AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కెప్టెన్సీకి రిషబ్ పంత్ గుడ్ బై.. ఐపీఎల్ 2026లో చెత్త ప్రదర్శనే కారణమా..?

భారీ అంచనాలతో లక్నో జట్టులోకి అడుగుపెట్టిన రిషబ్ పంత్, కెప్టెన్సీ పరంగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నట్లు స్పష్టమవుతోంది. రూ. 27 కోట్ల రికార్డు ధరకు న్యాయం చేయలేకపోయాననే భావనతోనే ఆయన ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. కెప్టెన్సీ భారం దిగిపోవడంతో, రాబోయే రోజుల్లో పంత్ మళ్లీ తన పాత విధ్వంసకర బ్యాటింగ్‌తో ఫామ్‌లోకి రావాలని క్రికెట్ అభిమానులు ఆశిస్తున్నారు.

కెప్టెన్సీకి రిషబ్ పంత్ గుడ్ బై.. ఐపీఎల్ 2026లో చెత్త ప్రదర్శనే కారణమా..?
Rishabh Pant
Venkata Chari
|

Updated on: May 29, 2026 | 7:49 PM

Share

ఐపీఎల్‌లో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రికార్డు సృష్టించిన టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ప్రస్తుత సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఘోర వైఫల్యానికి బాధ్యత వహిస్తూ ఆయన జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. పంత్ అభ్యర్థనను ఫ్రాంచైజీ యాజమాన్యం కూడా తక్షణమే ఆమోదించింది.

లక్నో ఘోర వైఫల్యం.. పంత్ షాకింగ్ నిర్ణయం..

ఐపీఎల్ 2026 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ప్రదర్శన అత్యంత నిరాశాజనకంగా సాగింది. టోర్నీ ఆరంభం నుంచి వరుస పరాజయాలతో సతమతమైన లక్నో జట్టు, పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంతో ఈ సీజన్‌ను ముగించింది. ఆడిన 14 మ్యాచ్‌లలో కేవలం 4 మ్యాచ్‌లలో మాత్రమే విజయం సాధించి, 8 పాయింట్లతో అట్టడుగున నిలిచింది. ఈ ఘోర పరాభవానికి నైతిక బాధ్యత వహిస్తూ, కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు రిషబ్ పంత్ యాజమాన్యానికి తెలియజేశాడు. పంత్ తీసుకున్న ఈ హఠాత్ నిర్ణయాన్ని గౌరవిస్తూ, అతనిని బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్లు లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది.

బ్యాటింగ్‌లోనూ నిరాశ పరిచిన స్టార్ ప్లేయర్..

రిషబ్ పంత్ కేవలం కెప్టెన్‌గానే కాకుండా, బ్యాటర్‌గా కూడా ఈ సీజన్‌లో తీవ్రంగా నిరాశపరిచారు. మైదానంలో సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడే పంత్, ఈసారి లక్నో తరపున ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. మొత్తం 14 మ్యాచ్‌లాడిన ఆయన 138.05 స్ట్రైక్ రేట్‌తో కేవలం 312 పరుగులు మాత్రమే చేయగలిగాడు. పంత్ ఫామ్ కోల్పోవడం కూడా జట్టు పరాజయాలపై తీవ్ర ప్రభావం చూపింది. 2025 మెగా వేలంలో ఏకంగా రూ. 27 కోట్ల రికార్డు ధర వెచ్చించి లక్నో జట్టు పంత్‌ను సొంతం చేసుకుంది. అయితే, ఆయన నాయకత్వంలో గడిచిన రెండు సీజన్లలో లక్నో వరుసగా ఏడో స్థానం, ఆ తర్వాత పదో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

నిర్ణయాలు అంత సులువు కాదు: టామ్ మూడీ..

పంత్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంపై లక్నో సూపర్ జెయింట్స్ క్రికెట్ డైరెక్టర్ టామ్ మూడీ స్పందించాడు.

“రిషబ్ పంత్ స్వయంగా ఫ్రాంచైజీని సంప్రదించి కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని కోరాడు. ఆయన నిర్ణయాన్ని మేం గౌరవపూర్వకంగా అంగీకరించాం. ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం ఎవరికైనా అంత సులువు కాదు. కెప్టెన్‌గా డ్రెస్సింగ్ రూమ్‌లో రిషబ్ అందించిన సేవలకు మేం ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటాం. ఇప్పుడు మా దృష్టి అంతా జట్టును పునర్నిర్మించి, రాబోయే సీజన్లలో అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడంపైనే ఉంది” అని టామ్ మూడీ స్పష్టం చేశాడు.

కొత్త కెప్టెన్ ఎవరు?

రెండు సీజన్ల పాటు లక్నో జట్టుకు నాయకత్వం వహించిన పంత్.. మొత్తం 28 మ్యాచ్‌లలో కేవలం 10 విజయాలు మాత్రమే అందించగా, 18 మ్యాచ్‌లలో జట్టు ఓటమి చవిచూసింది. బ్యాటింగ్‌లోనూ రెండు సీజన్లు కలిపి కేవలం 581 పరుగులు మాత్రమే చేశాడు. పంత్ తప్పుకోవడంతో లక్నో తదుపరి సారథి ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అయితే కొత్త కెప్టెన్ ఎవరనేది ఫ్రాంచైజీ ఇంకా ప్రకటించలేదు. రాబోయే సీజన్‌లో సరికొత్త వ్యూహాలతో బరిలోకి దిగుతామని, త్వరలోనే కొత్త కెప్టెన్ వివరాలను వెల్లడిస్తామని యాజమాన్యం పేర్కొంది.

Follow Us