Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పేరుకేమో బౌలర్.. 9వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు.. 11 ఫోర్లు, 4 సిక్సర్లతో సెంచరీ బాదేశాడు..

రాజ్‌కోట్‌ వేదికగా జరుగుతున్న రంజీ ట్రోఫీ రెండో క్వార్టర్‌ ఫైనల్‌లో సౌరాష్ట్రకు చెందిన పార్థ్ భట్ అద్భుత సెంచరీతో అదరగొట్టాడు.

పేరుకేమో బౌలర్.. 9వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు.. 11 ఫోర్లు, 4 సిక్సర్లతో సెంచరీ బాదేశాడు..
Ranji Trophy
Follow us
Ravi Kiran

|

Updated on: Feb 01, 2023 | 10:04 AM

రాజ్‌కోట్‌ వేదికగా జరుగుతున్న రంజీ ట్రోఫీ రెండో క్వార్టర్‌ ఫైనల్‌లో సౌరాష్ట్రకు చెందిన పార్థ్ భట్ అద్భుత సెంచరీతో అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ 147 పరుగులకే 8 వికెట్లు కోల్పోగా.. 9వ స్థానంలో వచ్చిన బౌలర్ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ పార్థ్‌ భట్‌ (111 నాటౌట్‌; 11 ఫోర్లు, 4 సిక్సర్లు) అజేయ శతకంతో చెలరేగి తన జట్టుకు 303 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. అతడికి తోడుగా ఓపెనర్ స్నెల్‌ పటేల్‌ (70) అర్ధ సెంచరీతో రాణించాడు. వీరిద్దరూ మాత్రమే జట్టులో టాప్ స్కోరర్లు కాగా.. మిగిలిన ప్లేయర్స్ అందరూ కూడా తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. అలాగే ఈ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా స్థానంలో సౌరాష్ట్రకు అర్పిత్ వసవద సారధ్య బాధ్యతలు స్వీకరించారు. అటు పంజాబ్‌ బౌలర్లలో మార్కండే 4 వికెట్లు, బల్తేజ్‌ సింగ్‌, సిద్ధార్థ్‌ కౌల్‌ చెరో 2 వికెట్లు, నమన్‌ ధిర్‌ ఓ వికెట్‌ తీశారు.

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం..