AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐసీసీ సంచలనం..తొలి మహిళా రిఫరీగా జీఎస్‌ లక్ష్మీ

ముంబయి: ఐసీసీలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా భారత్‌కు చెందిన మాజీ మహిళా క్రికెటర్‌కు ఐసీసీ అంతర్జాతీయ రిఫరీల ప్యానెల్‌లో చోటు కల్పించింది. ఐసీసీ రిఫరీగా ఎంపికైన ఆ మహిళ పేరు జీఎస్‌ లక్ష్మీ. వయసు 51. మూడు వన్డే, టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లను ఆమె పర్యవేక్షించింది. దేశవాళీ క్రికెట్‌లో 2008-09 సీజన్‌లో తొలి మ్యాచ్‌కు రిఫరీగా చేసింది. జీఎస్‌ లక్ష్మీ ఐసీసీ మ్యాచ్‌ రిఫరీగా ఎంపికైన తొలి మహిళగా రికార్డు సృష్టించింది. ఆస్ట్రేలియాకు చెందిన క్లైర్‌ […]

ఐసీసీ సంచలనం..తొలి మహిళా రిఫరీగా జీఎస్‌ లక్ష్మీ
Ram Naramaneni
|

Updated on: May 14, 2019 | 6:43 PM

Share

ముంబయి: ఐసీసీలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా భారత్‌కు చెందిన మాజీ మహిళా క్రికెటర్‌కు ఐసీసీ అంతర్జాతీయ రిఫరీల ప్యానెల్‌లో చోటు కల్పించింది. ఐసీసీ రిఫరీగా ఎంపికైన ఆ మహిళ పేరు జీఎస్‌ లక్ష్మీ. వయసు 51. మూడు వన్డే, టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లను ఆమె పర్యవేక్షించింది. దేశవాళీ క్రికెట్‌లో 2008-09 సీజన్‌లో తొలి మ్యాచ్‌కు రిఫరీగా చేసింది. జీఎస్‌ లక్ష్మీ ఐసీసీ మ్యాచ్‌ రిఫరీగా ఎంపికైన తొలి మహిళగా రికార్డు సృష్టించింది. ఆస్ట్రేలియాకు చెందిన క్లైర్‌ పొల్సాక్‌ ఏప్రిల్‌ 27న పురుషుల క్రికెట్‌ మ్యాచ్‌కు అంపైరింగ్‌ చేసిన తొలి మహిళ అంపైర్‌గా ఘనత సొంతం చేసుకుంది. వెంటనే జీఎస్‌ లక్ష్మీని రిఫరీని ఎంపిక చేయడం గమనార్హం.

ఐసీసీలోని అంతర్జాతీయ ప్యానెల్‌కు తనను ఎంపిక చేయడం లక్ష్మీ  ఆనందం వ్యక్తం చేసింది. భారత్‌లో ఓ క్రికెటర్‌గా, రెఫరీగా తనకు సుదీర్ఘ కెరీర్‌ ఉందని.. ఈ రెండింటి అనుభవంతో అంతర్జాతీయ వేదికపై రాణిస్తానని నమ్మకమున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా ఐసీసీ, బీసీసీఐ, క్రికెట్లో తన సీనియర్లు, కుటుంబ సభ్యులకు జీఎస్‌ లక్ష్మీ ధన్యవాదాలు తెలిపారు.