
IPL 2025 ఆరవ మ్యాచ్ మార్చి 26న కోల్కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగింది. గౌహతిలో జరిగిన ఈ మ్యాచ్లో కోల్కతా జట్టు విజయం సాధించింది. ఆ జట్టు విజయంలో వికెట్ కీపర్-బ్యాట్స్మెన్ క్వింటన్ డికాక్ కీలక పాత్ర పోషించాడు. క్లిష్ట పరిస్థితుల్లో 61 బంతుల్లో 97 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆ సీజన్లో తన జట్టుకు ఖాతాను తెరిచాడు. ఈ అద్భుతమైన ఇన్నింగ్స్కు అతను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా కూడా ఎంపికయ్యాడు.
గత సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడిన డికాక్, తొలిసారి కోల్కతా తరఫున ఆడుతున్నాడు. 3.6 కోట్లతో కోల్కతా జట్టు డికాక్ను సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే ఐపీఎల్ చరిత్రలో ఒక జట్టులోని కొత్త ఆటగాళ్ళు వరుసగా 6 మ్యాచ్లను గెలిపించడం ఇదే మొదటిసారి. డికాక్ కాకుండా ఆ 5 మంది ఆటగాళ్ళు ఎవరు.?
ఇది చదవండి: దేవుడు కలలో కనిపించి పొలంలో తవ్వమన్నాడు.. తీరా తవ్వి చూడగా
ఈ సీజన్లో ఐదవ మ్యాచ్ మార్చి 25న అహ్మదాబాద్లో పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో పంజాబ్ అద్భుత విజయం సాధించింది. ఇందులో తొలిసారి పంజాబ్ ఫ్రాంచైజీ తరపున ఆడుతున్న కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ హీరోగా అవతరించాడు. అతను 42 బంతుల్లో 230 స్ట్రైక్ రేట్తో 97 పరుగులు చేశాడు. గుజరాత్ తరపున 244 పరుగుల భారీ స్కోరు సాధించి 11 పరుగుల తేడాతో మ్యాచ్ను గెలిపించాడు. అతని తుఫాను ఇన్నింగ్స్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికయ్యాడు. పంజాబ్ అతన్ని రూ.26.75 కోట్లకు కొనుగోలు చేసింది.
ఈ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన నాల్గవ మ్యాచ్లో అశుతోష్ శర్మ 31 బంతుల్లో 66 పరుగులు చేసిన పేలుడు ఇన్నింగ్స్ను ఎవ్వరూ మర్చిపోలేరు. అశుతోష్ గత సీజన్లో పంజాబ్ కింగ్స్ తరపున ఆడాడు. ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ అతనిని రూ.3.8 కోట్లకు తమ జట్టులో చేర్చుకుంది. ఈ జట్టు తరఫున అరంగేట్రం చేసిన అశుతోష్, ఓడిపోయే మ్యాచ్ను గెలిపించాడు. చివరి క్షణంలో మ్యాచ్ను మలుపు తిప్పి ఢిల్లీకి విజయాన్ని అందించాడు. అతను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికయ్యాడు.
ఇది చదవండి: పెళ్లి, ఆపై ఫస్ట్నైట్.. మూడో రోజే వధువుకు షాక్ ఇచ్చిన వరుడు.. అతడేం చేశాడంటే
ఈ సీజన్లో మూడవ మ్యాచ్ మార్చి 23న చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య చెపాక్లో జరిగింది. ఈ సమయంలో, ఆఫ్ఘనిస్తాన్ యువ స్పిన్నర్ నూర్ అహ్మద్ మొదటిసారి చెన్నై జట్టు తరపున ఆడటానికి వచ్చి విధ్వంసం సృష్టించాడు. మొదట బౌలింగ్ చేస్తూ, అతను 4 ఓవర్లలో కేవలం 18 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టి ముంబై బ్యాటింగ్ లైనప్ను దెబ్బతీశాడు. అతడి బౌలింగ్కు ముంబై 155 పరుగులకే పరిమితం అయింది. దీంతో నూర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికయ్యాడు. అతన్ని CSK రూ. 10 కోట్లు ఖర్చు చేసి మరీ కొనుగోలు చేసింది.
ముంబై ఇండియన్స్తో ఇషాన్ కిషన్కు 7 సీజన్ల బంధం ఉంది. కానీ IPL 2025లో అతడ్ని మెగా వేలంలోకి రిలీజ్ చేశారు ముంబై. ఆ తర్వాత కావ్య మారన్ ఫ్రాంచైజీ సన్రైజర్స్ హైదరాబాద్ కిషన్ను రూ. 11.25 కోట్ల భారీ ధర చెల్లించి తమ జట్టులో చేర్చుకుంది. మార్చి 23న, అతను మొదటిసారి ఈ జట్టు తరపున ఆడటానికి వచ్చి బ్యాట్తో అద్భుతం చేశాడు. కేవలం 45 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. మొత్తంగా 47 బంతుల్లో 106 పరుగులతో అజేయంగా నిలిచాడు. దీనితో హైదరాబాద్ 286 పరుగుల భారీ స్కోరును సాధించి 44 పరుగుల భారీ తేడాతో మ్యాచ్ను గెలుచుకుంది. ఇషాన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు.
IPL 2025లో, సీజన్ ఓపెనర్లో కృనాల్ పాండ్యా కొత్త జట్టును విజయపథంలో నడిపించడం ద్వారా కీలక పాత్ర పోషించాడు. తొలిసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతున్న పాండ్యా 4 ఓవర్లలో కేవలం 29 పరుగులిచ్చి 3 వికెట్లు తీసి ఆటను మలుపు తిప్పాడు. దీనికి గానూ పాండ్యా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికయ్యాడు. ఈ విధంగా వరుసగా 6 మ్యాచ్లలో మొదటిసారిగా, ఈ టోర్నమెంట్లో 6 మంది ఆటగాళ్ళు ఒక జట్టు తరపున ఆడి మ్యాచ్ గెలవడంలో సహాయపడ్డారు.
ఇది చదవండి: కూకట్పల్లి మెట్రో స్టేషన్ వద్ద అనుమానాస్పదంగా ఇద్దరు వ్యక్తులు.. ఆపి చెక్ చేయగా
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి