AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women’s World Cup 2022: 9 టోర్నీలు.. 2 ఫైనల్స్.. మహిళల ప్రపంచకప్‌లో టీమిండియా ప్రదర్శన ఎలా ఉందంటే?

ఇప్పటి వరకు మొత్తం 11 మహిళల ప్రపంచకప్‌లు ఆడగా, భారత్‌ 9 సార్లు పాల్గొంది. టీమ్ ఇండియా ఎన్నడూ ఛాంపియన్‌గా నిలవలేకపోయింది. కానీ రెండుసార్లు రన్నరప్‌గా నిలిచింది.

Women’s World Cup 2022: 9 టోర్నీలు.. 2 ఫైనల్స్.. మహిళల ప్రపంచకప్‌లో టీమిండియా ప్రదర్శన ఎలా ఉందంటే?
Women’s World Cup 2022 Team India Women's
Venkata Chari
| Edited By: Anil kumar poka|

Updated on: Mar 08, 2022 | 3:02 PM

Share

ఐసీసీ మహిళల ప్రపంచకప్(Women’s World Cup 2022) మార్చి 4 నుంచి న్యూజిలాండ్‌లో ప్రారంభమైంది. తొలి మ్యాచ్ న్యూజిలాండ్, వెస్టిండీస్ మధ్య జరిగింది. అదే సమయంలో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌(INDW vs PAKW)పై మార్చి 6 నుంచి టీమ్ ఇండియా(Team India Womens) తన ప్రచారాన్ని ప్రారంభించనుంది. చివరిగా 2017లో ఆడిన మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. అయితే టైటిల్ గెలవలేకపోయింది. ఈసారి టైటిల్‌ గెలిచే ఫేవరెట్‌గా జట్టును పరిగణిస్తున్నారు. మరి ఈసారి ఎలాంటి ఫలితం అందిస్తారో చూడాలి. భారత సారథి మిథాలీ రాజ్‌కు ఇదే చివరి ప్రపంచ కప్. ఈసారి ఎలాగైనా కప్ గెలవాలని ఆమె కోరుకుంటుంది. ట్రోఫీ గెలిచి ఘనమైన వీడ్కోలు చెప్పాలని ఆశిస్తోంది. ఇప్పటి వరకు మొత్తం 11 మహిళల ప్రపంచకప్‌లు ఆడగా, భారత్‌ 9 సార్లు పాల్గొంది. టీమ్ ఇండియా ఎన్నడూ ఛాంపియన్‌గా నిలవలేకపోయింది. కానీ రెండుసార్లు రన్నరప్‌గా నిలిచింది. రెండుసార్లు సెమీ-ఫైనల్స్‌లో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. భారత జట్టు 1978, 1988 ప్రపంచకప్‌లలో ఆడలేదు.

1978 ప్రపంచ కప్ (ఆతిథ్యం: భారతదేశం)

మహిళల ప్రపంచకప్ 1973లో ప్రారంభమైంది. అయితే భారత జట్టు 1978లో తొలిసారి ప్రపంచకప్ ఆడింది. ఈ ప్రపంచకప్‌లో జట్టు ప్రదర్శన చాలా నిరాశపరిచింది. మహిళల జట్టు వారి సొంత మైదానంలో ఓటమి చవిచూడాల్సి వచ్చింది.

1982 ప్రపంచ కప్ (ఆతిథ్యం: న్యూజిలాండ్)

1982లో కివీ గడ్డపై మహిళల ప్రపంచకప్ ఆడగా, ఈ టోర్నీలో భారత మహిళల జట్టు మరోసారి ప్రత్యేకత చూపించలేకపోయింది. ఆ జట్టు చెప్పుకోవడానికి 12 మ్యాచ్‌లు ఆడింది. కానీ, టైటిల్ విషయానికొస్తే, భారత జట్టు టాప్-4లోకి కూడా చేరుకోలేకపోయింది. భారత జట్టు నాలుగో స్థానంలో నిలిచింది.

1993 ప్రపంచ కప్ (ఆతిథ్యం: ఇంగ్లాండ్)

ఇది భారత్‌కు నాలుగో మహిళల ప్రపంచకప్‌. టీం ఇండియా 7 మ్యాచ్‌లు ఆడి 4 మ్యాచ్‌లు గెలవగా, 3 మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. నాలుగో ప్రపంచలో కూడా భారత జట్టు సెమీఫైనల్‌కు అర్హత సాధించలేక నాలుగో స్థానంలో నిలిచింది.

1997 ప్రపంచ కప్ (ఆతిథ్యం: భారతదేశం)

19 ఏళ్ల తర్వాత భారత్ రెండోసారి మహిళల ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇచ్చింది. ఈసారి జట్టు కమాండ్ ప్రమీలా భట్ చేతిలో ఉంది. లీగ్ దశలో 7 మ్యాచ్‌లు ఆడిన జట్టు 4 గెలిచి మొదటిసారి సెమీ-ఫైనల్‌కు చేరుకుంది. హోం గ్రౌండ్స్‌లో జట్టు మంచి స్థితిలో ఉన్నట్లు కనిపించింది. కానీ, సెమీ-ఫైనల్‌లో ఆ జట్టు 19 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది.

2000 ప్రపంచ కప్ (ఆతిథ్యం: న్యూజిలాండ్)

7వ మహిళల ప్రపంచకప్‌లో భారత్‌ వరుసగా రెండోసారి సెమీఫైనల్‌లోకి ప్రవేశించింది. లీగ్ దశలో 8 మ్యాచ్‌లు ఆడిన భారత్ ఐదు మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, మూడు మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. సెమీస్‌లో ఆతిథ్య న్యూజిలాండ్‌తో భారత్ తలపడింది. భారత జట్టు కేవలం 117 పరుగులకే ఆలౌట్ కావడంతో కివీస్ జట్టు 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

2005 ప్రపంచ కప్ (ఆతిథ్యం: దక్షిణాఫ్రికా)

భారత్‌ ఫైనల్‌కు చేరిన తొలి మహిళల వన్డే ప్రపంచకప్‌ ఇదే. సెమీఫైనల్‌లో న్యూజిలాండ్‌ను 40 పరుగుల తేడాతో ఓడించిన భారత్, ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడింది. భారత్ ముందు కంగారూ జట్టు 216 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా, ఆ జట్టు 117 పరుగులకే కుప్పకూలడంతో ప్రపంచకప్ గెలవాలన్న ఆ జట్టు కల కలగానే మిగిలిపోయింది.

2009 ప్రపంచ కప్ (ఆతిథ్యం: ఆస్ట్రేలియా)

2009 వన్డే ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు మూడో స్థానంలో నిలిచింది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో డక్‌వర్త్ లూయిస్ నిబంధనల ప్రకారం భారత్ 3 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది.

2013 ప్రపంచ కప్ (ఆతిథ్యం: భారతదేశం)

2013లో భారత్‌కు మూడోసారి వన్డే ప్రపంచకప్‌ ఆతిథ్యమిచ్చే అవకాశం వచ్చింది. ఈసారి జట్టు కమాండ్ ఝులన్ గోస్వామి చేతిలో ఉంది. జట్టు 4 మ్యాచ్‌లు ఆడింది. ఈ సమయంలో 2 గెలిచి, 2 ఓడిపోయింది. ఆ జట్టు సొంతగడ్డపై 7వ స్థానంలో నిలిచింది.

2017 ప్రపంచ కప్ (ఆతిథ్యం: ఇంగ్లాండ్)

గత మహిళల ప్రపంచకప్‌ను ఇంగ్లండ్‌ మైదానంలో నిర్వహించగా, భారత మహిళల జట్టుకు మిథాలీ రాజ్‌ కెప్టెన్‌గా వ్యవహరించింది. మిథాలీ & కో టోర్నీ మొత్తం అద్భుత ప్రదర్శన చేసి రెండోసారి ఫైనల్స్‌కు చేరుకుంది. సెమీస్‌లో భారత్ 36 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. ఆ జట్టు ఫైనల్‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌తో తలపడింది. జట్టు ట్రోఫీని గెలుచుకోవడానికి చాలా దగ్గరగా ఉంది. టీమ్ ఇండియా ముందు ఇంగ్లాండ్ 229 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. అయితే ఆ జట్టు కేవలం 219 పరుగులు మాత్రమే చేయగలిగింది. కేవలం 9 పరుగుల తేడాతో మ్యాచ్‌ను కోల్పోయింది.

Also Read: Women’s World Cup 2022: టైటిల్ గెలవాలంటే ఈ ప్లేయర్లే కీలకం.. పాక్‌తో పోరుకు సిద్ధమైన టీమిండియా ఉమెన్స్..

IND vs SL, 1st Test, Day 2, Live Score: భారీ స్కోర్ దిశగా భారత్.. సెంచరీ పూర్తి చేసిన జడేజా..