AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat kohli: అందుకే టీమిండియా కెప్టెన్సీ నుంచి తప్పుకున్న.. సెన్సెషనల్ కామెంట్స్ చేసిన కింగ్..

విరాట్ కోహ్లీ తన కెప్టెన్సీ కాలంలో ఎదుర్కొన్న మానసిక ఒత్తిడిపై RCB Bold Diariesలో మనసు విప్పాడు. భారత జట్టు RCBకి నాయకత్వం వహించడం వల్ల ఆటపై ఆనందం తగ్గిపోయిందని తెలిపాడు. 2022లో క్రికెట్‌కు దూరంగా ఉండి విశ్రాంతి తీసుకోవడం తనకు మానసికంగా ఎంతో ఉపశమనం కలిగించిందని అన్నాడు. తన కెరీర్ ఆరంభంలో ధోనీ, గ్యారీ కర్స్టన్‌ల మద్దతు ఎన్నటికీ మర్చిపోలేనిదని పేర్కొన్నాడు.

Virat kohli: అందుకే టీమిండియా కెప్టెన్సీ నుంచి తప్పుకున్న.. సెన్సెషనల్ కామెంట్స్ చేసిన కింగ్..
Kohli Opens Up On Quitting Captaincy
Narsimha
|

Updated on: May 06, 2025 | 3:59 PM

Share

విరాట్ కోహ్లీ తన కెరీర్‌లో అత్యంత భావోద్వేగభరితమైన దశ గురించి RCB Bold Diaries పోడ్‌కాస్ట్‌లో చర్చిస్తూ, భారత జట్టు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)కి కెప్టెన్సీ చేయడం తన మానసిక ఆరోగ్యంపై ఎంత పెద్ద ప్రభావాన్ని చూపిందో స్పష్టంగా వివరించాడు.  కెప్టెన్సీ నుంచి తప్పుకున్న అసలైన కారణం ఏమిటంటే… 2021 IPL తర్వాత RCB కెప్టెన్ పదవికి విరాట్ రాజీనామా చేశాడు. అదే సంవత్సరం టీ20 ప్రపంచకప్ అనంతరం భారత్‌ టీ20 కెప్టెన్‌గా కూడా తప్పుకున్నాడు. అయితే, ఓడీఐ కెప్టెన్సీ నుంచి బీసీసీఐ అతన్ని తొలగించడంతో.. అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీతో విభేదాలు వెలుగు చూసాయి. ఈ పరిణామాలు చివరకు 2022 మొదట్లో టెస్ట్ కెప్టెన్సీ నుంచి కోహ్లీ తప్పుకునే దాకా వెళ్లాయి.

విరాట్ మాట్లాడుతూ:

“ఒక దశలో ఇది చాలా కఠినంగా మారింది. ప్రతి మ్యాచ్‌లో నా బ్యాటింగ్‌పై అంచనాలు ఉండేవి. కెప్టెన్సీ అయినా, బ్యాటింగ్ అయినా.. దృష్టి అంతా నాపైనే ఉండేది. 24×7 నన్ను చూస్తూనే ఉండేవాళ్లు. మానసికంగా పూర్తిగా గేలిపోయా.  కేవలం ఆటపట్ల ఆనందాన్ని తిరిగి పొందాలని నిర్ణయం. ఆ సమయంలో తనకు ఆటలో ఆనందం మిగలడం లేదని, ప్రతి క్షణం ఒత్తిడిలోనే గడుస్తోందని, తాను సాధారణ ఆటగాడిలా ఒత్తిడిలేకుండా ఆడాలనుకుంటున్నానని కోహ్లీ చెప్పాడు. “ఈ సీజన్ ఏం చేయబోతావ్? ఇప్పుడు ఏమవుతుందీ?” అనే ప్రశ్నల మధ్య జీవించడంపై విరక్తి వ్యక్తం చేశాడు.

ధోనీ &  గ్యారీ కిర్‌స్టెన్ ఘన కృతజ్ఞతలు

తన ప్రాథమిక అంతర్జాతీయ కెరీర్‌ గురించి మాట్లాడిన కోహ్లీ, అవసరమైన సమయంలో మద్దతుగా నిలిచిన ఎంఎస్ ధోనీ, కోచ్ గ్యారీ కర్స్టన్కు కృతజ్ఞతలు తెలిపాడు. భారత్ U-19 టీమ్‌కి విజయాన్ని అందించిన తర్వాత కూడా, అంతర్జాతీయ స్థాయిలో తన స్థానం స్థిరమవుతుందన్న గ్యారంటీ ఏమాత్రం లేదు అని చెప్పాడు.

2022లో నెల రోజుల విరామం తీసుకుని క్రికెట్ నుంచి పూర్తిగా దూరమై, మానసిక, భావోద్వేగ స్థాయిల్లో విశ్రాంతి తీసుకున్నానని కోహ్లీ తెలియజేశాడు. ఈ బ్రేక్ అతనికి మళ్లీ ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందని అన్నారు. తనను న్యాయంగా మాత్రమే కాక, మానవుడిగా చూసే అవసరాన్ని కోహ్లీ హృదయపూర్వకంగా వ్యక్తీకరించాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.