AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: ఈడెన్ గార్డెన్స్‌ను ఊపేసిన రింకూ, కోహ్లీ.. షారుఖ్‌తో కలిసి అదిరిపోయే స్టెప్పులు

Virat Kohli: ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఐపీఎల్ 2025 ప్రారంభోత్సవంలో తారల ప్రదర్శన తర్వాత, షారుఖ్ ఖాన్ విరాట్ కోహ్లీ, రింకు సింగ్‌లను వేదికపైకి పిలిచి వారితో మాట్లాడారు. అనంతరం షారుఖ్ వారిద్దరినీ తన పాటలకు డ్యాన్స్‌లు చేయించడంతో ఈడెన్ గార్డెన్స్‌ ఊగిపోయంది.

Video: ఈడెన్ గార్డెన్స్‌ను ఊపేసిన రింకూ, కోహ్లీ.. షారుఖ్‌తో కలిసి అదిరిపోయే స్టెప్పులు
Virat Kohli Rinku Singh Dance
Venkata Chari
|

Updated on: Mar 22, 2025 | 8:01 PM

Share

ఐపీఎల్ (IPL) 2025 ప్రారంభోత్సవం అభిమానులు ఊహించిన దానికంటే అద్భుతంగా జరిగింది. మార్చి 22, శనివారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో లీగ్ తొలి మ్యాచ్‌కు ముందు ప్రారంభోత్సవం జరిగింది. శ్రేయ ఘోషల్ సహా సినీ పరిశ్రమలోని తారలు సందడి చేశారు. కానీ, నిజమైన ప్రదర్శనను విరాట్ కోహ్లీ, రింకు సింగ్‌ ఎంట్రీతో వచ్చింది. స్టేడియం మధ్యలో వేలాది మంది అభిమానుల ముందు షారుఖ్ ఖాన్‌తో కలిసి స్టెప్పులు వేశారు.

ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన లీగ్ 18వ సీజన్ ప్రారంభోత్సవ బాధ్యతను బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ స్వీకరించారు. దానిని ఆయనే ప్రారంభించారు. ఆ తర్వాత సూపర్ హిట్ గాయని శ్రేయా ఘోషల్ అద్భుతమైన పాటలు పాడగా, నటి దిశా పటాని తన నృత్య నైపుణ్యాలను ప్రదర్శించింది. ఆమె తర్వాత పంజాబీ పాప్ గాయకుడు కరణ్ ఔజ్లా కూడా అభిమానులను అలరించాడు. ఆ తర్వాత విరాట్, రింకు షారుఖ్‌తో కలిసి వేదికపైకి వచ్చినప్పుడు చారిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో ఉన్న వేలాది మంది అభిమానులుకు పట్టలేని సంతోషం కలిగింది.

ఈ సమయంలో, షారుఖ్ వారిద్దరినీ కొన్ని ప్రశ్నలు అడిగాడు. ఆ తరువాత వారిద్దరినీ తన పాటలకు నృత్యం చేయమని అడిగాడు. ముందుగా, రింకు సింగ్ షారుఖ్ చిత్రం డంకీలోని ‘లుట్-పుట్ గయా..’ పాటకు డ్యాన్స్ చేశాడు. ఈ క్రమంలో ఈడెన్ గార్డెన్స్‌లో విరాట్ డ్యాన్స్ చేయాలని షారుఖ్ పట్టుపట్టాడు. షారుఖ్ తన సూపర్ హిట్ చిత్రం పఠాన్ టైటిల్ ట్రాక్‌కు కోహ్లీని డ్యాన్స్ చేయించాడు. ఈ సమయంలో, షారుఖ్ కూడా వారిద్దరితో కలిసి డ్యాన్స్ చేస్తూనే ఉన్నాడు. దీంతో స్టేడియంలో కూర్చున్న అభిమానులు బిగ్గరగా అరుస్తూ అందరినీ ఉత్సాహపరిచారు.