Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs NZ: అతడిలాగానే బౌలింగ్ చేస్తా.. భారత బ్యాటర్లను కట్టడి చేస్తా.. ట్రెంట్ బౌల్ట్..

ఐసీసీ టీ20 వరల్డ్ కప్‎లో టీం ఇండియా ‎ఈ రోజు రాత్రి న్యూజిలాండ్‌తో తలపడనుంది. కివీస్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ న్యూజిలాండ్ బౌలింగ్ లైనప్‌లో కీలక ఉన్నాడు. అతను భారత బ్యాటర్లపై ఎలా ఒత్తిడి చేస్తాడో శనివారం వెల్లడించాడు..

IND vs NZ: అతడిలాగానే బౌలింగ్ చేస్తా.. భారత బ్యాటర్లను కట్టడి చేస్తా.. ట్రెంట్ బౌల్ట్..
Boult
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Oct 31, 2021 | 11:59 AM

ఐసీసీ టీ20 వరల్డ్ కప్‎లో టీం ఇండియా ‎ఈ రోజు రాత్రి న్యూజిలాండ్‌తో తలపడనుంది. కివీస్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ న్యూజిలాండ్ బౌలింగ్ లైనప్‌లో కీలక ఉన్నాడు. అతను భారత బ్యాటర్లపై ఎలా ఒత్తిడి చేస్తాడో శనివారం వెల్లడించాడు. “తొలి వికెట్లు ఖచ్చితంగా కాన్ఫిడెన్స్‎ను పెంచుతాయి. కానీ మనం బంతిని ఎక్కడ వెయ్యలనుకున్నామో స్పష్టంగా ఉండాలి” అని బౌల్ట్ చెప్పాడు. కివీస్ కూడా పాకిస్తాన్ చేతిలో ఓడిపోయింది. షాహీన్ షా ఆఫ్రిది పేస్ స్వింగ్‌కు భారత టాప్ ఆర్డర్ ఎలా ఎదుర్కొందో బౌల్ట్ చూశాడు. బౌల్ట్ లెఫ్టార్మ్ పేస్‌మెన్‌గా ఉన్నందున షాహీన్ లాగే బౌలింగ్ చేసి భారత బ్యాట్స్‌మెన్‌పై ఆధిపత్యం చేలాయించలనుకుంటున్నానని చెప్పాడు. ” ప్లాన్ ఏమిటో నాకు ఖచ్చితంగా తెలియదు. కొంతమంది బౌలర్లు ఏ ఓవర్లలో బౌలింగ్ చేస్తారో కానీ, మొన్న రాత్రి లెఫ్ట్ ఆర్మర్ షాహీన్ బౌలింగ్ చేసిన విధానం అద్భుతంగా ఉందని నేను అనుకున్నాను.

కానీ ఆ భారత లైనప్‌లో నాణ్యమైన బ్యాట్స్‌మెన్ ఉన్నారని నేను భావిస్తున్నాను. మొన్న రాత్రి షాహీన్ చేసిన పనిని నేను ప్రతిబింబించగలను” అని అనుభవజ్ఞుడైన పేస్‌మెన్ చెప్పాడు. ఇండియా వంటి కఠిన ప్రత్యర్థిని తేలికగా తీకోమని అన్నాడు. “భారత్‌తో ఆడినప్పుడు ఎల్లప్పుడూ చాలా ఉత్సాహం ఉంటుంది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ ICC టోర్నమెంట్‌లలో మేము ఇండియాపై విజయం సాధించాం. అలా అని వారిని తేలికగా తీసుకోమన్నారు. ఈరోజు జరగబోయే మ్యాచ్ రెండు జట్లకు కీలకమైంది. మంచి ప్రదర్శన కోసం ఎదురు చూస్తున్నామని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను” అని బౌల్ట్ చెప్పాడు.

అయితే ఇప్పటి నుంచి ఇండియాకు ప్రతీ మ్యాచ్‌ కీలకం కానుంది. భారత్ ఈ మ్యాచ్‌తోపాటు అఫ్ఘాన్‌, నమీబియా, స్కాట్లాండ్‌పై గెలిస్తే సెమీస్‎కు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. ప్రారంభ మ్యాచ్‌లో భారత్‌ ఆడిన తీరు అభిమానులు నిరాశపరిచింది. పాక్‎తో మ్యాచ్‎లో బౌలర్లు ఒక్క వికెట్ తీయకపోవడం ఆందోళన కలిస్తున్న విషయం. ఇదే పిచ్‎పై పాకిస్తాన్ బౌలర్ల అలవోకగా వికెట్లు తీశారు. ఇప్పుడు న్యూజిలాండ్‎పై తమ స్థాయికి తగ్గ ఆటతీరును కనబర్చకుంటే ఇండియాకు సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారతాయి. అదే సమయలో న్యూజిలాండ్ కూడా ఇండియా పరిస్థితి లాగే ఉంది.

Read Also.. Viral: పార్టీలో కోహ్లీ, అనుష్క శర్మ కూతురు వామిక.. సోషల్ మీడియాలో వైరలవుతున్న ఫొటోలు..