AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rohit Sharma: లార్డ్స్‌లో సెంచరీ కోల్పోయిన రోహిత్.. కట్‌చేస్తే.. డ్రెస్సింగ్ రూంలో ఏం జరిగిందంటే?

గతేడాది ఇంగ్లండ్‌లో పర్యటించిన భారత్‌ టెస్టు సిరీస్‌ ఆడింది. ఈ సిరీస్‌లో ప్రతి బ్యాట్స్‌మెన్ చేయాలనుకుంటున్న దాన్ని రోహిత్ శర్మ చేయలేకపోయాడు.

Rohit Sharma: లార్డ్స్‌లో సెంచరీ కోల్పోయిన రోహిత్.. కట్‌చేస్తే.. డ్రెస్సింగ్ రూంలో ఏం జరిగిందంటే?
Rohit Sharma Fitness
Venkata Chari
|

Updated on: Jul 15, 2022 | 9:08 PM

Share

క్రికెట్ మక్కాగా పిలిచే లార్డ్స్ మైదానంలో గురువారం ఇంగ్లండ్ చేతిలో భారత క్రికెట్ జట్టు 100 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు బౌలింగ్ అద్భుతం చేసినా బ్యాటింగ్ మాత్రం విఫలమైంది. కెప్టెన్ రోహిత్ శర్మ నుంచి విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్ వరకు విఫలమయ్యారు. ఈ మ్యాచ్‌ని వీక్షిస్తున్న భారత జట్టు మాజీ కోచ్ రవిశాస్త్రి పాత కథను పంచుకున్నారు. ఈ కథ రోహిత్ శర్మ గురించి. భారత జట్టు 2021లో ఇంగ్లండ్ పర్యటనలో ఉంది. రోహిత్ శర్మ లార్డ్స్‌కు అతి సమీపంలోకి రావడం ద్వారా సెంచరీ స్కోరును కోల్పోయాడు. అప్పుడు రోహిత్ ఎలా రియాక్ట్ అయ్యాడో శాస్త్రి చెప్పుకొచ్చాడు.

ఇది రెండో టెస్టు మ్యాచ్ గురించి. లార్డ్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 151 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించి సత్తా చాటింది. ఈ మ్యాచ్‌లో రోహిత్ 83 పరుగులు చేశాడు. లార్డ్స్‌లోని హానర్ బోర్డ్‌లో రోహిత్ పేరు రాసుకుంటాడని అనిపించినప్పుడు, జేమ్స్ అండర్సన్ బంతి అతని వికెట్లను పడగొట్టింది.

రోహిత్‌కు నిరాశే ఎదురైంది..

ఇవి కూడా చదవండి

సెంచరీని కోల్పోయిన తర్వాత రోహిత్ ఎంత నిరాశకు గురయ్యాడో.. ఎలా స్పందించాడో శాస్త్రి చెప్పుకోచ్చాడు. భారత్-ఇంగ్లండ్‌ల మధ్య జరుగుతున్న రెండో వన్డే సందర్భంగా శాస్త్రి మాట్లాడుతూ.. ‘రోహిత్ ఔట్ అయినప్పుడు డ్రెస్సింగ్ రూమ్‌కి వచ్చి టేబుల్ వద్ద నిశ్శబ్దంగా కూర్చున్నాడు. అతను నిరాశ చెందాడు. ఆ సెంచరీ సాధించాలనుకున్నాడు. లార్డ్స్‌లో సెంచరీ చేయడం ఏ బ్యాట్స్‌మెన్‌కైనా ప్రత్యేకమైన అనుభూతి. దీని గురించి అతను ఎంత నిరాశకు గురవుతున్నాడో.. దానిని ఓవల్‌లో పూర్తి చేశాడు.

రోహిత్ అద్భుతంగా ఆడాడు..

ఆ సిరీస్‌లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. అతను 368 పరుగులు చేశాడు. 2021లో ఇంగ్లండ్‌లో భారత్ ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడాల్సి ఉంది. అయితే ఐదవ మ్యాచ్‌కు ముందు కోవిడ్ జట్టులోకి ప్రవేశించడంతో టీమ్ ఇండియా నాలుగు మ్యాచ్‌ల తర్వాత తిరిగి వచ్చింది. ఈ ఏడాది ఎడ్జ్‌బాస్టన్‌లో మిగిలి ఉన్న ఈ టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలిచి సిరీస్‌ను 2-2తో సమం చేసింది. నాలుగు టెస్టు మ్యాచ్‌ల్లో రోహిత్ 36, 83, 59, 127 పరుగులు చేశాడు. ఓవల్‌లో రోహిత్ సాధించిన సెంచరీ విదేశీ గడ్డపై అతనికి తొలి టెస్టు సెంచరీగా నిలిచింది.

ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే