AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: కింగ్ కోహ్లీ లేకుండా టీమిండియా లేదు.. ఐసీసీని తిట్టిపోస్తున్న నెటిజన్లు.. ఎందుకంటే?

T20 World Cup 2022, Team India: ICC T20 వరల్డ్ కప్ కోసం టీమ్ ఇండియా వీడియోను నెట్టింట్లో షేర్ చేసింది. దీంతో ఐసీసీని నెటిజన్లు తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు.

Video: కింగ్ కోహ్లీ లేకుండా టీమిండియా లేదు.. ఐసీసీని తిట్టిపోస్తున్న నెటిజన్లు.. ఎందుకంటే?
Team India
Venkata Chari
|

Updated on: Oct 19, 2022 | 4:59 PM

Share

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) తన సోషల్ మీడియా ద్వారా ప్రతిరోజూ కొన్ని సృజనాత్మక క్రికెట్ వీడియోలను పోస్ట్ చేస్తూనే ఉంటుంది. తాజాగా భారత జట్టుకు సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో ప్రదర్శించింది. అయితే, ICC ద్వారా షేర్ చేసిన వీడియోలు తరచుగా అభిమానులను ఆకర్షిస్తాయి. కానీ, ఈసారి మాత్రం ఐసీసీని ముప్పతిప్పలు పెడుతోంది. ఎందుకంటే ఈ వీడియోని చూసిన అభిమానులు చాలాకోపంగా ఉన్నారు.

అసలేం జరిగిందంటే..

వాస్తవానికి, T20 ప్రపంచ కప్ కోసం భారత జట్టు వీడియోను ICC షేర్ చేసింది. ఈ వీడియోలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ ఉన్నారు. ఈ వీడియోలో విరాట్ కోహ్లీ లేకపోవడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు వీడియోపై దారుణంగా కామెంట్లు చూస్తూ, ఐసీసీని ఏకిపారేస్తున్నారు. ‘కింగ్ కోహ్లీ కహా హై’ అంటూ ఓ యూజర్ కామెంట్ చేయగా, అదే సమయంలో మరో యూజర్ ‘విరాట్ లేకుండా టీమిండియా లేదు’ అని కామెంట్ చేశారు.

ఇవి కూడా చదవండి

ఫీల్డింగ్‌లో మెరిసిన విరాట్..

గత ఆసియా కప్ నుంచి విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతున్నాడు. అదే సమయంలో, ఆసియా కప్ తర్వాత, కోహ్లి ఆస్ట్రేలియా, ఆఫ్రికా సిరీస్‌లలో కూడా మంచి ప్రదర్శన చేశాడ. అక్టోబర్ 17న ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో విరాట్ తన అద్భుతమైన ఫీల్డింగ్‌తో అందరినీ ఆకర్షించాడు. 19వ ఓవర్లో అతను అద్భుతంగా రనౌట్ చేశాడు. అదే సమయంలో 20వ ఓవర్‌లో పీట్‌ కమిన్స్‌ వేసిన అద్భుత క్యాచ్‌ అందుకున్నాడు. దీంతో ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ రెండు బంతుల్లో 2 వికెట్లు తీసి మ్యాచ్‌ని భారత జట్టు ఖాతాలో వేసుకున్నాడు.

View this post on Instagram

A post shared by ICC (@icc)

టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు తన తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 23, ఆదివారం పాకిస్థాన్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్‌ మెల్‌బోర్న్‌ మైదానంలో జరగనుంది.

టీ20 ప్రపంచ కప్‌లో ఆడే భారత జట్టు..

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్, దినేష్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, యుజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్ష్దీప్ సింగ్.

స్టాండ్‌బై ఆటగాళ్లు: మహ్మద్ షమీ, శ్రేయాస్ అయ్యర్, రవి బిష్ణోయ్, దీపక్ చాహర్.