Sachin Tendulkar Statue: నేడు వాంఖడే స్టేడియంలో సచిన్ విగ్రహావిష్కరణ.. హాజరుకానున్న దిగ్గజాలు.. స్పెషాలిటీ ఏంటంటే?
ఈరోజు జరిగే ఆవిష్కరణ కార్యక్రమంలో బీసీసీఐ సెక్రటరీ జై షాతో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా హాజరుకానున్నారు. రెండు దశాబ్దాల విజయవంతమైన కెరీర్ తర్వాత, సచిన్ తన 200వ, చివరి టెస్టును నవంబర్ 2013లో వాంఖడే స్టేడియంలో ఆడాడు. 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగింది. ఇక్కడ భారత్ శ్రీలంకను ఓడించి 28 ఏళ్ల తర్వాత ప్రపంచకప్ గెలుచుకుంది.

Sachin Tendulkar Statue: ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) బుధవారం వాంఖడే స్టేడియంలో లెజెండరీ సచిన్ టెండూల్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనుంది. ఈ వేడుక ఈరోజు సాయంత్రం 5:00 గంటలకు జరగనుంది. స్టేడియంలోని సచిన్ టెండూల్కర్ స్టాండ్ దగ్గర సచిన్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహం సచిన్ జీవితంలో 50 సంవత్సరాల కాలానికి అంకితం చేశారు. ఈ ఏడాది ఏప్రిల్లో సచిన్ తన 50వ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకున్నాడు.
ఈరోజు జరిగే ఆవిష్కరణ కార్యక్రమంలో బీసీసీఐ సెక్రటరీ జై షాతో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా హాజరుకానున్నారు. రెండు దశాబ్దాల విజయవంతమైన కెరీర్ తర్వాత, సచిన్ తన 200వ, చివరి టెస్టును నవంబర్ 2013లో వాంఖడే స్టేడియంలో ఆడాడు.
నేను ఇక్కడ నా మొదటి రంజీ మ్యాచ్ ఆడాను – సచిన్..
టెండూల్కర్ ఈ ఏడాది మార్చిలో సచిన్ విగ్రహాన్ని తయారు చేయడంపై మాట్లాడుతూ , ‘నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇదంతా 1988లో వాంఖడేలో ప్రారంభమైంది. ఇక్కడే నా మొదటి రంజీ మ్యాచ్ ఆడాను. నేను ప్రొఫెషనల్ ప్లేయర్గా మారడానికి ముందు, ఇక్కడే కోచ్ అచ్రేకర్ సార్ నన్ను మందలించారు. ఆ తర్వాత నేను తీవ్రమైన క్రికెటర్గా మారాను. ఇది నాకు చాలా ప్రత్యేకమైన ప్రదేశం, ఈ స్థలంతో నాకు చాలా ప్రత్యేకమైన జ్ఞాపకాలు ఉన్నాయి. వాంఖడే స్టేడియంలో నా విగ్రహం నిర్మించడం చాలా పెద్ద విషయం’ అంటూ చెప్పుకొచ్చాడు.
వాంఖడే స్టేడియంలో 2011 ప్రపంచకప్ ఫైనల్..
2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగింది. ఇక్కడ భారత్ శ్రీలంకను ఓడించి 28 ఏళ్ల తర్వాత ప్రపంచకప్ గెలుచుకుంది. ప్రపంచకప్ గెలిచిన తొలి ఆతిథ్య జట్టుగా భారత్ నిలిచింది. ఇంతకు ముందు ఏ జట్టు కూడా తన సొంత గడ్డపై ప్రపంచకప్ గెలవలేదు. దీంతో సచిన్ టెండూల్కర్ ప్రపంచకప్ కల కూడా నెరవేరింది.
సీకే నాయుడు తర్వాత రెండోసారి..
Wankhede Stadium to get maiden statue of #SachinTendulkar tomorrow
Read: https://t.co/SDgIigH7E9 pic.twitter.com/STF9xTicCh
— IANS (@ians_india) October 31, 2023
స్టేడియంలో విగ్రహం ఏర్పాటు చేయనున్న రెండో భారత క్రికెటర్ సచిన్. ఇప్పటి వరకు, భారత మాజీ కెప్టెన్ కల్నల్ సీకే నాయుడు విగ్రహాలు మాత్రమే మూడు వేర్వేరు ప్రదేశాలలో ప్రతిష్టించబడ్డాయి. ఇందులో ఇండోర్లోని హోల్కర్ స్టేడియం, నాగ్పూర్లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ (VCA) స్టేడియం, ఆంధ్రాలోని YSR స్టేడియం ఉన్నాయి.
చిన్నస్వామి స్టేడియంలో రాహుల్ ద్రవిడ్ పేరు..
Sachin Tendulkar statue is set to be unveiled tomorrow.
The God of cricket…!!!!#SachinTendulkar #CricketTwitter pic.twitter.com/zZNv4Yt9S7
— We Miss You SACHIN (@WeMissYouSachin) October 31, 2023
బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం బయట భారత మాజీ బ్యాట్స్మెన్ రాహుల్ ద్రవిడ్ పేరు మీద కూడా గోడ ఉంది. దానిపై ‘కమిట్మెంట్, క్లాస్, కన్సిస్టెన్సీ’ అనే మూడు పదాలు రాసి ఉంచారు. ఈ మూడు పదాలు రాహుల్ ద్రవిడ్ వ్యక్తిత్వాన్ని చక్కగా వివరిస్తాయి. ద్రవిడ్ ‘ది వాల్’ అంటే బెస్ట్ డిఫెన్సివ్ ప్లేయర్ అనే బిరుదు కూడా అందుకున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








