AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నా మనవడికి భోగి పళ్లు పోస్తున్నాం వీడియో

నా మనవడికి భోగి పళ్లు పోస్తున్నాం వీడియో

Samatha J
|

Updated on: Jan 15, 2026 | 3:40 PM

Share

నటుడు రాజేంద్ర ప్రసాద్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ భోగి పండుగ నాడు తన మనవడు త్రిలోక్‌కు భోగి పళ్ళు పోశారు. కొడుకు బాలాజీ, కోడలు గీత సమక్షంలో రేగిపళ్ళు, చాక్లెట్లు, పువ్వులు, డబ్బులు కలిపి సంప్రదాయబద్ధంగా ఈ వేడుక నిర్వహించారు. సంక్రాంతి ప్రతి ఇంటా ఆయురారోగ్య ఐశ్వర్యాలను, ఆనందాలను నింపాలని ఆయన ఆకాంక్షించారు.

ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ తన అభిమానులకు, ప్రపంచ నలుమూలల్లో ఉన్న తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సంక్రాంతి పండుగ అందరి ఇళ్లల్లోనూ ఆయురారోగ్య ఐశ్వర్యాలను, ఆనందాలను నింపాలని ఆయన మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. సంక్రాంతి పండుగలో భాగంగా వచ్చే భోగి రోజున మనవళ్లకు భోగి పళ్ళు పోసే సంప్రదాయాన్ని రాజేంద్ర ప్రసాద్ తమ కుటుంబంలోనూ పాటించారు. ఈ ఏడాది తన మనవడు త్రిలోక్‌కు భోగి పళ్ళు పోశారు. ఈ శుభకార్యం తన కొడుకు బాలాజీ, కోడలు గీత సమక్షంలో జరిగింది.

మరిన్ని వీడియోల కోసం :

జపాన్‌లో సుకుమార్‌.. పుష్ప2 పనుల్లో బిజీబిజీ

కల్కి 2 హీరోయిన్ ఎవరు.. అసలేం జరుగుతోంది అక్కడ..?

చిరంజీవి..యాక్టింగ్ చించేశారు..అల్లు అరవింద్ రియాక్షన్ ఇదే

పెళ్లాం కాదు.. భర్త ఊరెళితే.. భర్త మహాశయులకు విజ్ఞప్తి రివ్యూ