AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG: అనుష్క శర్మ కారణంగానే కోహ్లీ టెస్ట్ సిరీస్ నుంచి తప్పుకున్నాడా.. అసలు నిజమెంతంటే?

Virat Kohli & Anushka Sharma: నిజానికి అనుష్క శర్మ కారణంగానే విరాట్ కోహ్లీ తన పేరును ఉపసంహరించుకోవాల్సి వచ్చిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే వ్యక్తిగత కారణాల వల్ల విరాట్ కోహ్లీ తొలి 2 టెస్టు మ్యాచ్‌లు ఆడలేడని తెలుస్తోన్నా.. విరాట్ కోహ్లీ ఆడకపోవడానికి అసలు కారణం ఇప్పటి వరకు వెల్లడి కాలేదు.

IND vs ENG: అనుష్క శర్మ కారణంగానే కోహ్లీ టెస్ట్ సిరీస్ నుంచి తప్పుకున్నాడా.. అసలు నిజమెంతంటే?
Kohli Anuska Sharma
Venkata Chari
|

Updated on: Jan 31, 2024 | 3:11 PM

Share

Virat Kohli & Anushka Sharma: ఇంగ్లండ్‌తో జరిగిన హైదరాబాద్ టెస్టులో భారత జట్టు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా నాలుగో రోజు 28 పరుగుల తేడాతో ఓడిపోయింది. విరాట్ కోహ్లీ ఈ భారత జట్టులో భాగం కాలేదు. అలాగే ఈ మాజీ కెప్టెన్ విశాఖపట్నం టెస్టులోనూ ఆడడంలేదు. వాస్తవానికి, ఈ సిరీస్ ప్రారంభానికి ముందు, విరాట్ కోహ్లీ మొదటి 2 టెస్ట్ మ్యాచ్‌ల నుంచి తన పేరును ఉపసంహరించుకున్నాడు. అయితే, విరాట్ కోహ్లీ తన పేరును ఎందుకు ఉపసంహరించుకున్నాడో ముందుగా తెలియదు. అయితే, సోషల్ మీడియాలో మాత్రం విరాట్ కోహ్లీ తన పేరును ఉపసంహరించుకోవడానికి అనుష్క శర్మ కారణమంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

విరాట్ కోహ్లీ తన పేరును ఎందుకు ఉపసంహరించుకున్నాడు?

నిజానికి అనుష్క శర్మ కారణంగానే విరాట్ కోహ్లీ తన పేరును ఉపసంహరించుకోవాల్సి వచ్చిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే వ్యక్తిగత కారణాల వల్ల విరాట్ కోహ్లీ తొలి 2 టెస్టు మ్యాచ్‌లు ఆడలేడని తెలుస్తోన్నా.. విరాట్ కోహ్లీ ఆడకపోవడానికి అసలు కారణం ఇప్పటి వరకు వెల్లడి కాలేదు. అయితే, విరాట్ కోహ్లీ తల్లి సరోజా కోహ్లీ అనారోగ్యంతో ఉన్నారని తెలుస్తోంది. అందుకే, ఈ ఆటగాడు అతని పేరును ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నాడంట.

విరాట్ కోహ్లీ తల్లి సరోజా కోహ్లి పరిస్థితి విషమం..!

విరాట్ కోహ్లి తల్లి సరోజా కోహ్లి గత సెప్టెంబరు నుంచి కాలేయ సమస్యతో బాధపడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ తర్వాత సరోజా కోహ్లి గురుగ్రామ్‌లోని సీకే బిర్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, విరాట్ కోహ్లీ వన్డే ప్రపంచకప్‌లో ఆడాలని నిర్ణయించుకున్నాడు. అయితే, ఇప్పుడు సరోజా కోహ్లి పరిస్థితి బాగా లేదు. ఆమె పరిస్థితి రోజురోజుకు క్షీణిస్తోంది. అందుకే తన తల్లితో కలిసి ఉండేందుకు తన పేరును ఉపసంహరించుకోవాలని విరాట్ కోహ్లీ నిర్ణయించుకున్నాడు. అయితే, ఈ వార్తలపై అధికారికంగా ఎలాంటి సమాచారం వెల్లడి కాలేదు. అయితే బహుశా ఇదే కారణం అని భావిస్తున్నారు. అందుకు అనుష్క శర్మ ఏ మాత్రం కారణం కాదంటూ చెబుతున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..