డ్ మెడల్ సాధించాలని ప్రయత్నిస్తాడు.

నీరజ్ ఈ టోర్నీలో మెడల్ గెలిస్తే చరిత్ర సృష్టిస్తాడు. నీరజ్ స్వర్ణం గెలిస్తే, షూటర్ అభినవ్ బింద్రా తర్వాత ప్రపంచ ఛాంపియన్‌షిప్, ఒలింపిక్స్‌లో వ్యక్తిగత స్వర్ణ పతకాన్ని గెలుచుకున్న రెండవ ఆటగాడు అవుతాడు. బింద్రా 2008లో బీజింగ్ ఒలింపిక్స్‌లో బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. అంతకు ముందు 2006 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు.

ఇవి కూడా చదవండి

టోర్నీ ఎప్పటి నుంచంటే..

టోర్నమెంట్ ఆగస్టు 19 నుంచి ప్రారంభమవుతుంది. అయితే, నీరజ్ మ్యాచ్ ఆగస్ట్ 25 న జరుగుతుంది. ఈ రోజు పురుషుల జావెలిన్ త్రో క్వాలిఫికేషన్ రౌండ్ ఆడనున్నాడు. నీరజ్‌తో పాటు, భారతదేశానికి చెందిన కిషోర్ కుమార్ జీనా డీపీ మనుపై దృష్టి ఉంటుంది. అదే రోజు మహిళల జావెలిన్ త్రో ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ కార్యక్రమం ఆగస్టు 23 నుంచి ప్రారంభం కానుంది. అన్నూ రాణి ఈ ఈవెంట్‌లో భారతదేశం తరపున పాల్గొంటుంది. నీరజ్ ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడలలో భారతదేశానికి బంగారు పతకాలు సాధించాడు. డైమండ్ లీగ్‌లో కూడా ఛాంపియన్‌గా నిలిచిన అతను ఈసారి ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించాలని ప్రయత్నిస్తున్నాడు. చెక్ రిపబ్లిక్‌కు చెందిన జాకుబ్ వాల్డెజ్, జర్మనీకి చెందిన జూలియన్ వెబర్‌ల నుంచి నీరజ్ కఠినమైన సవాలును ఎదుర్కోవలసి ఉంటుంది. అదే సమయంలో, ప్రస్తుత విజేత అండర్సన్ పీటర్స్ కూడా బంగారు పతకాన్ని గెలుచుకోవడానికి బలమైన పోటీదారుడిగా నిలిచాడు.

వీటిపై కూడా నిఘా..

నీరజ్ చోప్రా, అన్నూ రాణితో పాటు లాంగ్ జంప్‌లో జెస్విన్ ఆల్డ్రిన్, మురళీ శ్రీశంకర్‌లపైనే భారత్ దృష్టి ఉంటుంది. వీరిద్దరి మధ్య 23వ తేదీ నుంచే మ్యాచ్ ప్రారంభం కానుంది. 24న ఫైనల్‌ జరగనుంది. శ్రీశంకర్ జూన్‌లో భువనేశ్వర్‌లో 8.41 మీటర్లు తన అత్యుత్తమ జంప్ చేశాడు. బ్యాంకాక్ ఆసియా ఛాంపియన్‌షిప్‌లో 8.37 మీటర్లు దూకి రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. నిరంతర రికార్డులు చేయడంలో పేరుగాంచిన అవినాష్ సాబ్లే నుంచి భారత్ కూడా మంచి ప్రదర్శనను ఆశించనుంది. శనివారం జరిగే పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో పోటీపడనున్నాడు. దీని ఫైనల్ ఆగస్టు 23న జరుగుతుంది.

నడక పోటీలతో షురూ..

ఇక ఈ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ ప్రచారానికి సంబంధించిన విషయానికి వస్తే.. పురుషుల 20 కి.మీ నడకతో శనివారం నుంచి ప్రారంభం కానుంది. ఇందులో ఆకాశ్‌దీప్‌ సింగ్‌, వికాస్‌ సింగ్‌, పరమజీత్‌ సింగ్‌లు భారత్‌ తరపున ప్రాతినిధ్యం వహించనున్నారు. ఇందులో భారత్ నుంచి మహిళా క్రీడాకారిణి లేదు. భావా జాట్ పేరు ఉంది. కానీ, ఆమె తన గురించి సమాచారం ఇవ్వలేదు. అందుకే ఆమెను వెనక్కి పిలిచారు. తొలిరోజు మహిళల లాంగ్ జంప్‌లో శైలీ సింగ్ పాల్గొననుంది.

నీరజ్ చోప్రా జావెలీన్ త్రో..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..