AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Syed Mushtaq Ali T20 : అసలు సిసలు పవర్ హిట్టింగ్ అంటే ఇదే.. సెంచరీతో చెలరేగిపోయిన సాయి సుదర్శన్

Syed Mushtaq Ali T20 : సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 సిరీస్‌లో తొలి నాలుగు మ్యాచ్‌లలో ఒక్క విజయాన్ని మాత్రమే నమోదు చేసి, పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న తమిళనాడు జట్టు, ఆ తర్వాత అద్భుతంగా పుంజుకుంది. త్రిపురపై 61 పరుగుల తేడాతో గెలిచినప్పటికీ, ఝార్ఖండ్‌పై 28 పరుగుల తేడాతో ఓడిపోయింది.

Syed Mushtaq Ali T20 : అసలు సిసలు పవర్ హిట్టింగ్ అంటే ఇదే.. సెంచరీతో చెలరేగిపోయిన సాయి సుదర్శన్
Sai Sudharsans Century
Rakesh
|

Updated on: Dec 09, 2025 | 10:31 AM

Share

Syed Mushtaq Ali T20 : సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 సిరీస్‌లో తొలి నాలుగు మ్యాచ్‌లలో ఒక్క విజయాన్ని మాత్రమే నమోదు చేసి, పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న తమిళనాడు జట్టు, ఆ తర్వాత అద్భుతంగా పుంజుకుంది. త్రిపురపై 61 పరుగుల తేడాతో గెలిచినప్పటికీ, ఝార్ఖండ్‌పై 28 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో గ్రూప్‌లో నిలదొక్కుకోవాలంటే సౌరాష్ట్ర జట్టుపై తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అహ్మదాబాద్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో సౌరాష్ట్ర టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ విశ్వరాజ్ జడేజా కేవలం 39 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 70 పరుగులు చేసి అద్భుతంగా రాణించాడు. సౌరాష్ట్ర ఇన్నింగ్స్‌లో జడేజాతో పాటు సమర్ జగ్గర్ (42 బంతుల్లో 66), రుషిత్ అహిర్ (11 బంతుల్లో 14) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. మిగతా బ్యాట్స్‌మెన్ సింగిల్ డిజిట్లకే పరిమితమైనా, వీరిద్దరి మెరుపులతో సౌరాష్ట్ర జట్టు 20 ఓవర్లలో 183/8 పరుగులు చేసింది. తమిళనాడు బౌలర్లలో శిలంబరసన్ 4 ఓవర్లలో 30 పరుగులకు 3 వికెట్లు, ఇసాక్కిముత్తు 4 ఓవర్లలో 29 పరుగులకు 2 వికెట్లు తీశారు.

184 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన తమిళనాడు జట్టు తరఫున, సాయి సుదర్శన్ అద్భుతమైన ఆటతీరు కనబరిచాడు. గత కొన్ని నెలలుగా ఫామ్‌లో లేని సుదర్శన్, ఈ మ్యాచ్‌లో తన ఫామ్‌ను నిరూపించుకున్నాడు. అతను 55 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 101 పరుగులు చేసి చివరి వరకు క్రీజులో నిలిచాడు. ఇతనికి తోడు చివరి దశలో రితిక్ ఈశ్వరన్ (17 బంతుల్లో 29), సన్నీ సింధు (కేవలం 9 బంతుల్లో 30 పరుగులు) కూడా మెరుపులు మెరిపించారు. దీంతో తమిళనాడు జట్టు 18.4 ఓవర్లలో 185/7 పరుగులు చేసి, 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఈ విజయం తర్వాత అట్టడుగున ఉన్న తమిళనాడు జట్టు చివరి 3 మ్యాచ్‌లలో 2 విజయాలు సాధించి, 4వ స్థానానికి చేరుకుంది. గ్రూప్ డి లో జార్ఖండ్, రాజస్థాన్ అత్యధిక విజయాలతో మొదటి రెండు స్థానాల్లో నిలిచి తదుపరి రౌండ్‌కు అర్హత సాధించాయి. ఈ సిరీస్‌లో బలమైన జట్టుగా భావించిన కర్ణాటక, 7 మ్యాచ్‌లలో కేవలం 2 విజయాలు మాత్రమే సాధించి, గ్రూప్ డి లో 5వ స్థానంతో తదుపరి రౌండ్‌కు వెళ్లే అవకాశాన్ని కోల్పోయింది. మిగిలిన గ్రూప్‌లలో, గ్రూప్ A నుంచి ముంబై, ఆంధ్రప్రదేశ్; గ్రూప్ B నుంచి హైదరాబాద్, మధ్యప్రదేశ్; గ్రూప్ C నుంచి పంజాబ్, హర్యానా జట్లు తదుపరి రౌండ్‌కు అర్హత సాధించాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..