AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సర్పంచ్ సాబ్ కెప్టెన్సీలోనే ఎందుకిలా.. టీమిండియా హ్యాట్రిక్ ఓటములకు అసలు కారణం ఇదేనంట..?

Shreyas Iyer Captaincy: సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో విజయపథంలో దూసుకుపోయిన భారత జట్టు, శ్రేయాస్ అయ్యర్ రాకతో ఒక్కసారిగా లయ తప్పింది. రాబోయే ఐసీసీ టోర్నీలను దృష్టిలో ఉంచుకుని మేనేజ్‌మెంట్ ప్రయోగాలు చేయడం మంచిదే అయినప్పటికీ, వరుస ఓటములు జట్టు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. ఇప్పటికైనా ఓపెనింగ్ సమస్యలను చక్కదిద్ది, బౌలింగ్ వ్యూహాలను మార్చుకోకపోతే రాబోయే మ్యాచ్‌ల్లో మరిన్ని పరాజయాలు తప్పవు.

సర్పంచ్ సాబ్ కెప్టెన్సీలోనే ఎందుకిలా.. టీమిండియా హ్యాట్రిక్ ఓటములకు అసలు కారణం ఇదేనంట..?
Team India Defeats, Shreyas Iyer Captaincy
Venkata Chari
|

Updated on: Jul 06, 2026 | 11:24 AM

Share

Shreyas Iyer Captaincy: రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ ల తర్వాత భారత టీ20 జట్టు పగ్గాలు చేపట్టిన శ్రేయాస్ అయ్యర్ నాయకత్వంలో టీమ్ ఇండియా వరుస పరాజయాలను చవిచూస్తోంది. ఒకప్పుడు టీ20ల్లో తిరుగులేని శక్తిగా నిలిచిన భారత్, గత నాలుగు మ్యాచ్‌ల్లో మూడింట్లో ఓడిపోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. ఈ ఘోర వైఫల్యాల వెనుక ఉన్న ముఖ్యమైన మూడు కారణాలపై ప్రత్యేక విశ్లేషణ.

కీలక ఆటగాళ్లు దూరం.. కుప్పకూలుతున్న లైనప్..

భారత జట్టును ప్రస్తుతం వేధిస్తున్న ప్రధాన సమస్య సీనియర్ ఆటగాళ్ల గైర్హాజరీ. వచ్చే ఏడాది జరగబోయే వన్డే ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకుని జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా వంటి మ్యాచ్ విన్నర్లకు విశ్రాంతినిచ్చారు. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ పేరిట వీరిని పక్కన పెట్టడం జట్టుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీనికి తోడు యువ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి గాయం కారణంగా, పేసర్ మహ్మద్ సిరాజ్ ఫిట్‌నెస్ సమస్యల వల్ల సిరీస్‌లకు దూరమయ్యారు. వీరి స్థానాలను భర్తీ చేయడంలో యువ ఆటగాళ్లు పూర్తిగా విఫలమవుతున్నారు. అనుభవం లేని బౌలింగ్ లైనప్ ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయలేకపోతోంది.

ఇది కూడా చదవండి: ఇదెక్కడి దారుణం గంభీర్.. మంచోడిని పక్కనపెట్టి, అలాంటోడికి ఛాన్స్ ఇచ్చి, పరువు తీసుకున్నారుగా

ఇవి కూడా చదవండి

ఓపెనర్ల వైఫల్యం.. పవర్‌ప్లేలోనే దెబ్బ..

టీమ్ ఇండియా బ్యాటింగ్ వెన్నెముక అయిన ఓపెనింగ్ జోడీ దారుణంగా విఫలమవుతోంది. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల్లో ఆడిన గత నాలుగు మ్యాచ్‌ల్లో ఒక్కసారి కూడా ఓపెనర్లు ఇద్దరూ కలిసి మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పలేకపోయారు. అభిషేక్ శర్మ ఒక మ్యాచ్‌లో రాణిస్తే, సంజూ శాంసన్ వరుసగా నిరాశపరుస్తున్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇచ్చినప్పటికీ, అతడు కేవలం 14 పరుగులకే పరిమితమయ్యాడు. పవర్‌ప్లేలోనే కీలక వికెట్లు కోల్పోతుండటంతో మిడిలార్డర్‌పై ఒత్తిడి పెరిగి జట్టు భారీ స్కోర్లు చేయలేకపోతోంది.

అంతర్జాతీయ క్రికెట్‌లో అయ్యర్‌కు కరువైన కెప్టెన్సీ అనుభవం..

ఐపీఎల్, దేశీవాళీ క్రికెట్‌లో శ్రేయాస్ అయ్యర్ విజయవంతమైన కెప్టెన్‌గా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ, అంతర్జాతీయ వేదికపై ఆ అనుభవం సరిపోవడం లేదు. టీమ్ ఇండియాకు కేవలం నాలుగు మ్యాచ్‌ల్లోనే సారథ్యం వహించిన అయ్యర్, క్లిష్ట సమయాల్లో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాడు. ఐర్లాండ్ వంటి చిన్న జట్టు చేతిలో క్లీన్‌స్వీప్‌కు గురికావడం, ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో బౌలింగ్ మార్పులు, జట్టు కాంబినేషన్లలో తడబడటం అతని నాయకత్వ లోపాలను ఎత్తిచూపుతోంది. అంతర్జాతీయ ఒత్తిడిని తట్టుకుని జట్టును ముందుకు నడిపించడంలో అయ్యర్ ఇంకా పరిణతి సాధించాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: వాడిని క్షమించను.. నమ్మి 7 నెలల తర్వాత ఛాన్స్ ఇస్తే నట్టేట ముంచాడు..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us