Shooting World Cup: షూటింగ్ ప్రపంచకప్​లో భారత్ జోరు.. మహిళల 25 మీటర్ల పిస్టల్ గ్రూప్ విభాగంలో స్వర్ణం

Shooting World Cup: ఢిల్లీలో జరుగుతోన్న షూటింగ్ ప్రపంచకప్​లో భారత్ జోరు కొనసాగుతోంది. తాజాగా మహిళల 25 మీటర్ల పిస్టల్ గ్రూప్ విభాగంలో స్వర్ణం సాధించింది భారత్. రహీ సర్నోబత్, మను బాకర్, చింకీ యాదవ్​లతో కూడిన బృందం..

Shooting World Cup: షూటింగ్ ప్రపంచకప్​లో భారత్ జోరు.. మహిళల 25 మీటర్ల పిస్టల్ గ్రూప్ విభాగంలో స్వర్ణం
Shooting World Cup
Follow us

|

Updated on: Mar 25, 2021 | 10:20 PM

ఢిల్లీలో జరుగుతోన్న షూటింగ్ ప్రపంచకప్​లో భారత్ జోరు కొనసాగుతోంది. తాజాగా మహిళల 25 మీటర్ల పిస్టల్ గ్రూప్ విభాగంలో స్వర్ణం సాధించింది భారత్. రహీ సర్నోబత్, మను బాకర్, చింకీ యాదవ్​లతో కూడిన బృందం పొలాండ్​ టీమ్​పై గెలిచి బంగారు పతకం దక్కించుకుంది.

డాక్టర్ కర్నీ సింగ్ షూటింగ్ రేంజ్​లో జరిగిన ఈ పోరులో పొలాండ్​కు చెందిన జొన్నా ఇవోనా, వావ్రోనోవస్కా, జులితా బోరెక్​ బృందంపై భారత్​కు చెందిన రహీ సర్నోబత్, చింకీ యాదవ్, మను బాకర్​ టీమ్​ 17-7 తేడాతో విజయం సాధించింది.

ఈ పతకంతో భారత్​ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. ప్రస్తుతానికి ఇండియా ఖాతాలో 21 పతకాలు చేరాయి. ఇందులో 10 స్వర్ణం, 6 వెండి, 5 కాంస్య పతకాలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి : Jagananna Vidya Deevena: తల్లుల ఖాతాల్లో విద్యా దీవెన డబ్బులు పడేది అప్పుడే.. సీఎం జగన్ ఆదేశాలు

CM Jagan: సీఎం జగన్ సంచలన నిర్ణయం.. ఆ కుటుంబాలకూ ఆర్థిక సాయం… ఏప్రిల్ 6న నిధుల విడుదల