AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asia Cup 2022: టీమిండియా విక్టరీపై పొలిటికల్ పిచ్‌లో బౌండరీలు.. ప్రధాని మోడీ-షా మొదలు రాహుల్ వరకు ప్రశంసలు

India Victory: దాయాది దేశంపై ప్రతీకారం తీర్చుకుంది టీమిండియా. ఆల్‌ రౌండ్ షోతో అదరగొట్టి పాక్‌పై ఘన విజయం సాధించింది. ఓ దశలో గెలుస్తామా అన్న డౌట్‌..కానీ చివరి ఓవర్లో పాండ్యా సిక్సర్‌తో అభిమానులు సంబరాల్లో మునిగి తేలారు. సామాన్య ప్రజల నుంచి ప్రధాని మోదీ వరకు అంతా మ్యాచ్ చూసి సంబరపడిపోయారు.

Asia Cup 2022: టీమిండియా విక్టరీపై పొలిటికల్ పిచ్‌లో బౌండరీలు.. ప్రధాని మోడీ-షా మొదలు రాహుల్ వరకు ప్రశంసలు
India Victory
Sanjay Kasula
|

Updated on: Aug 29, 2022 | 9:46 AM

Share

ఉత్కంఠ మ్యాచ్‌లో భారత్‌ గెలుపుతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. అర్థరాత్రే రోడ్లపైకొచ్చిన ఫ్యాన్స్‌ పండుగ చేసుకున్నారు..జాతీయ జెండాలు చేతబట్టి నినాదాలతో హోరెత్తించారు. కోట్లాది మంది అభిమానులు ఈ విజయాన్ని అద్భుతంగా సెలబ్రేట్‌ చేసుకున్నారు. టీమిండియా విజయం దేశంలోని మిలియన్ల మంది అభిమానులతో పాటు రాజకీయ కారిడార్‌ను ఉర్రూతలూగించింది. భారత్ విజయంపై రాజకీయాల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్ రెండో మ్యాచ్‌లో టీమిండియా చివరి ఓవర్‌లో పాకిస్తాన్‌ను చిత్తు చేసింది. చాలా ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో దేశ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని తాకాయి.

టీం ఇండియా విజయం సాధించిన వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ బ్లూ బ్రిగేడ్‌కు అభినందనలు తెలిపారు. ఈ రోజు జరిగిన ఆసియా కప్ మ్యాచ్‌లో టీమిండియా అద్భుతమైన ఆల్ రౌండ్ ప్రదర్శన కనబరిచిందని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

హోంమంత్రి అమిత్ షా కూడా టీమిండియా విజయంపై అభినందనలు తెలిపారు. 2022 ఆసియా కప్‌లో టీమిండియాకు ఎంత గొప్ప ఆరంభం అని ట్వీట్‌ చేశారు. ఈ అద్భుత విజయం సాధించిన టీమ్ మొత్తానికి అభినందనలు. అని పోస్ట్ చేశారు.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఒక ట్వీట్‌లో, “అద్భుత విజయం! ఈరోజు పాకిస్తాన్‌ను ఓడించి భారత క్రికెట్ జట్టు తన ఆసియా కప్ ప్రయాణాన్ని అద్భుతంగా ప్రారంభించింది. టీమిండియాకు హృదయపూర్వక అభినందనలు. ఈ విజయ పరంపర నిరాటంకంగా కొనసాగుతుంది. ఇదే కోరిక. జై హో!” అంటూ ట్వీట్ చేశారు

ఈ విజయం పట్ల కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా ట్వీట్ చేసి సంతోషం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ ఇలా వ్రాశారు. “ఎంత ఉత్కంఠభరితమైన మ్యాచ్! టీమిండియా బాగా ఆడింది. క్రీడ అందం ఏమిటంటే అది గొప్ప ఆనందం, గర్వం భావంతో దేశాన్ని ఎలా ప్రేరేపిస్తుంది, ఏకం చేస్తుంది.

ప్రియాంక గాంధీ ఇలా రాశారు, “హుర్రే! మేం గెలిచాము. అద్భుతమైన ఆటతీరుతో పాటు విజయం సాధించినందుకు టీమిండియాకు అభినందనలు. బాగా ఆడారు, మ్యాన్ ఇన్ బ్లూ! జై హింద్!”

రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నాయకురాలు వసుంధర రాజే సింధియా కూడా ట్వీట్ చేయడం ద్వారా సంతోషం వ్యక్తం చేశారు. “మా మ్యాన్ ఇన్ బ్లూ గొప్ప ప్రదర్శన! ఆసియా కప్ 2022 మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై విజయం సాధించిన టీమిండియాకు అభినందనలు. కీప్ ఇట్ అప్ చాంప్స్!” అంటూ ట్వీట్ చేశారు.

నిన్న దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్ రెండో మ్యాచ్‌లో భారత్, పాకిస్తాన్ క్రికెట్ జట్లు తలపడిన సంగతి తెలిసిందే. టాస్ గెలిచిన టీమిండియా ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 147 పరుగులు చేసింది.

హార్దిక్ పాండ్యా సిక్స్ కొట్టి విజయం సాధించాడు..

లక్ష్యాన్ని ఛేదించిన టీమిండియా చివరి ఓవర్ నాలుగో బంతికే విజయం సాధించింది. బౌలింగ్, బ్యాటింగ్‌తో జౌహర్‌ని ప్రదర్శించిన టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. పాండ్యా మూడు వికెట్లు పడగొట్టి 33 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. సిక్సర్ కొట్టి జట్టుకు ఉత్కంఠ విజయాన్ని అందించాడు.

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం..