AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గంగూలీ వాదనకు కాంబ్లీ కౌంటర్!

మూడు ఫార్మాట్లకు ఒకే జట్టును ప్రకటిస్తే ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం పెరిగి వారి నుంచి మంచి ప్రదర్శన రావడానికి ఆస్కారం ఉందన్న టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ వాదనతో మాజీ క్రికెటర్‌ వినోద్‌ కాంబ్లీ ఏకీభవించలేదు. వెస్టిండీస్‌ పర్యటనకు భారత జట్టు ఎంపిక సరిగా లేదంటూ పేర్కొన్న గంగూలీ.. అన్ని ఫార్మాట్లకు కలిపి ఒకే జట్టును పంపిస్తే బాగుండేదన్నాడు. అయితే దీనిపై కాంబ్లీ స్పందిస్తూ.. ఇది సరైన విధానం కాదన్నాడు. ‘ ప్రతీ ఫార్మాట్‌లో గెలుపు గుర్రాలు […]

గంగూలీ వాదనకు కాంబ్లీ కౌంటర్!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 26, 2019 | 5:21 AM

Share

మూడు ఫార్మాట్లకు ఒకే జట్టును ప్రకటిస్తే ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం పెరిగి వారి నుంచి మంచి ప్రదర్శన రావడానికి ఆస్కారం ఉందన్న టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ వాదనతో మాజీ క్రికెటర్‌ వినోద్‌ కాంబ్లీ ఏకీభవించలేదు. వెస్టిండీస్‌ పర్యటనకు భారత జట్టు ఎంపిక సరిగా లేదంటూ పేర్కొన్న గంగూలీ.. అన్ని ఫార్మాట్లకు కలిపి ఒకే జట్టును పంపిస్తే బాగుండేదన్నాడు. అయితే దీనిపై కాంబ్లీ స్పందిస్తూ.. ఇది సరైన విధానం కాదన్నాడు. ‘ ప్రతీ ఫార్మాట్‌లో గెలుపు గుర్రాలు అనేవి వేరుగా ఉంటాయి. ఏ ఫార్మాట్‌లో ఆటగాళ్లు మెరుగనిస్తే వారిని ఎంపిక చేయాలి. అది జట్టుకు లాభిస్తుంది. మూడు ఫార్మాట్లకు వేర్వేరు ఆటగాళ్లను ఎంపిక చేయడం తప్పుకాదు. ఇలా ఎంపిక చేయడం వల్ల ప్రధాన సిరీస్‌ల్లో ఎవరిని ఏ సందర్భంలో వాడుకోవాలో అనే విషయం తెలుస్తుంది. ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్లే ఇందుకు ఉదాహరణ’ అని కాంబ్లీ పేర్కొన్నాడు. ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని జాతీయ సెలక్టర్ల బృందం విండీస్‌ టూర్‌కు ఆదివారం మూడు ఫార్మాట్లకు విడి విడిగా జట్టును ప్రకటించింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, రవీంద్ర జడేజా మాత్రమే మూడు ఫార్మాట్లలో స్థానం దక్కించుకున్నారు.