AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పీఎస్ఎల్ 2025 ఫైనల్‌ కోసం 8593 కిమీల జర్నీ.. కట్‌చేస్తే.. 7 బంతుల్లో 314 స్ట్రైక్‌రేట్‌తో ఊచకోత

Sikandar Raza Travelled from England to Pakistan: ఇంగ్లాండ్ ఎక్కడ, పాకిస్తాన్ ఎక్కడ? కానీ లాహోర్ ఖలందర్స్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టేందుకు ఓ ప్లేయర్ ఏకంగా 8593 కిలో మీటర్లు ప్రయాణించి, పీఎస్‌ఎల్ 2025 ఫైనల్ ఆడేందుకు వచ్చాడు. ఈ ఆటగాడు లాహోర్‌లో అడుగుపెట్టి కేవలం 50 నిమిషాల్లోనే మ్యాచ్‌కు తనను తాను సిద్ధం చేసుకున్నాడు.

పీఎస్ఎల్ 2025 ఫైనల్‌ కోసం 8593 కిమీల జర్నీ.. కట్‌చేస్తే.. 7 బంతుల్లో 314 స్ట్రైక్‌రేట్‌తో ఊచకోత
Sikandar Raza
Venkata Chari
|

Updated on: May 26, 2025 | 10:09 AM

Share

PSL 2025 Final: పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో సికందర్ రజా చూపించిన అంకితభావంతో అంతా ఫిదా అవుతున్నారు. ఇక్కడ అతని జట్టు లాహోర్ ఖలందర్స్ పీఎస్ఎల్ (PSL) 2025 ఫైనల్‌లో ఉంది. కానీ, అతను నాటింగ్‌హామ్‌లో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో తన దేశ జట్టు జింబాబ్వే తరపున పోరాడుతున్నాడు. 5 రోజుల టెస్ట్ మ్యాచ్ 3 రోజులకే పూర్తయింది. దీంతో లాహోర్ ఖలందర్స్ సికందర్ రజాను పిలిచే అవకాశం వచ్చింది. ఖలందర్స్ యజమాని తన విమాన టికెట్‌ను ఏర్పాటు చేయడంతో.. అతను PSL 2025 ఫైనల్ రోజున లాహోర్‌లో ల్యాండ్ అయ్యాడు. సికందర్ రజా కేవలం 50 నిమిషాల్లోనే PSL ఫైనల్ ఆడటానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపించాడు.

సికందర్ రాజా కేవలం 50 నిమిషాల్లోనే మైదానంలోకి..

ఇప్పుడు అతను ఇంగ్లాండ్ నుంచి లాహోర్ వరకు ఉన్న దూరాన్ని కేవలం 50 నిమిషాల్లోనే అధిగమించి మ్యాచ్ ఆడుతున్నాడని మీరు అనుకుంటే, పొరబడినట్లే. లాహోర్‌లో విమానం దిగిన తర్వాత అతను స్టేడియానికి చేరుకోవడానికి ఆ 50 నిమిషాలు పట్టింది. విమానం సాయంత్రం 6:50 గంటలకు లాహోర్‌లో ల్యాండ్ అయింది. అక్కడి నుంచి అతను నేరుగా స్టేడియానికి వచ్చాడు. 7:20 కి అతను లాహోర్ ఖలందర్స్ డ్రెస్సింగ్ రూంకి చేరుకున్నాడు. 7:25కి ఆయన జాతీయ గీతం పాడటానికి వెళ్ళాడు. ఆపై 7:30 గంటలకు అతను లాహోర్ ఖలందర్స్ తరపున మ్యాచ్ ఆడుతూ కనిపించాడు.

ఇవి కూడా చదవండి

సికందర్ రాజా తుఫాన్ ఇన్నింగ్స్..

View this post on Instagram

A post shared by Zalmi TV (@zalmi.tv)

PSL 2025 ఫైనల్ కోసం లాహోర్ చేరుకున్న తర్వాత, సికందర్ రజా పరిస్థితి చాలా ఉత్కంఠభరితంగా ఉందని స్పష్టంగా తెలుస్తుంది. అంతకుముందు, ఇంగ్లాండ్‌లో విమానం ఎక్కి అక్కడి నుంచి లాహోర్ చేరుకునేటప్పుడు కూడా అతను అదే స్థితిలో ఉన్నాడు. అతను నాటింగ్‌హామ్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు. అయితే అతని విమానం బర్మింగ్‌హామ్ నుంచి దుబాయ్ చేరుకుని, ఆ తర్వాత, మళ్ళీ గంటన్నర పాటు కారులో ప్రయాణించి అబుదాబి చేరుకున్నాడు. అప్పుడే అతను లాహోర్ విమానం ఎక్కగలిగాడు.

314 స్ట్రైక్ రేట్ తో పరుగులు..

ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్‌లో 24 ఓవర్లు బౌలింగ్ చేసి హాఫ్ సెంచరీ చేసిన సికందర్ రజా, 2025 PSL ఫైనల్‌లో లాహోర్ ఖలందర్స్ తరపున ఆడినప్పుడు 314 స్ట్రైక్ రేట్‌తో పరుగులు సాధించాడు. కేవలం 7 బంతుల్లోనే 22 పరుగులు చేసి అజేయంగా నిలిచి జట్టును ఛాంపియన్‌గా నిలిపాడు. మారిన పరిస్థితులు, మారిన ఫార్మాట్‌లో సుదీర్ఘ ప్రయాణం తర్వాత విశ్రాంతి లేకుండా నేరుగా మైదానంలోకి వెళ్లి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడటం అంత సులభం కాదు. కానీ లాహోర్ ఖలందర్స్‌ను మూడోసారి PSL ఛాంపియన్‌గా చేయడంలో, సికందర్ రజా తన అలసట గురించి పట్టించుకోలేదు. మ్యాచ్ గెలిచే పనిని చాలా బాగా పూర్తి చేశాడు.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..