AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG 1st T20I: ముగ్గురు ఆల్ రౌండర్లు, ఇద్దరు పేసర్లు.. ఇంగ్లండ్‌ను ఢీ కొట్టబోయే టీమిండియా ప్లేయింగ్ XI ఇదే?

IND vs ENG 1st T20I: జనవరి 22 నుంచి భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో మొత్తం ఐదు మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్ కోల్‌కతాలో జరగనుండగా, రెండో మ్యాచ్ జనవరి 25న చెన్నైలో జరగనుంది. మూడో మ్యాచ్‌ జనవరి 28న రాజ్‌కోట్‌లో, నాలుగో మ్యాచ్‌ జనవరి 31న పుణెలో జరగనుంది. అలాగే, ఈ సిరీస్‌లోని చివరి మ్యాచ్ ఫిబ్రవరి 2న ముంబైలో జరగనుంది.

IND vs ENG 1st T20I: ముగ్గురు ఆల్ రౌండర్లు, ఇద్దరు పేసర్లు.. ఇంగ్లండ్‌ను ఢీ కొట్టబోయే టీమిండియా ప్లేయింగ్ XI ఇదే?
Team India Playing Xi
Venkata Chari
|

Updated on: Jan 21, 2025 | 7:03 PM

Share

IND vs ENG 1st T20I: భారత్, ఇంగ్లండ్ మధ్య బుధవారం (జనవరి 22) నుంచి 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌కి టీమ్ ఇండియా పటిష్టమైన ప్లేయింగ్ ఎలెవన్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఎందుకంటే, శుభమన్ గిల్, రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్ సహా కొంతమంది ఆటగాళ్లు ఈ సిరీస్‌కు దూరమయ్యారు.

సంజూ శాంసన్, అభిషేక్ శర్మలు తొలి మ్యాచ్‌లో టీమిండియా ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తారని తెలుస్తోంది. మూడో నంబర్‌లో తిలక్ వర్మ కనిపించనున్నాడు.

సూర్యకుమార్ యాదవ్ నాలుగో స్థానంలో వస్తే, రింకూ సింగ్ ఐదో స్థానంలో బ్యాటింగ్ చేయగలడు. అలాగే, ఆల్ రౌండర్లుగా హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డిలు కనిపించే ఛాన్స్ ఉంది.

వరుణ్ చక్రవర్తి అతనితో పర్ఫెక్ట్ స్పిన్నర్‌గా కనిపించనున్నాడు. అలాగే, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్ పేసర్లుగా బరిలోకి దిగడం దాదాపు ఖాయం.

ముగ్గురు ఆల్ రౌండర్లు, ఇద్దరు పేసర్లు..

ముగ్గురు ఆల్ రౌండర్లను రంగంలోకి దించడం ద్వారా హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డిలను అదనపు పేసర్లుగా టీమ్ ఇండియా ఉపయోగించుకోవచ్చు.

పాండ్యా, నితీష్ కుమార్‌లతో పాటు మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్‌లతో మొత్తం నలుగురు ఫాస్ట్ బౌలర్లను ఎంచుకోవచ్చు.

అలాగే వరుణ్ చక్రవర్తితో పాటు అక్షర్ పటేల్‌ను 2వ స్పిన్నర్‌గా ఉపయోగించుకునే అవకాశం ఉంది.

దీంతో టీమ్ ఇండియా మొత్తం ఆరుగురు బౌలర్లను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్రకారం, భారత జట్టు ప్లేయింగ్ 11 ఎలా ఉండనుందో ఓసారి చూద్దాం..

సంజు శాంసన్ (వికెట్ కీపర్)

అభిషేక్ శర్మ

తిలక్ వర్మ

సూర్యకుమార్ యాదవ్ (నాయకుడు)

రింకూ సింగ్

హార్దిక్ పాండ్యా

అక్షర్ పటేల్

నితీష్ కుమార్ రెడ్డి

మహ్మద్ షమీ

అర్ష్దీప్ సింగ్

వరుణ్ చక్రవర్తి

భారత టీ20 జట్టు..

సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్).

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..