Ravindra Jadeja Controversy: థర్డ్ అంపైర్కే డౌట్.. అయినా, ఔటిచ్చాడు.. వివాదమైన జడేజా వికెట్..
India vs England: హైదరాబాద్ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో రవీంద్ర జడేజా ఔట్ వివాదం మారింది. ఈ భారత ఆల్ రౌండర్ 87 పరుగుల వద్ద ఔటయ్యాడు. జడేజా కేవలం 13 పరుగుల తేడాతో తన టెస్టు కెరీర్లో నాలుగో సెంచరీని కోల్పోయాడు. అయితే అతని వికెట్పై చాలా వివాదాలు నెలకొన్నాయి.

Ravindra Jadeja Controversy Video: హైదరాబాద్ టెస్టులో యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్లకు ఏ పరిస్థితి ఎదురైందో రవీంద్ర జడేజాకు కూడా అదే పరిస్థితి ఎదురైంది. అవును, యశస్వి, రాహుల్ల మాదిరిగానే రవీంద్ర జడేజా కూడా హైదరాబాద్ టెస్టులో సెంచరీ చేయలేకపోయాడు. మూడో రోజు ఆట తొలి సెషన్లో రవీంద్ర జడేజాను చూస్తుంటే.. టెస్టు కెరీర్లో నాలుగో సెంచరీ చేస్తాడని అనిపించినా.. 120వ ఓవర్లో జో రూట్ బంతికి ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. అయితే, జడేజా వికెట్ ప్రస్తుతం వివాదంగా మారింది.
రవీంద్ర జడేజా ఔటా?.. నాటౌటా?
రవీంద్ర జడేజా వికెట్ ఎందుకు వివాదాస్పదమైందో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే, అతను ఎలా ఔట్ అయ్యాడో అర్థం చేసుకుందాం. రూట్ వేసిన బంతికి రవీంద్ర జడేజా ఫ్రంట్ ఫుట్ డిఫెన్స్ చేశాడు. ఈ సమయంలో బంతి అతని ప్యాడ్లకు తగిలింది. అంపైర్ అతడిని ఔట్ చేశాడు. దీంతో రవీంద్ర జడేజా వెంటనే రివ్యూ తీసుకున్నాడు. రీప్లేలో బంతి అతని బ్యాట్కు తగిలి ప్యాడ్లకు తగిలినట్లు కనిపించింది. దీంతో జడేజా వెంటనే డీఆర్ఎస్ను కోరుకున్నాడు. దీని తర్వాత థర్డ్ అంపైర్ తనకు అందుబాటులో ఉన్న అన్ని టెక్నిక్లను ఉపయోగించాడు.
The Root cause of English smiles 😃 on Day 3! 🔥
Keep watching LIVE action from the #INDvENG 1st Test on #JioCinema, #Sports18 & #ColorsCineplex. 👈#JioCinemaSports #BazBowled #IDFCFirstBankTestSeries pic.twitter.com/46eaaYHB64
— JioCinema (@JioCinema) January 27, 2024
బంతి జడేజా ప్యాడ్లకు తగిలిందా లేదా బ్యాట్కు తగిలిందా అనే విషయాన్ని థర్డ్ అంపైర్ నిర్ధారించలేకపోయాడు. చాలా సేపు రీప్లే కొనసాగించి జడేజాను ఔట్ చేశాడు.
జడేజాను ఎందుకు ఔట్ చేశారు?
💔💔💔 unlucky 😔😔 just missed sword ⚔️ celebration 🎉😞 pic.twitter.com/ycSGmWmmHm
— Rajesh Biradar (@Rajesh_Biradar_) January 27, 2024
ప్రశ్న ఏమిటంటే, జడేజా బ్యాట్ లేదా ప్యాడ్ మొదట బంతికి తగిలిందో లేదో థర్డ్ అంపైర్కు తెలియనప్పుడు, అతను ఎలా ఔట్ అయ్యాడు? అనే ప్రశ్న వస్తుంది. ఇటువంటి పరిస్థితిలో, తరచుగా థర్డ్ అంపైర్ ఆన్-ఫీల్డ్ అంపైర్కు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటారు. మైదానంలోని అంపైర్ జడేజాను ఔట్ చేశాడు. అందుకే థర్డ్ అంపైర్ అతనితో అయోమయ స్థితిలో నిలబడి కనిపించాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
