AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎయిర్ పోర్టు సిబ్బందిపై రోహిత్ శర్మ ఆగ్రహం.. ఎందుకంటే?

భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి టెస్టు వైజాగ్‌లోని డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్ 203 పరుగుల తేడాతో విజయడంకా మోగించింది. ఇక రెండో టెస్ట్ కోసం ఇరు జట్లూ పుణే బయల్దేరాయి. అయితే ఎయిర్‌పోర్ట్ చేరుకున్న టీమిండియా క్రికెటర్లు మాత్రం వర్షంలో తడిసి ముద్దయ్యారు. వైజాగ్ ఎయిర్‌పోర్ట్‌లో భారత ఆటగాళ్ల బస్సును ప్లాట్‌ఫార్మ్ 1పై నిలపాల్సి ఉండగా.. సఫారీ క్రికెటర్లకు అక్కడ అనుమతులు ఇచ్చి.. టీమిండియా […]

ఎయిర్ పోర్టు సిబ్బందిపై రోహిత్ శర్మ ఆగ్రహం.. ఎందుకంటే?
Ravi Kiran
|

Updated on: Oct 08, 2019 | 4:07 AM

Share

భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి టెస్టు వైజాగ్‌లోని డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్ 203 పరుగుల తేడాతో విజయడంకా మోగించింది. ఇక రెండో టెస్ట్ కోసం ఇరు జట్లూ పుణే బయల్దేరాయి. అయితే ఎయిర్‌పోర్ట్ చేరుకున్న టీమిండియా క్రికెటర్లు మాత్రం వర్షంలో తడిసి ముద్దయ్యారు.

వైజాగ్ ఎయిర్‌పోర్ట్‌లో భారత ఆటగాళ్ల బస్సును ప్లాట్‌ఫార్మ్ 1పై నిలపాల్సి ఉండగా.. సఫారీ క్రికెటర్లకు అక్కడ అనుమతులు ఇచ్చి.. టీమిండియా బస్సును ప్లాట్‌ఫార్మ్ 3 వద్దకు పంపారు. దీంతో భారత క్రికెటర్లు ప్లాట్‌ఫామ్‌ 3 నుంచి నడుచుకుంటూ ప్రత్యేక విమానం వద్దకు చేరుకోవాల్సి వచ్చింది. వారి దిగిన చోట పైకప్పు కూడా లేకపోవడంతో ఆటగాళ్లు పూర్తిగా వర్షంలో తడిసిపోయారు. ఈ విషయమై రోహిత్ శర్మ ఎయిర్ పోర్టు సీఐని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఇక అక్కడున్న అధికారులు తమను సమర్ధించుకునే ప్రయత్నం చేశారట. ఎయిర్‌పోర్ట్ ఎంట్రీ మరమ్మత్తుల కారణంగానే బస్సును కొద్ది దూరంలో ఆపాల్సి వచ్చిందని వివరణ ఇచ్చుకున్నారని సమాచారం. కాగా, టీమిండియా క్రికెటర్లు మాత్రం సిబ్బంది నిర్లక్ష్యం పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.