AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND Vs ENG: ఇంగ్లాండ్‌తో వన్డేలు, టీ20లు.. ఆ ముగ్గురు సీనియర్ ప్లేయర్లు ఔట్..

ప్రస్తుతం టీమిండియా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్‌లో బిజీగా ఉంది. ఈ సిరీస్‌లో స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ప్రదర్శన అందర్నీ నిరాశపరిచింది. దీంతో వీరిద్దరినీ జట్టు నుంచి తప్పించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. జనవరిలో ఇంగ్లాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌లో రోహిత్, విరాట్, బుమ్రాలు రెస్ట్ తీసుకోనున్నట్లు తెలుస్తుంది.

IND Vs ENG: ఇంగ్లాండ్‌తో వన్డేలు, టీ20లు.. ఆ ముగ్గురు సీనియర్ ప్లేయర్లు ఔట్..
Virat Kohli, Rohit Sharma, Bhumrah
Velpula Bharath Rao
|

Updated on: Dec 31, 2024 | 6:29 PM

Share

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో బిజీగా ఉన్న టీమిండియా ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. మెల్‌బోర్న్ టెస్టు ఓటమితో ఈ సిరీస్‌లో టీమిండియా వెనుకబడింది. ఈ సిరీస్‌లో స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ప్రదర్శన అందర్నీ నిరాశపరిచింది. దీంతో వీరిద్దరినీ జట్టు నుంచి తప్పించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇంత పేలవమైన ఫామ్ మధ్య ఈ స్టార్ ప్లేయర్స్ఆస్ట్రేలియా నుండి తిరిగి వచ్చిన తర్వాత సెలవుపై వెళతారని ఇంగ్లాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌లో ఆడరని ప్రచారం జరుగుతుంది. వీరిద్దరితో పాటు స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కూడా ఈ సిరీస్ నుండి విరామం తీసుకోనున్నాడు.

మెల్‌బోర్న్ టెస్టులో టీమిండియా ఘోర పరాజయం పాలైన తర్వాత ఫిబ్రవరిలో ఇంగ్లండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌లో కెప్టెన్ రోహిత్, విరాట్, బుమ్రా ఆడబోరని మీడియా కథనాలు వస్తున్నాయి. వర్క్‌లోడ్ దృష్ట్యా మేనేజ్‌మెంట్ ఈ ముగ్గురు ఆటగాళ్లు ఈ సిరీస్ నుండి విరామం తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. ఈ ముగ్గురు ఆటగాళ్లు జనవరి 3 నుండి సిడ్నీలో ప్రారంభమయ్యే టెస్ట్ మ్యాచ్ తర్వాత వచ్చే ఒక నెల పాటు సెలవులో ఉంటారు. ఫిబ్రవరి 19 నుండి ప్రారంభమయ్యే ఛాంపియన్స్ ట్రోఫీ నుండి నేరుగా తిరిగి వస్తారు.

ఇంగ్లండ్ జట్టు జనవరిలో భారత పర్యటనకు వస్తోంది. జనవరి 22 నుండి ప్రారంభమయ్యే రెండు జట్ల మధ్య మొదటి 5 T20 మ్యాచ్‌ల సిరీస్ ఉంటుంది. దీని తర్వాత ఫిబ్రవరి 6 నుంచి 3 వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. విరాట్‌, రోహిత్‌లు ఇప్పటికే టీ20 ఇంటర్నేషనల్‌ నుంచి రిటైరయ్యారు. వాళ్లు ఎలాగూ ఈ సిరీస్‌లో భాగం కాదు. అయితే రోహిత్, విరాట్‌ల ఆటకు సంబంధించి సెలక్షన్ కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుంది.

జస్ప్రీత్ బుమ్రా విషయానికొస్తే, అతను మూడు ఫార్మాట్లలో చురుకుగా ఉంటాడు. అయితే గత 3 నెలలుగా నిరంతరంగా టెస్ట్ క్రికెట్ ఆడుతున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ వంటి టోర్నమెంట్‌కు ఫిట్‌గా ఉంచడానికి ఈ మొత్తం పర్యటన నుండి అతనికి విశ్రాంతి ఇవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమ్ ఇండియా చివరి సిరీస్‌గా భారత్-ఇంగ్లండ్ మధ్య 3 వన్డే మ్యాచ్‌లు జరగనున్నాయి. బుమ్రా మంచి ఫామ్‌లో ఉండడంతో అతనికి విశ్రాంతి ఇవ్వడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ రోహిత్, విరాట్ ఇటీవలి ప్రదర్శన తర్వాత, ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు వారు విశ్రాంతి తీసుకోవడంపై ప్రశ్నలు తలెత్తుతాయి.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి