IPL 2025: ఆ జట్టుతోనే ‘హిట్‌మ్యాన్’ ప్రయాణం.. రూమర్స్‌కు చెక్ పెట్టిన ఫ్రాంచైజీ..

IPL 2025 మెగా వేలానికి ముందు, వార్తల్లో ఎక్కువగా వినిపించే పేరు ముంబై మాజీ సారధి రోహిత్ శర్మ. గత సీజన్‌లో జరిగిన కెప్టెన్సీ వివాదమే దీనికి ప్రధాన కారణం. హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మల విషయంలో ఏం జరిగిందో తెలిసిందే. అయితే, రోహిత్ శర్మ ఈసారి ముంబై ఇండియన్స్‌లోనే ఉంటాడా లేదా వేరే జట్టులోకి వెళ్తాడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత సీజన్ నుంచి రోహిత్ ముంబైని విడిచిపెట్టి మరొక జట్టులో చేరతాడని చాలా నివేదికలు వెలువడ్డాయి.

IPL 2025: ఆ జట్టుతోనే 'హిట్‌మ్యాన్' ప్రయాణం.. రూమర్స్‌కు చెక్ పెట్టిన ఫ్రాంచైజీ..
Rohit Sharma Ipl 2025
Follow us

|

Updated on: Sep 04, 2024 | 1:27 PM

IPL 2025 మెగా వేలానికి ముందు, వార్తల్లో ఎక్కువగా వినిపించే పేరు ముంబై మాజీ సారధి రోహిత్ శర్మ. గత సీజన్‌లో జరిగిన కెప్టెన్సీ వివాదమే దీనికి ప్రధాన కారణం. హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మల విషయంలో ఏం జరిగిందో తెలిసిందే. అయితే, రోహిత్ శర్మ ఈసారి ముంబై ఇండియన్స్‌లోనే ఉంటాడా లేదా వేరే జట్టులోకి వెళ్తాడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత సీజన్ నుంచి రోహిత్ ముంబైని విడిచిపెట్టి మరొక జట్టులో చేరతాడని చాలా నివేదికలు వెలువడ్డాయి. అయితే, ఇప్పుడు రోహిత్ శర్మపై కొత్త వాదన చేసినట్లు తెలుస్తోంది. మీడియా నివేదికల ప్రకారం, ఫ్రాంచైజీతో అతని వివాదాలన్నీ పరిష్కరించినట్లు అంటున్నారు. నీతా అంబానీ ఫ్రాంచైజీ తన మాజీ కెప్టెన్‌ను కొనసాగించడాన్ని ఆమోదించింది. రోహిత్ కూడా ముంబైలోనే ఉండాలని నిర్ణయించుకున్నాడు.

రోహిత్ గురించి ముంబై ఇండియన్స్ ఏం చెప్పింది?

IPL 2024కి ముందు, ముంబై ఇండియన్స్ అప్పటి గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను ట్రేడ్ ద్వారా జట్టులో చేర్చుకుంది. ఇందుకోసం ఫ్రాంచైజీ భారీ మొత్తాన్ని చెల్లించింది. మీడియా కథనాల ప్రకారం, ముంబై రూ. 100 కోట్ల బదిలీ ఫీజు చెల్లించింది. అయితే, ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించలేదు.

ఆ తర్వాత ఫ్రాంచైజీ హఠాత్తుగా పాండ్యాను జట్టుకు కెప్టెన్‌గా చేయడంతో అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడి నుంచే రోహిత్‌ విషయంలో సమస్య కూడా మొదలైంది. అయితే, తాజా నివేదికలో వివాదాలన్నీ పరిష్కారమయ్యాయని పేర్కొంది. ముంబై కుటుంబంలో రోహిత్ శర్మ ముఖ్యమైన సభ్యుడిగా ఉన్నాడని, అతడిని నిలబెట్టుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని ముంబై తెలిపింది.

రోహిత్ శర్మ మళ్లీ కెప్టెన్ అవుతాడా?

రోహిత్ శర్మ 2013లో ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్సీని అందుకున్నాడు. కెప్టెన్ అయిన వెంటనే జట్టు ట్రోఫీని కైవసం చేసుకున్నాడు. ఆ తర్వాత, అతను 2015, 2017, 2019, 2020లో కూడా ముంబైని IPL ఛాంపియన్‌గా చేశాడు. అయితే, అతను మళ్లీ తదుపరి 3 సంవత్సరాల పాటు IPL ట్రోఫీని గెలుచుకోవడంలో విఫలమయ్యాడు. ఆ తర్వాత అతను తన కెప్టెన్సీని కోల్పోయాడు.

రోహిత్ శర్మ 2022లో టీమ్ ఇండియా కెప్టెన్సీని పొందాడు. ఆ తర్వాత టీమ్ ఇండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్, 2023 ODI ప్రపంచ కప్‌లో ఫైనల్స్ ఆడింది. 2024 T20 ప్రపంచ కప్‌ను కైవసం చేసుకుంది. ఈ భారీ విజయం తర్వాత, ముంబై అతనిని కొనసాగించవచ్చు. కానీ, తదుపరి సీజన్‌లో అతన్ని కెప్టెన్‌గా చేయదని ఇప్పుడు వాదనలు వినిపిస్తున్నాయి. హార్దిక్ పాండ్యా మాత్రమే జట్టుకు నాయకత్వం వహిస్తాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..