AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: శ్రీలంకపై గెలిచినా బంగ్లాదేశ్ కంటే కిందే.. WTC ఫైనల్ బెర్త్ కోసం భారత్ ముందు భారీ సవాల్

Team India: శ్రీలంకతో జరిగిన గాలే టెస్టులో టీమిండియా 165 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో భారత్ 53.33 శాతంతో ఐదో స్థానానికి చేరింది. అయితే ఫైనల్ ఆశలు సజీవంగా ఉండాలంటే మిగిలిన 8 టెస్టుల్లో భారత్ దాదాపు అన్ని మ్యాచ్‌లలో విజయం సాధించాల్సిందే.

Team India: శ్రీలంకపై గెలిచినా బంగ్లాదేశ్ కంటే కిందే.. WTC ఫైనల్ బెర్త్ కోసం భారత్ ముందు భారీ సవాల్
Wtc Final
Rakesh
|

Updated on: Aug 21, 2026 | 10:17 AM

Share

Team India: శ్రీలంక గడ్డపై గాలే టెస్టును భారత్ 165 పరుగుల తేడాతో ఆధిపత్యం ప్రదర్శిస్తూ సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌కు ముందు వరకు 9 టెస్టుల్లో 4 విజయాలతో 48.15 శాతం పాయింట్లతో ఉన్న టీమిండియా, ఈ గెలుపుతో తమ పాయింట్ల శాతాన్ని 53.33కి పెంచుకుంది. అయితే ఈ పెంపుతో పాయింట్ల పట్టికలో భారత స్థానంలో ఎలాంటి మార్పూ రాలేదు. ఇప్పటికీ ఐదో స్థానంలోనే కొనసాగుతోంది. ఐదు టెస్టుల్లో మూడు గెలిచి 66.67 శాతం పొందిన బంగ్లాదేశ్ నాలుగో స్థానంలో ఉండి భారత్ కంటే మెరుగైన స్థితిలో నిలిచింది. కొలంబోలోని ఎస్ఎస్సీ మైదానంలో ఆగస్టు 23 నుంచి జరగబోయే రెండో టెస్టులోనూ గెలిచి సిరీస్‌ను 2-0తో క్లీన్ స్వీప్ చేయాలని భారత జట్టు పట్టుదలతో ఉంది.

డబ్ల్యూటీసీ 2025-27 సైకిల్లో భారత్‌కు ఇంకా 8 టెస్టు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ ఎనిమిది మ్యాచ్‌ల్లోనూ వరుస విజయాలు సాధిస్తే భారత్ పాయింట్ల శాతం అత్యున్నత స్థాయికి అంటే 74.07కి చేరుకుంటుంది. ఇది ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేస్తుంది. ఈ క్రమంలో ఒక్క ఓటమి ఎదురైనా పాయింట్ల శాతం 68.52కి పడిపోతుంది. రెండు మ్యాచులు ఓడిపోతే 62.96, మూడు మ్యాచుల్లో పరాజయం పాలైతే 57.41 శాతానికి దిగజారుతుంది. ఒకవేళ 8 మ్యాచ్‌ల్లో ఐదు గెలిచి రెండింటిని డ్రా చేసుకుంటే భారత్ పాయింట్ల శాతం 61.11 వద్ద నిలుస్తుంది. ఇది ఫైనల్ అర్హత సాధించడానికి ఏమాత్రం సరిపోకపోవచ్చు.

ఇది కూడా చదవండి: Test Record: సచిన్ 200 మ్యాచ్‌ల ప్రపంచ రికార్డ్ అవుట్.. 167వ టెస్టులోనే సంచలనం సృష్టించిన ఇంగ్లాండ్ బ్యాటర్

శ్రీలంక సిరీస్ ముగిసిన తర్వాత భారత జట్టు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది. అక్కడ కివీస్‌తో రెండు టెస్టుల సిరీస్ ఆడాల్సి ఉంది. గతంలో న్యూజిలాండ్ గడ్డపై ఎదురైన చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకుంటే ఈ పర్యటన సవాలుతో కూడుకున్నదని స్పష్టమవుతోంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనకు వచ్చి 5 మ్యాచ్‌ల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో తలపడనుంది. సొంతగడ్డపై ఆస్ట్రేలియాను 4-1 లేదా 3-1 తేడాతో ఓడిస్తేనే భారత్ ఫైనల్ రేసులో బలంగా నిలబడగలదు.

ఇది కూడా చదవండి: Cricket Records: 39 మ్యాచులు, 12 సెంచరీలు, 2541 పరుగులు.. 25 ఏళ్లుగా చెక్కుచెదరని రికార్డు

ప్రస్తుతం పాయింట్ల పట్టికను పరిశీలిస్తే ఆస్ట్రేలియా 77.78 శాతంతో మొదటి స్థానంలో కొనసాగుతోంది. దక్షిణాఫ్రికా 75 శాతంతో రెండో స్థానంలో ఉంటే, న్యూజిలాండ్ 72.22 శాతంతో మూడో స్థానంలో ఉంది. భారత్ కేవలం తన మ్యాచ్‌లలో గెలవడమే కాకుండా ఇతర ప్రధాన జట్ల ఫలితాలపై కూడా ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. డబ్ల్యూటీసీ నిబంధనల ప్రకారం ప్రతి విజయానికి 12 పాయింట్లు, డ్రాకు 4 పాయింట్లు ఇస్తారు. ఓడిపోతే పాయింట్లు రావు. ఈ కారణంగా ప్రతి ఓటమి ఫైనల్ అవకాశాలను దెబ్బతీస్తుంది.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Follow Us