AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మొహమ్మద్‌ సిరాజ్‌ను కాపాడుకోండి..! ఇండియాకు బిగ్‌ వార్నింగ్‌..

ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో మహ్మద్ సిరాజ్ అద్భుతమైన బౌలింగ్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. 23 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. అయితే, అతని పనిభారం, గాయం ముప్పు గురించి మాజీ ఆటగాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిరాజ్‌కు విశ్రాంతి అవసరమని, అతని పనిభారాన్ని నియంత్రించాలని సూచిస్తున్నారు.

మొహమ్మద్‌ సిరాజ్‌ను కాపాడుకోండి..! ఇండియాకు బిగ్‌ వార్నింగ్‌..
Mohammed Siraj
SN Pasha
|

Updated on: Aug 08, 2025 | 5:53 PM

Share

ఇంగ్లాండ్‌తో జరిగిన 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో టీమిండియా అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ అద్భుతంగా రాణించి అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు. ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్‌ను నిలువరించి.. బుమ్రా లేకపోయినా అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. ఈ టెస్ట్ సిరీస్‌లో మహ్మద్ సిరాజ్ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్. ఇప్పుడు టెస్ట్ సిరీస్ ముగిసిన తర్వాత, భారత మాజీ ఆటగాడు మహ్మద్ సిరాజ్ గురించి పెద్ద ప్రకటన చేశాడు. మహ్మద్ సిరాజ్ గాయపడకుండా కాపాడాలని టీమిండియా మాజీ పేసర్‌ ఆర్పీ సింగ్‌ టీమిండియా మేనేజ్‌మెంట్‌ను హెచ్చరించాడు.

ఆర్పీ సింగ్‌ మాట్లాడుతూ.. ఫాస్ట్ బౌలర్లకు గాయాలు కావడం చాలా పెద్ద ప్రమాదం అని అన్నాడు. ఎందుకంటే వారు చాలా తక్కువ సమయంలో చాలా మ్యాచ్‌లు ఆడారు. బుమ్రా వర్క్‌లోడ్‌ను మ్యానేజ్‌ చేసినట్లే, సిరాజ్ వర్క్‌లోడ్‌ను కూడా మ్యానేజ్‌ చేయాలి. సిరాజ్ కూడా ఇప్పుడు బుమ్రా లీగ్‌లోకి వచ్చాడు. అతను గాయపడకుండా కాపాడుకోవాలి. మనం అతని పనిభారాన్ని తీవ్రంగా పరిగణించాలి. ఇంగ్లాండ్‌తో జరిగిన 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో అతను నిజంగా అద్భుతంగా బౌలింగ్ చేశాడు.

ఇంగ్లాండ్‌తో జరిగిన 5 టెస్ట్ మ్యాచ్‌ల్లో మొహమ్మద్ సిరాజ్ 23 వికెట్లు పడగొట్టాడు. ఈ సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. తొలిసారిగా మొహమ్మద్ సిరాజ్ ఒక టెస్ట్ సిరీస్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టాడు. జస్ప్రీత్ బుమ్రా గురించి మాట్లాడుతూ ఈ టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందు, భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ జస్ప్రీత్ బుమ్రా పూర్తిగా ఫిట్‌గా లేనందున మూడు టెస్ట్‌లలో మాత్రమే పాల్గొంటారని ధృవీకరించారు. అతను మొదటి, మూడవ, నాల్గవ టెస్ట్ మ్యాచ్‌లలో పాల్గొన్నాడు.

ఐదవ టెస్ట్ మ్యాచ్‌లో మొహమ్మద్ సిరాజ్ మొత్తం 9 వికెట్లు పడగొట్టాడు. దీని కారణంగా ఇంగ్లాండ్, భారత్‌ మధ్య టెస్ట్ సిరీస్ 2-2తో డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్ గెలవడానికి ఇంగ్లాండ్ 374 పరుగులు అవసరమైన టైమ్‌లో వారు 367 పరుగులు మాత్రమే చేయగలిగారు. మొహమ్మద్ సిరాజ్ ఆటతీరును చాలా మంది అభిమానులు, క్రికెట్ నిపుణులు ప్రశంసించారు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి