Controversy: పాక్పై గెలుపు.. సంబరాల్లో యూవీ, రైనా, భజ్జీ డ్యాన్స్లు.. కట్చేస్తే.. వివాదస్పదమైన స్టెప్పులు..
Viral Video Create New Controversy: టీమిండియా మాజీ ఆటగాళ్లు సురేశ్ రైనా, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్లకు సంబంధించిన కొత్త వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారి కొత్త వివాదానికి దారితీసింది. వాస్తవానికి, భారత ఛాంపియన్స్ జట్టులో భాగమైన యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, సురేశ్ రైనా వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ లీగ్ మొదటి ఎడిషన్ను గెలిచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 'తౌబా తౌబా' పాటకు డ్రెస్సింగ్ రూమ్లోకి చిందులేశారు.
![Controversy: పాక్పై గెలుపు.. సంబరాల్లో యూవీ, రైనా, భజ్జీ డ్యాన్స్లు.. కట్చేస్తే.. వివాదస్పదమైన స్టెప్పులు..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/yuvi-bajji-raina.jpg?w=1280)
Viral Video Create New Controversy: టీమిండియా మాజీ ఆటగాళ్లు సురేశ్ రైనా, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్లకు సంబంధించిన కొత్త వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారి కొత్త వివాదానికి దారితీసింది. వాస్తవానికి, భారత ఛాంపియన్స్ జట్టులో భాగమైన యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, సురేశ్ రైనా వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ లీగ్ మొదటి ఎడిషన్ను గెలిచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ‘తౌబా తౌబా’ పాటకు డ్రెస్సింగ్ రూమ్లోకి చిందులేశారు. అయితే ఈ ముగ్గురు చేసిన డిఫరెంట్ డ్యాన్స్ ఇప్పుడు పారా అథ్లెట్ల ఆగ్రహానికి కారణమైంది. అలాగే, సోషల్ మీడియాలో దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది సిగ్గుచేటు, ఈ ముగ్గురు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
తౌబా తౌబా పాటకు హుక్ స్టెప్..
బర్మింగ్హామ్లో జరిగిన వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ ఫైనల్స్లో, భారత ఛాంపియన్లు పాకిస్థాన్ ఛాంపియన్లను ఓడించి ప్రారంభ ఎడిషన్ను గెలుచుకున్నారు. టైటిల్ గెలిచిన తర్వాత, భారత ఛాంపియన్లు నటుడు విక్కీ కౌశల్ పాడిన ‘తౌబా తౌబా’ పాటకు స్టెప్స్ వేయడానికి ప్రయత్నించారు.
అయితే ఈ వీడియో వైరల్ కావడంతో భారత పారా అథ్లెట్లు దీనిపై మండిపడుతున్నారు. పారా-స్విమ్మర్ షామ్స్ ఆలం, బ్యాడ్మింటన్ స్టార్, అర్జున అవార్డు గ్రహీత మాన్సీ జోషి వికలాంగ సమాజాన్ని ఇబ్బంది పెట్టారంటూ భారత మాజీ క్రికెటర్పై మండిపడ్డారు.
ఎగతాళి చేయడం లాంటిదే..
ఈ మేరకు వీరు.. హర్భజన్, యువరాజ్, ఇతర గౌరవనీయమైన జట్టు సభ్యులు అంటూ తమ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక పోస్ట్ను పంచుకున్నారు. ఆట తర్వాత శరీరం అలసిపోయిందని మనకు అర్థమైంది. కానీ, మీరు సోషల్ మీడియాలో వ్యక్తం చేసిన తీరు వికలాంగుల సంఘాన్ని అపహాస్యం చేసేలా ఉంది. అందువల్ల ఇది ఆమోదయోగ్యం కాదు. నా వ్యాఖ్యలు మిమ్మల్ని లేదా మీ బృంద సభ్యులను ప్రభావితం చేయవని నాకు తెలుసు. అయితే మీకు సన్నిహితంగా ఉండే వ్యక్తికి ఇలాంటివి జరిగితే ఊహించుకోండి. మీరు మీ బాధను ఇలా వ్యక్తం చేస్తారా? మేమంతా మిమ్మల్ని గౌరవిస్తాం. మీరు వ్యక్తులను అర్థం చేసుకుని దానికి అనుగుణంగా ప్రవర్తిస్తారని ఆశిస్తున్నాము అంటూ పోస్ట్ చేశారు.
అవమానకరమైన సంజ్ఞలు..
పారాలింపిక్స్ ఇండియా కూడా ఈ పోస్ట్తో కలత చెందింది. ఆటగాళ్ల ప్రవర్తన ‘సిగ్గుచేటు’గా అభివర్ణించింది. క్రికెటర్లుగా, స్టార్ సెలబ్రిటీలు సానుకూల భావోద్వేగాలను సృష్టించే బాధ్యత వహిస్తారు. కానీ, వికలాంగులను అనుకరించడం, అవమానకరమైన హావభావాలు ఉపయోగించడం, వారి శారీరక వైకల్యాన్ని ఎగతాళి చేయడమే కాదు, ఇదో రకమైన వివక్ష. ఈ చర్యలకు క్షమాపణలు చెప్పాల్సిన సమయం వచ్చింది అంటూ పోస్ట్ చేసింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..