AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: రెండేళ్ల విరామం తర్వాత రీఎంట్రీ.. తొలి మ్యాచ్‌లోనే నిరాశ పరిచిన టీమిండియా క్రికెటర్..

మురళీ విజయ్ 2018లో ఆస్ట్రేలియాతో భారత్ తరఫున చివరి టెస్టు ఆడాడు. అప్పటి నుంచి అతను జట్టుకు దూరమయ్యాడు.

Team India: రెండేళ్ల విరామం తర్వాత రీఎంట్రీ.. తొలి మ్యాచ్‌లోనే నిరాశ పరిచిన టీమిండియా క్రికెటర్..
Murali Vijay Tnpl
Venkata Chari
|

Updated on: Jun 25, 2022 | 9:25 PM

Share

టీమిండియా వెటరన్ బ్యాట్స్‌మెన్ మురళీ విజయ్ దాదాపు రెండేళ్ల తర్వాత మళ్లీ క్రికెట్‌లోకి వచ్చాడు. రహీల్ షా కెప్టెన్‌గా ఉన్న తమిళనాడు ప్రీమియర్ లీగ్ (TNPL) ఆరవ సీజన్‌లో విజయ్ రూబీ ట్రిచీ వారియర్స్ తరపున ఆడుతున్నాడు. మురళీ విజయ్‌కు పునరాగమనం మంచిది కాదనేలా కేవలం 8 పరుగులు చేసిన తర్వాత రనౌట్ అయ్యాడు. మురళీ విజయ్ ఇంతకు ముందు సెప్టెంబరు 2020లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తరపున ఆడుతున్నట్లు కనిపించింది. అప్పటి నుంచి విజయ్ పోటీ క్రికెట్‌కు దూరమయ్యాడు. విజయ్ చివరిసారిగా 2019 డిసెంబర్‌లో జరిగిన రంజీ ట్రోఫీలో తమిళనాడు తరపున ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ఆడాడు. అలాగే, 2018లో ఆస్ట్రేలియాతో పెర్త్‌లో భారత్ తరపున విజయ్ చివరి టెస్టు ఆడాడు.

తన పునరాగమనం గురించి విజయ్ మాట్లాడుతూ, ‘నాకు చాలా కాలం పాటు ఆడాలని ఉంది. కేవలం వ్యక్తిగత విరామం తీసుకున్నాను. నాకు యువ కుటుంబం ఉంది. నేను వారిని జాగ్రత్తగా చూసుకోవాలనుకున్నాను. నేను ఇప్పుడు నా క్రికెట్‌ను ఆస్వాదిస్తున్నాను. ఫిట్‌గా ఉన్నాను. TNPLలో నా జట్టుకు నేను బాగా రాణిస్తానని ఆశిస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు.

మురళీ విజయ్ అంతర్జాతీయ రికార్డు..

ఇవి కూడా చదవండి

38 ఏళ్ల మురళీ విజయ్ 61 టెస్టు మ్యాచ్‌ల్లో 38.28 సగటుతో 3982 పరుగులు చేశాడు. ఈ సమయంలో, అతని బ్యాట్‌తో 12 సెంచరీలు, 15 అర్ధ సెంచరీలు వచ్చాయి. విజయ్ భారత్ తరపున 17 వన్డేలు, 9 టీ20 మ్యాచ్‌లు కూడా ఆడాడు. వన్డే ఇంటర్నేషనల్‌లో విజయ్ పేరు మీద 21.18 సగటుతో 339 పరుగులు నమోదయ్యాయి. అదే సమయంలో టీ20 ఇంటర్నేషనల్‌లో విజయ్ 169 పరుగులు చేశాడు.