AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WTC Points Table: సిడ్నీ టెస్ట్‌ ఎఫెక్ట్.. అగ్రస్థానం కోల్పోయిన ఆసీస్.. టీమిండియా ఏ ప్లేస్‌లో ఉందంటే?

Ashes: యాషెస్‌ సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్‌ మధ్య జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (WTC) పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా జట్టు మొదటి స్థానం నుంచి పడిపోయింది.

WTC Points Table: సిడ్నీ టెస్ట్‌ ఎఫెక్ట్.. అగ్రస్థానం కోల్పోయిన ఆసీస్.. టీమిండియా ఏ ప్లేస్‌లో ఉందంటే?
Pat Cummins
Venkata Chari
|

Updated on: Jan 10, 2022 | 10:35 AM

Share

AUS vs ENG: సిడ్నీలో ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ (AUS vs ENG) మధ్య జరిగిన యాషెస్ సిరీస్‌లో నాలుగో టెస్ట్ మ్యాచ్ డ్రా అయింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆస్ట్రేలియా 3-0 ఆధిక్యంలో ఉంది. కానీ, సిడ్నీ టెస్టు డ్రా కావడంతో ఆస్ట్రేలియా జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) పాయింట్ల పట్టికలో మొదటి స్థానం నుంచి పడిపోయింది. రెండో స్థానంలో నిలిచింది. శ్రీలంక మొదటి స్థానానికి చేరుకుంది. శ్రీలంక జట్టు 100 శాతం, ఆస్ట్రేలియా జట్టు 83.33 శాతంగా ఉన్నాయి.

శ్రీలంక 24, ఆస్ట్రేలియా 40 పాయింట్లతో ఉన్నాయి. పాకిస్థాన్ జట్టు 35 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. మొత్తం 75 శాతంతో పట్టికలో నిలిచింది. పాక్ రెండు సిరీస్‌లు ఆడింది. 3 మ్యాచ్‌లు గెలిచి ఒక మ్యాచులో ఓడిపోయింది. న్యూజిలాండ్ జట్టు WTC 2023లో తన రెండవ సిరీస్‌ను ఆడుతోంది. 2 మ్యాచ్‌లు ఓడి ఒకటి డ్రా చేసుకుంది. తొలి విజయం కోసం ఇంకా ఎదురుచూస్తూనే ఉంది. న్యూజిలాండ్‌కు మొత్తం 4 పాయింట్లు ఉన్నాయి. కివీస్ శాతం 11.11గా నిలిచింది. పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. ఇటీవలే న్యూజిలాండ్‌ను ఓడించిన బంగ్లాదేశ్ ఆరో స్థానంలో నిలిచింది. బంగ్లా గెలుపు శాతం 33.33గా ఉంది.

నాలుగో స్థానంలో టీమిండియా.. జొహన్నెస్‌బర్గ్ వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఏడు వికెట్ల తేడాతో టీమిండియాను ఓడించింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC Points Table) పాయింట్ల పట్టికలో దక్షిణాఫ్రికా కూడా ఈ విజయంతో ప్రయోజనం పొందింది. ఐదు స్థానాలు ఎగబాకి 5వ స్థానానికి చేరుకుంది. అదే సమయంలో టీమ్ ఇండియా నాలుగో స్థానంలో కొనసాగుతోంది.

ఇది దక్షిణాఫ్రికా WTC 2023లో తన మొదటి సిరీస్‌ను ఆడుతోంది. ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌లు ఆడింది. ఒక మ్యాచ్‌లో ఓడి ఒక మ్యాచ్‌లో గెలిచాడు. సౌతాఫ్రికా వద్ద 12 మార్కులు ఉన్నాయి. అదే సమయంలో, టీమ్ ఇండియా 9 మ్యాచ్‌లు ఆడగా, అందులో 4 గెలిచింది. రెండిట్లో ఓడిపోయింది. 2 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. భారత ఖాతాలో మొత్తం 53 మార్కులు ఉన్నాయి. టీమ్ ఇండియా 55.21 శాతంతో డబ్ల్యూటీసీ పట్టికలో నిలిచింది.

Also Read: ICC Under 19 World Cup: 11 సిక్స్‌లు, 20 ఫోర్లు, 278 పరుగులు.. విండీస్‌తో వార్మప్‌లో అదరగొట్టిన భారత్..!

IND VS SA: 11 మంది ఆటగాళ్లలో 5గురు ఫ్లాప్.. ఆశలన్నీ బుమ్రా-షమీలపైనే.. రేపటి నుంచే కేప్‌టౌన్ టెస్ట్..!