AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rinku Singh : అలిగిన బ్యాట్‌ను విచిత్రంగా శాంతపరిచిన రింకూ సింగ్.. వీడియో వైరల్

సాధారణంగా రక్షాబంధన్ పండుగ నాడు సోదరి తన సోదరుడికి రాఖీ కడుతుంది. కానీ టీమిండియా యువ క్రికెటర్ రింకూ సింగ్ తన జీవితాన్ని మార్చిన ఒక దానికి రాఖీ కట్టి అందరి మనసులను గెలుచుకున్నాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Rinku Singh : అలిగిన బ్యాట్‌ను విచిత్రంగా శాంతపరిచిన రింకూ సింగ్.. వీడియో వైరల్
Rinku Singh
Rakesh
|

Updated on: Aug 09, 2025 | 3:56 PM

Share

Rinku Singh : సాధారణంగా రక్షా బంధన్ రోజున అక్కాచెల్లెళ్లు తమ సోదరులకు రాఖీ కడతారు. కానీ, టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ రింకూ సింగ్ తన జీవితాన్ని మార్చేసిన దానికి రాఖీ కట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. రింకూ సింగ్ పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన మెరుపు బ్యాటింగ్‌తో టీమిండియాకు, ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ కు అనేక విజయాలను అందించిన రింకూ సింగ్, ఇటీవల సపా ఎంపీ ప్రియా సరోజ్‌తో ఎంగేజ్మెంట్ చేసుకుని వార్తల్లో నిలిచాడు. ఈ సందర్భంలో ఆయన రాఖీ కట్టిన ఈ వీడియో అభిమానుల మనసును గెలుచుకుంది.

ఐపీఎల్‌లో కేకేఆర్ తరపున ఆడే రింకూ సింగ్, 2023లో గుజరాత్ టైటాన్స్ పై వరుసగా ఐదు సిక్సర్లు కొట్టి జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. ఇప్పుడు అదే బ్యాట్‌కు రింకూ సింగ్ రాఖీ కట్టాడు. ఈ వీడియోలో అతను ఆ బ్యాట్‌ను చూస్తూ భావోద్వేగంతో మాట్లాడాడు. ఆ వీడియోలో, “నీ వల్ల నా కెరీర్ మొదలైంది. నీ వల్ల నేను ఒక సెలబ్రిటీ అయ్యాను. నీ వల్లే నా ప్రతి కల నిజమైంది. నీ వల్ల ఇప్పుడు ఆకాశం కూడా చిన్నదిగా అనిపిస్తోంది. ఆ ఐదు సిక్సర్ల వల్ల నా జీవితం ఒక అందమైన ప్రయాణంగా మారింది. హ్యాపీ రక్షాబంధన్” అని రింకూ అన్నాడు. ఈ వీడియోను రింకూ సింగ్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేయగా, అది ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఐపీఎల్ 2023లో కేకేఆర్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన 13వ మ్యాచ్ అది. గుజరాత్ జట్టు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో కేకేఆర్ జట్టుకు చివరి 6 బంతుల్లో 29 పరుగులు అవసరం. ఆ సమయంలో గుజరాత్ టైటాన్స్ విజయం ఖాయం అని అందరూ అనుకున్నారు. క్రీజ్‌లో రింకూ సింగ్ 16 బంతుల్లో 18 పరుగులు, ఉమేష్ యాదవ్ 4 పరుగులతో ఉన్నారు. చివరి ఓవర్‌ను గుజరాత్ బౌలర్ యశ్ దయాల్ వేశాడు. మొదటి బంతికి ఉమేష్ యాదవ్ సింగిల్ తీసి స్ట్రైక్ రింకూకు ఇచ్చాడు. అప్పుడు రింకూ సింగ్ చరిత్ర సృష్టించాడు.

రింకూ సింగ్ స్ట్రైక్‌లోకి వచ్చినప్పుడు కేకేఆర్ జట్టుకు 5 బంతుల్లో 28 పరుగులు కావాలి. యశ్ దయాల్ వేసిన ఆ ఐదు బంతులలో రింకూ సింగ్ వరుసగా ఐదు సిక్సర్లు కొట్టి, జట్టును మూడు వికెట్ల తేడాతో గెలిపించాడు. ఈ మ్యాచ్ తర్వాత రింకూ సింగ్ ఒక స్టార్ క్రికెటర్‌గా ఎదిగాడు. ఆ మ్యాచ్‌లో అతను 21 బంతుల్లో 1 ఫోర్, 6 సిక్సర్లతో 48 పరుగులు (నాటౌట్) చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి….