AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026: ఐపీఎల్ హిస్టరీలోనే అత్యంత ఖరీదైన ప్లేయర్.. కట్‌చేస్తే.. ఫ్రాంచైజీకి తలనొప్పిలా మారిన కెప్టెన్..!

Rishabh Pant Failure IPL 2026: ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డు సృష్టించిన రిషబ్ పంత్ ఫామ్ ప్రస్తుతం లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు పెద్ద తలనొప్పిగా మారింది. ఆదివారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంత్ మరోసారి నిరాశపరిచాడు. ఈ సీజన్‌లో ఆయన ఆడిన నాలుగు ఇన్నింగ్స్‌ల మొత్తం స్కోరు కంటే, యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కేవలం సిక్సర్ల ద్వారానే ఎక్కువ పరుగులు సాధించడం గమనార్హం.

IPL 2026: ఐపీఎల్ హిస్టరీలోనే అత్యంత ఖరీదైన ప్లేయర్.. కట్‌చేస్తే.. ఫ్రాంచైజీకి తలనొప్పిలా మారిన కెప్టెన్..!
లక్నో సూపర్‌జెయింట్స్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి, రిషబ్ పంత్ కెప్టెన్సీలోనూ, బ్యాటింగ్‌లోనూ నిరాశపరిచాడు. ఈ సీజన్‌లో ఆడిన 7 మ్యాచ్‌లలో అతను కేవలం 147 పరుగులు మాత్రమే చేసి, ఒకే ఒక్క అర్ధశతకం నమోదు చేశాడు. దీని ఫలితంగా, లక్నో జట్టు ఆడిన ఏడు మ్యాచ్‌లలో ఐదింటిలో ఓడిపోయి, పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచింది. రూ. 27 కోట్ల జీతం సంపాదిస్తున్న పంత్, ఐపీఎల్‌లో అత్యంత ఖరీదైన ఆటగాడు.
Venkata Chari
|

Updated on: Apr 12, 2026 | 5:16 PM

Share

Rishabh Pant Failure IPL 2026: లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ఈ సీజన్‌ను ఓపెనర్‌గా ప్రారంభించాడు. అక్కడ విఫలం కావడంతో తిరిగి మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తున్నాడు. గత సీజన్‌లో నాలుగో స్థానంలో ఆడిన ఆయన, ఈసారి పదే పదే బ్యాటింగ్ వరుసను మారుస్తున్నా ఫలితం మాత్రం ఆశాజనకంగా లేదు. ఎకానా స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన కీలక పోరులో ఓపెనర్ మిచెల్ మార్ష్ త్వరగానే అవుట్ కావడంతో పంత్ క్రీజులోకి వచ్చాడు. రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో మెరుపులు మెరిపించినప్పటికీ, ఆ జోరును కొనసాగించలేకపోయాడు.

సిరాజ్ ఉచ్చులో పంత్..

మొహమ్మద్ సిరాజ్ వేసిన బంతిని భారీ షాట్ ఆడే క్రమంలో పంత్ క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు. కేవలం 11 బంతుల్లో 18 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఈ సీజన్‌లో పంత్ 20 కంటే తక్కువ స్కోరుకే అవుట్ కావడం ఇది మూడోసారి. ఢిల్లీపై 7 పరుగులు, కోల్‌కతాపై 10 పరుగులు మాత్రమే చేసిన ఆయన, కేవలం హైదరాబాద్‌పై చేసిన 68 పరుగుల ఇన్నింగ్స్ మినహా మిగిలిన అన్ని మ్యాచ్‌ల్లోనూ ఘోరంగా విఫలమయ్యాడు.

వైభవ్ సూర్యవంశీ జోరు.. పంత్ బేజారు..

రిషబ్ పంత్ ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 4 ఇన్నింగ్స్‌లలో కలిపి మొత్తం 103 పరుగులు చేశాడు. అయితే 15 ఏళ్ల చిన్నారి వైభవ్ సూర్యవంశీ ఈ సీజన్‌లో తన బ్యాటింగ్ సత్తాతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. వైభవ్ ఇప్పటివరకు ఈ టోర్నీలో ఏకంగా 18 సిక్సర్లు బాదాడు. అంటే, కేవలం సిక్సర్ల ద్వారానే ఆయన 108 పరుగులు సాధించాడు. ఒక సీనియర్ ఆటగాడు, కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన కెప్టెన్ మొత్తం చేసిన పరుగుల కంటే, ఒక కుర్రాడు కేవలం సిక్సర్లతోనే ఎక్కువ పరుగులు చేయడం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.

లక్నో జట్టులో ఆందోళన..

భారీ ఆశలతో పంత్‌ను కెప్టెన్‌గా నియమించుకున్న లక్నో యాజమాన్యం, ఆయన వైఫల్యంతో ఆందోళన చెందుతోంది. బ్యాటింగ్ లైనప్‌లో స్థిరత్వం లేకపోవడం, కెప్టెన్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడలేకపోవడం జట్టు విజయ అవకాశాలను దెబ్బతీస్తోంది. రాబోయే మ్యాచ్‌ల్లోనైనా పంత్ తన సహజ సిద్ధమైన ఆటతీరుతో ఫామ్‌లోకి వస్తారో లేదో వేచి చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us